Breaking News

రూ.20 లక్షలకే టెస్లా కారు!

Published on Mon, 07/26/2021 - 19:23

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా తన ప్రత్యర్డుల కంటే వేగంగా ప్రణాళికలు రచిస్తుంది. గత త్రైమాసికంలో రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలను టెస్లా జరిపింది. అయితే, ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దూసుకెళ్తున్న ఎలోన్ మస్క్ బ్యాటరీలు, కొత్త కర్మాగారాలు, కొత్త కార్ల నమూనాల పరంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గత కొద్ది నెలల నుంచి టెస్లా షేర్ విలువ పడిపోవడంతో పాటు మార్కెట్లోకి కొత్త పోటీదారులు దూసుకొనిరావడంతో టెస్లా విషయంలో పెట్టుబడుదారులు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానంగా గత సెప్టెంబర్లో ఎలోన్ మస్క్ కొత్త డిజైన్ తో తన స్వంత బ్యాటరీ సెల్స్ ను ఉత్పత్తి చేయడానికి ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించారు. 

రాబోయే కొత్త తరం బ్యాటరీలు అధిక శక్తి సాంద్రతను కలిగి ఉంటాయి అని మస్క్ పేర్కొన్నారు. ఈ కొత్త బ్యాటరీ టెక్నాలజీ వల్ల ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు వాహనాల తయారీ ఖర్చు తగ్గనున్నట్లు తెలిపారు. టెస్లా రాబోయే మూడు సంవత్సరాలలో $25,000 (సుమారు రూ.18 లక్షలు) కారును తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుంది అని అన్నారు. వచ్చే ఏడాది నుంచి కొత్త తరం 4680 బ్యాటరీలు ఎక్కువ మొత్తంలో తయారు చేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న టెక్సాస్ కర్మాగారం నుంచి రాబోయే మోడల్ వైలో వాటిని ఉపయోగించనున్నట్లు ఆయన చెప్పారు.

ఇప్పుడు, 4680 బ్యాటరీలతో వాహనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా టెస్లా పెట్టుకున్నట్లు ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు రాయిటర్స్ కు చెప్పారు. టెస్లా 4680 బ్యాటరీలను అభివృద్ధి చేయడానికి పానాసోనిక్ తో కలిసి పనిచేయనున్నట్లు మస్క్ చెప్పారు. మరో టెస్లా సరఫరాదారుడు ఎల్‌జీ కంపెనీ 2023 నాటికి టెస్లా కోసం 4680 బ్యాటరీ సెల్స్ ను ఉత్పత్తి చేయడానికి కృషి చేస్తోందని రాయిటర్స్ ఇంతకు ముందు నివేదించింది.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)