Breaking News

వాటా విక్రయానికి యస్‌

Published on Sat, 05/10/2025 - 06:00

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ)సహా పలు ప్రయివేట్‌ రంగ బ్యాంకులు సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న యస్‌ బ్యాంక్‌లో కొంతమేర వాటా విక్రయించనున్నాయి. తద్వారా జపనీస్‌ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌(ఎస్‌ఎంబీసీ) మొత్తం 20 శాతం వాటా సొంతం చేసుకోనుంది. ఒక్కో షేరుకి రూ. 21.50 ధరలో ఇందుకు రూ. 1,483 కోట్లు వెచ్చించనుంది.

 వెరసి దేశీ బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద లావాదేవీగా ఈ వాటా విక్రయం నమోదుకానున్నట్లు యస్‌ బ్యాంక్‌ పేర్కొంది. ఎస్‌ఎంబీసీకి యస్‌ బ్యాంక్‌లో 13.19 శాతం వాటా ఎస్‌బీఐ విక్రయించనుంది. డీల్‌ విలువ రూ. 8,889 కోట్లు. ఈ బాటలో ఇతర బ్యాంకులు యాక్సిస్, బంధన్, ఫెడరల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, కొటక్‌ మహీంద్రా ఉమ్మడిగా 6.81 శాతం వాటా అమ్మనున్నాయి. వీటి విలువ రూ. 4,594 కోట్లు. ఫలితంగా యస్‌ బ్యాంక్‌లో అతిపెద్ద వాటాదారుగా ఎస్‌ఎంబీసీ అవతరించనుంది.  

2020 మార్చిలో 
యస్‌ బ్యాంక్‌ పునర్‌నిర్మాణ పథకంలో భాగంగా 2020 మార్చిలో ఎస్‌బీఐసహా 7 ప్రయివేట్‌ రంగ బ్యాంకులు ఇన్వెస్ట్‌ చేశాయి. సెంట్రల్‌ బోర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ(ఈసీసీబీ) యస్‌ బ్యాంక్‌లో 13.19 శాతం వాటాకు సమానమైన 413.44 కోట్ల షేర్లను విక్రయించేందుకు అనుమతించినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. యస్‌ బ్యాంక్‌లో ప్రస్తుతం ఎస్‌బీఐ 24 శాతం వాటా కలిగి ఉంది. 13 శాతంపైగా వాటా అమ్మకం ద్వారా రూ. 8,889 కోట్లు అందుకోనుంది. ఇతర బ్యాంకులలో హెచ్‌డీఎఫ్‌సీ 2.75 శాతం, ఐసీఐసీఐ 2.39 శాతం, కొటక్‌ మహీంద్రా 1.21 శాతం, యాక్సిస్‌ 1.01 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ 0.92 శాతం, ఫెడరల్‌ 0.76 శాతం, బంధన్‌ 0.7 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. తదుపరి దశ వృద్ధికి తాజా లావాదేవీ దోహదపడనున్నట్లు యస్‌ బ్యాంక్‌ ఈ సందర్భంగా పేర్కొంది. కాగా.. ఇందుకు ఆర్‌బీఐ, సీసీఐ తదితర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించవలసి ఉంది. 

టాప్‌–2లో 
జపనీస్‌ దిగ్గజం సుమితోమొ మిత్సుయి ఫైనాన్షియల్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ ఎస్‌ఎంబీసీ 2 ట్రిలియన్‌ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. తద్వారా జపాన్‌లో రెండో పెద్ద బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌గా నిలుస్తోంది. దేశీయంగా ప్రధాన విదేశీ బ్యాంకులలో ఒకటిగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా సొంత అనుబంధ సంస్థ, డైవర్సిఫైడ్‌ ఎన్‌బీఎఫ్‌సీ.. ఎస్‌ఎంఎఫ్‌జీ ఇండియా క్రెడిట్‌ కంపెనీని నిర్వహిస్తోంది. 

వాటా చేతులు మారుతున్న వార్తలతో యస్‌ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో 10 శాతం జంప్‌చేసి రూ. 20 వద్ద ముగిసింది. 
 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)