Breaking News

చరిత్ర సృష్టించిన మైక్రోసాఫ్ట్‌..!

Published on Wed, 06/23/2021 - 19:10

వాషింగ్టన్‌: ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ మంగళవారం రోజున చరిత్ర సృష్టించింది. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ మార్కెట్‌ క్యాపిటల్‌ విలువ సుమారు రెండు ట్రిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 1,48,50,100 కోట్లు)కు చేరింది. దీంతో అమెరికాలో ఆపిల్‌ కంపెనీ తరువాత రెండు ట్రిలియన్‌ క్లబ్‌లోకి చేరిన రెండో కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ నిలిచింది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సాఫ్ట్‌వేర్‌ విభాగాల్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. మంగళవారం రోజు మైక్రోసాఫ్ట్‌ కంపెనీ షేర్లు 1.2 శాతాన్ని ఎగబాకాయి. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ప్రస్తుత షేర్‌ విలువ 266.34 డాలర్ల వద్ద స్థిరపడింది.

2014 నుంచి మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా సత్య నాదెళ్ల పగ్గాలు చేపట్టినప్పటినుంచి మైక్రోసాఫ్ట్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత ఏడు సంవత్సరాల నుంచి సత్య నాదెళ్ల రాకతో కంపెనీ షేర్‌ వాల్యూను పరుగులు పెట్టించారు. అంతేకాకుండా క్లౌడ్‌ టెక్నాలజీ, మొబైల్‌ కంప్యూటింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ విభాగాల్లో ప్రముఖ దిగ్గజ కంపెనీలతో పోటి పడేలా చేశారు. తాజాగా మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు.

అమెరికన్ యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ల బిల్లుల నుంచి తప్పించుకున్న అతిపెద్ద యుఎస్ టెక్నాలజీ కంపెనీలలో మైక్రోసాఫ్ట్ మాత్రమే ఒకటిగా నిలిచింది. దీంతో కంపెనీకి సముపార్జన విషయంలో, ఉత్పత్తి విస్తరణ రెండింటిలోనూ స్వేచ్ఛాను కల్గిస్తుంది. మైక్రోసాఫ్ట్‌ ప్రపంచవ్యాప్త విస్తరణలో భాగంగా కొత్త డేటా సెంటర్‌ను ను స్పెయిన్‌లో ఏర్పాటుచేయనుంది. టెలిఫోనికా కంపెనీ భాగస్వామ్యంతో ఈ డేటాసెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.

చదవండి: ఇక్కడ మొబైల్‌లో చూస్తే.... అక్కడ కాసులు వర్షం

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)