Breaking News

ఏడాదిలో 4000 కోట్ల స్పామ్‌ కాల్స్‌!

Published on Thu, 02/12/2026 - 14:24

భారత్‌ డిజిటల్ విప్లవం దిశగా దూసుకుపోతున్న వేళ స్పామ్ కాల్స్, సైబర్ మోసాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. 2025 సంవత్సరంలో భారతీయులకు ఏకంగా 4,000 కోట్లకు పైగా స్పామ్ కాల్స్ వచ్చినట్లు ‘ట్రూకాలర్ ఇండియా ఇన్‌సైట్స్‌ రిపోర్ట్ 2025’ కొన్ని విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ.. వికసిత్ భారత్ విజన్‌లో భాగంగా దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారుతున్న తరుణంలో కమ్యూనికేషన్ వ్యవస్థపై నమ్మకం చాలా కీలకమన్నారు. ‘ఈ రోజుల్లో మోసం అనేది కేవలం సాంకేతిక సమస్య కాదు, అది మానవ బలహీనతలతో ఆడుకునే ప్రక్రియ. భయం, అత్యవసరం, అనిశ్చితిని పెట్టుబడిగా చేసుకుని స్కామర్లు రెచ్చిపోతున్నారు. ప్రతి భారతీయుడికి డిజిటల్‌ భద్రత కల్పించాలన్నదే మా లక్ష్యం’ అన్నారు.

నివేదిక ప్రకారం, గడిచిన ఏడాదిలో నమోదైన స్పామ్ కాల్స్ వివరాలు ఇలా ఉన్నాయి:

మొత్తం స్పామ్ కాల్స్: 4,168 కోట్లు.

బ్లాక్ చేసిన కాల్స్: 1,189 కోట్లు (యూజర్లకు చేరకముందే సాంకేతికతతో నిరోధించినవి).

మోసపూరిత కాల్స్: సుమారు 770 కోట్లు. ఇవి ప్రధానంగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ల పేరుతో వచ్చాయి.

స్పామ్ ఎస్‌ఎంఎస్‌లు: ఏడాది పొడవునా 12,903 కోట్ల స్పామ్ సందేశాలు నమోదయ్యాయి.

స్పామ్ కాల్స్ నిరోధించడం వల్ల కేవలం మోసాలు తగ్గడమే కాకుండా ప్రజల విలువైన సమయం కూడా ఆదా అవుతోంది. కమ్యూనిటీ రిపోర్టింగ్ ద్వారా భారతీయులకు రోజుకు సుమారు 21.7 లక్షల గంటల సమయం ఆదా అవుతోందని నివేదిక పేర్కొంది. దీనివల్ల అనవసరపు ఒత్తిడి తగ్గడమే కాకుండా హడావుడిలో తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను నివారించవచ్చు.

2026లో పొంచి ఉన్న ముప్పు

రాబోయే రోజుల్లో మోసగాళ్లు మరింత అధునాతన పద్ధతులను అవలంబిస్తారని నివేదిక హెచ్చరించింది. అందులో ఏఐ సృష్టించిన వాయిస్ స్కామ్స్, కాల్స్, మెసేజ్‌లతో చేసే మోసాలు ఉండనున్నాయి. ఇతరుల పేర్లతో డిజిటల్ ఐడెంటిటీని దొంగిలించడం వంటి మోసాలు ఎక్కువగా జరగవచ్చని అంచనా.

జాగ్రత్తలు

అత్యవసరమని వచ్చే కాల్స్‌ను వెంటనే నమ్మకుండా ధ్రువీకరించుకోవాలి. వ్యక్తిగత వివరాలను, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదు. నమ్మకమైన కాలర్ ఐడీ సాధనాలను ఉపయోగించాలి. డిజిటల్ సాధికారత సాధించే క్రమంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండటమే అసలైన రక్షణ అని గుర్తించాలి.

ఇదీ చదవండి: ‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు!

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)