Breaking News

అలర్ట్‌: ‘ఫోన్‌పే’లో అందుబాటులోకి వచ్చిన ఫీచర్‌ ఏంటో తెలుసా?

Published on Thu, 05/04/2023 - 11:16

ప్రముఖ దేశీయ ఫిన్‌టెక్‌ కంపెనీ ఫోన్‌పే యూపీఐ పేమెంట్‌ కోసం లైట్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫీచర్‌ వల్ల రూ.200 లోపు చిన్న చిన్న లావాదేవీల కోసం ఎలాంటి పిన్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది.

ఇప్పటికే ఫోన్‌పే ప్రత్యర్ధి సంస్థ పేటీఎం ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో యూపీఐ లైట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఫోన్‌పే సైతం ఈ సరికొత్త సేవల్ని వినియోగించేలా యూజర్లకు అవకాశం కల్పించింది. 

చిన్న చెల్లింపుల కోసం ముందుగానే యూపీఐ లైట్‌లో రూ.2,000 వరకు జమ చేసుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది. ఫలితంగా బ్యాంకు ఖాతాతో సంబంధం లేకుండా వేగంగా చెల్లింపులు పూర్తవుతాయి. చెల్లింపులు జరిగే సమయంలో ఎలాంటి అవాంతరాలు ఉండవని వెల్లడించింది.  

అన్నీ బ్యాంకుల సపోర్ట్‌ 
ఫోన్‌పే యూపీఐ లైట్‌కు దేశంలో అన్నీ బ్యాంకుల్లో వినియోగించుకోవచ్చని ఆ సంస్థ సీఈవో సమీర్‌ నిఘమ్‌ చెప్పారు. యూపీఐ మర్చంట్‌, క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులకు అనుమతిస్తున్నట్లు  పేర్కొన్నారు.

బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌తో పనిలేదు
వీటితో పాటు యూపీఐ లైట్‌ వినియోగంతో ఆయా ట్రాన్సాక్షన్‌లపై యూజర్లకు మెసేజ్‌ అలెర్ట్‌ వెళ్లనుంది. యూజర్లు ఏ రోజు ఎన్ని లావాదేవీలు జరిపారో తెలుసుకునేందుకు వీలుగా ట్రాన్సాక్షన్‌ హిస్టరీ చూడొచ్చు. దీనికి సంబంధించి మెసేజ్‌ అలెర్ట్‌ పొందవచ్చు. తద్వారా చెల్లింపులపై బ్యాంక్‌ స్టేట్మెంట్‌, పాస్‌బుక్‌ అవసరం తీరిపోనుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

చెల్లింపుల్ని సులభతరం చేసేందుకే 
అయితే ఈ యూపీఐ లైట్‌ ఫీచర్‌ ద్వారా దేశంలో ప్రతి రోజు జరిగే చిన్న చిన్న లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఫోన్‌పేలో ఈ కొత్త ఆప్షన్‌ను అభివృద్ది చేసినట్లు ఫోన్‌పే కో- ఫౌండర్‌, సీటీవో రాహుల్‌ చారి చెప్పినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఎన్‌సీపీఐ నిర్ణయం.. యూపీఐ లైట్‌కి ఊతం
ఇటీవల కాలంలో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలలో జరిపే లావాదేవీల సమయంలో నెట్‌వర్క్‌ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించేలా గత ఏడాది డిసెంబర్‌లో నేషనల్ పేమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీపీఐ) నెట్‌వర్క్‌ లేకపోయినా రూ.200 లోపు చిన్న చిన్న లావాదేవీలు జరిపేలా అనుమతిచ్చింది.  

చదవండి👉 కొనసాగుతున్న తొలగింపులు.. దిగ్గజ ఐటీ కంపెనీలో 600 మందిపై వేటు! 

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)