Breaking News

స్మార్ట్‌ఫోన్లు, పీసీల తయారీ కేంద్రంగా భారత్‌ 

Published on Tue, 04/22/2025 - 05:41

ముంబై: అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం భారత్‌కు అనూకూలంగా మారుతోంది. అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాబ్‌లు/వ్యక్తిగత కంప్యూటర్‌ (పీసీలు) సంస్థలు తమ ఉత్పత్తి కర్మాగారాలను చైనా నుంచి భారత్‌కు తరలించే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం  అగ్రరాజ్యల మధ్య సుంకాల విధింపులు,  ప్రతీకార టారిఫ్‌ల ఉద్రికత్తలు కొనసాగితే.., అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ల మొత్తం ఉత్పత్తిలో డ్రాగన్‌ దేశపు వాటా 2026 నాటికి 55 శాతానికి పడిపోయే వీలుంది. గత సంవత్సరం(2024) ఈ వాటా 64 శాతంగా ఉంది. ఇదే సమయంలో భారత్‌ నుంచి ముఖ్యంగా అమెరికాకు యాపిల్, శాంసంగ్‌ ఎగుమతులు జోరందుకోనున్నాయి. అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ల మొత్తం ఉత్పత్తిలో భారత్‌ వాటా 2026 నాటికి 25–28 శాతానికి చేరొవచ్చు. కాగా గత సంవత్సరంలో ఈ వాటా 18 శాతంగా ఉంది. 

→ అంతర్జాతీయంగా ఐఫోన్ల ఉత్పత్తి విలువలో భారత్‌ ఎగుమతుల వాటా ప్రస్తుతం 20 శాతంగా ఉంది. ఇది 2025–26 కల్లా 25 శాతానికి, 2026–27 నాటికి 35 శాతానికి చేరుతుందని కౌంటర్‌పాయింట్‌ అంచనా వేస్తోంది.   
→ ల్యాప్‌ట్యాబ్‌లు/ పీసీల మొత్తం తయారీలో చైనా వాటా 2026 నాటికి 68–70 శాతానికి దిగివచ్చే అవకాశం ఉంది. 2024లో ఈ వాటా 75 శాతంగా ఉంది. అంతర్జాతీయ ల్యాప్‌ట్యాబ్‌ల ఉత్పత్తిలో భారత్‌ వాటా 2026 నాటికి ఏడు శాతానికి చేరుకోవచ్చు. 2024లో భారత్‌ వాటా కేవలం నాలుగు శాతంగా ఉంది. 

‘‘ల్యాప్‌ట్యాబ్‌లు, పీపీలు చైనా నుంచే అధికంగా దిగుమతి అవుతున్నాయి. వాణిజ్య వార్‌ నేపథ్యంలో హెచ్‌పీ, డెల్‌ ఇతర సంస్థలు తమ ఉత్పత్తి స్థావరాలు చైనా నుంచి భారత్‌కు మారిస్తే అంతర్జాతీయంగా దేశీయ మార్కెట్‌ వాటా పెరగడమే కాకుండా ఎగుమతులు సైతం గణనీయంగా పెరుగుతాయి. భారత్‌ సైతం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఐటీ హార్డ్‌వేర్‌ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం’ వంటి పథకాలు ప్రవేశపెట్టింది’’ అని ఇండియన్‌ సెల్యూలర్‌ అండ్‌ 
ఎల్రక్టానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) సభ్యుడొకరు తెలిపారు. 

అంత సులువేం కాదు: చైనా నుంచి తయారీ కర్మాగారాలను భారత్‌కు తరలించడం అంత సులువు కాదని కాన్లేస్‌ నివేదిక చెబుతోంది. డెల్‌ సంస్థ ల్యాప్‌ట్యాబ్‌ల ఉత్పత్తి 79% చైనాలో ఉండగా, మిగిలినదంతా వియత్నాంలో ఉంది. కాన్లేస్‌ రిపోర్ట్‌ ప్రకారం 2026 నాటికి డెల్‌ తన తయారీ సామర్థ్యాన్ని సగానికిపైగా వియత్నాంకు తరలించనుంది. లెనివో సైతం వియత్నాంను ప్రత్యమ్నాయ దేశంగా చూస్తోంది. చైనాలో 85% తయారీ సామర్థ్యం ఉన్న హెచ్‌పీ.. 2026 కల్లా మెక్సికో, తైవాన్‌ దేశాలకు 45% మార్చనుంది.  


 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)