Breaking News

ఎస్‌ఎంఎస్‌ల పేరుతో రూ.3,388 కోట్ల వసూలు

Published on Sat, 02/14/2026 - 13:33

టెలికాం కంపెనీలు తమ ప్రమోషన్ల కోసం రోజూ వందల కొద్దీ మెసేజ్‌లను ఉచితంగా పంపిస్తుంటే, మన సొమ్ముకు భద్రతనిచ్చే బ్యాంకులు మాత్రం ప్రతి ఎస్‌ఎంఎస్‌కు ఛార్జీలు వసూలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితంగా అందించిన సేవలే ఇప్పుడు బ్యాంకుల ఆదాయ వనరులుగా మారాయి. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2023–25) కేవలం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్‌ఎంఎస్‌ సేవల ద్వారా ఏకంగా రూ.3,388 కోట్లు వసూలు చేశాయని పార్లమెంట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

భారీగా వసూళ్లు: టాప్ 6 బ్యాంకుల జాబితా

ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ల పేరుతో అత్యధికంగా వసూలు చేసిన బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

బ్యాంక్వసూలు చేసిన సొమ్ము (రూ. కోట్లలో)
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా1,188.14
కెనరా బ్యాంక్506.28
పంజాబ్ నేషనల్ బ్యాంక్360.45
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా308.72
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్204.89
బ్యాంక్ ఆఫ్ బరోడా202.42

 

గమనిక: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ 2020 నుంచి ఎస్‌ఎంఎస్‌ సేవలపై ఛార్జీలను రద్దు చేయడం గమనార్హం.

ఉచితం నుంచి ఛార్జీల వైపు.. ఎందుకు?

ప్రారంభంలో డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి బ్యాంకులు ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లను ఉచితంగా అందించాయి. అయితే, ప్రతి ఎస్‌ఎంఎస్‌కు టెలికాం కంపెనీలకు బ్యాంకులు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యయాన్ని కస్టమర్ల నుంచే వసూలు చేయడం బ్యాంకులు ప్రారంభించాయి. ట్రాయ్ నిబంధనల ప్రకారం, కమర్షియల్ ఎస్‌ఎంఎస్‌ల నియంత్రణకు ‘డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ’(డీఎల్‌టీ) అమలులోకి వచ్చింది. దీనివల్ల బ్యాంకులపై నిర్వహణ భారం పెరిగింది. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల ఏర్పడే ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు బ్యాంకులు సర్వీస్ ఛార్జీలపై దృష్టి పెట్టాయి.

కేవలం ఎస్‌ఎంఎస్‌లే కాదు.. ఏటీఎంలు కూడా!

గతంలో ఉచితంగా లభించి ప్రస్తుతం భారంగా మారిన సేవల్లో ఏటీఎం లావాదేవీలు ప్రధానమైనవి. ఒకప్పుడు ఎన్నిసార్లైనా ఉచితంగా డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి అదనంగా ఛార్జీలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి వస్తోంది. ఖాతాలో మినిమం బ్యాలెన్స్‌ లేకపోతే జరిమానాల రూపంలో బ్యాంకులు భారీగా వసూలు చేస్తున్నాయి. ఏటా డెబిట్ కార్డ్ మెయింటెనెన్స్ పేరుతో రూ.150 నుంచి రూ.500 వరకు బ్యాంకులు కట్ చేస్తున్నాయి. బ్రాంచ్‌కు వెళ్లి నగదు జమ చేసినా లేదా విత్‌డ్రా చేసినా నెలకు నిర్ణీత పరిమితి దాటితే ఛార్జీలు వర్తిస్తున్నాయి.

సామాన్యుడి పొదుపుపై బ్యాంకులు ఈ స్థాయిలో ఛార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. ఒకవైపు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూనే, మరోవైపు భద్రత కోసం ఇచ్చే ఎస్‌ఎంఎస్‌లపై కూడా భారం మోపడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్‌బీఐ బాటలోనే మిగిలిన బ్యాంకులు కూడా కనీసం ప్రాథమిక ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లను ఉచితంగా అందిస్తే సామాన్యులకు ఊరట లభిస్తుంది.

ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..

Videos

బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?

ఇది రాష్ట్రం కోసం పెట్టిన బడ్జెట్ కాదు జగన్ కోసం పెట్టిన బడ్జెట్..

చెయ్యి ఆయనది, గడ్డం ఆయనది.. మీకేంటి నొప్పి?

అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్

కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్

పవన్ వారసుడు అకీరా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

చంద్రబాబు లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి అసలు కారణం ఇదే..

నీకు అంత దమ్ముంటే హెరిటేజ్ నాది కాదు అని చెప్పు

ఛత్తీస్ గఢ్ లోని దాంతరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పంచారామ క్షేత్రంలో అపచారం

Photos

+5

సాహసం శ్వాసగా సాగిపో: విశాఖలో నేవీ విన్యాసాలు (ఫొటోలు)

+5

విశ్వక్‌సేన్‌ 'ఫంకీ' సక్సెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రావెల్‌ అడ్వెంచర్‌ టాక్‌ షో 'సోల్‌ ట్రిప్‌' (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నరేశ్‌- పవిత్ర (ఫోటోలు)

+5

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ ! (ఫొటోలు)

+5

డాక్టర్‌గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)

+5

క్రిస్టల్‌ ఐవరీ లెహంగాలో పాలరాతి శిల్పంలా రాధికా స్టన్నింగ్‌ లుక్స్‌ ..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)

+5

బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? (ఫోటోలు )