Breaking News

డిజిటల్‌ మోసాల బాధితులకు ఊరట

Published on Sat, 03/07/2026 - 08:17

డిజిటల్‌ బ్యాంకింగ్ విభాగంలో శరవేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఖాతాదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. అనధికార లావాదేవీల వల్ల నష్టపోయే వినియోగదారులకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా కస్టమర్ బాధ్యత (కస్టమర్‌ లయబిలిటీ) ఫ్రేమ్‌వర్క్‌లో సవరణలను ప్రతిపాదిస్తూ ఆర్‌బీఐ ముసాయిదా జారీ చేసింది.

ముసాయిదాలోని ప్రధానాంశాలు

  • మోసపూరిత లావాదేవీలకు సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే బ్యాంకులు స్పందించే సమయాన్ని భారీగా తగ్గించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న జాప్యాన్ని తగ్గించి నిర్ణీత కాలవ్యవధిలోగా సమస్యను పరిష్కరించేలా నిబంధనలను కఠినతరం చేశారు.

  • 2017లో ప్రవేశపెట్టిన ప్రస్తుత నిబంధనలు అప్పటి డిజిటల్ వ్యవస్థకు అనుగుణంగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు మారిన టెక్నాలజీ నేపథ్యంలో కొత్త తరహా మోసాలను కూడా ఈ పరిధిలోకి చేర్చారు.

  • తక్కువ విలువ గల మోసపూరిత లావాదేవీల విషయంలో వినియోగదారులకు వేగంగా నగదు వాపసు అందేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రతిపాదించారు.

  • భవిష్యత్తులో మోసాలకు సంబంధించి బ్యాంకులు భరించే పరిహారం వాటాను పెంచే దిశగా ఆర్‌బీఐ యోచిస్తోంది.

ఎందుకు ఈ మార్పు?

గత ఎనిమిదేళ్లలో దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు సైతం సరికొత్త పద్ధతుల్లో ఖాతాదారులను మోసం చేస్తున్నారు. ఫిబ్రవరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ప్రకటించిన విధంగానే ఆర్‌బీఐ ఈ సమీక్షా ప్రక్రియను చేపట్టింది. ‘2017 నుంచి డిజిటల్ బ్యాంకింగ్ ఎకోసిస్టమ్‌ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుత సవరణలు వినియోగదారుల నమ్మకాన్ని పెంచడమే కాకుండా, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత పారదర్శకంగా మారుస్తాయి’ అని ఆర్‌బీఐ ప్రతినిధి తెలిపారు.

ఈ కొత్త మార్గదర్శకాలపై వాటాదారులు, ప్రజలు తమ అభిప్రాయాలను, సూచనలను ఏప్రిల్ 6, 2026 లోపు సమర్పించాలని ఆర్‌బీఐ కోరింది. కొత్త ఆదేశాలు అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది పాటు ఈ పరిహార ఏర్పాటు అమలులో ఉంటుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా నిబంధనలను మరింత సమీక్షించనున్నారు.

ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో పనితీరుపై సమీక్ష

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)