మహీంద్రా చేతికి స్ప్రేయర్ల తయారీ కంపెనీ.. నెక్స్ట్ ప్లాన్ అదేనా?

Published on Tue, 03/21/2023 - 07:03

న్యూఢిల్లీ: స్ప్రేయర్ల తయారీ కంపెనీ మిత్రా ఆగ్రో ఎక్విప్‌మెంట్స్‌లో వాటాను 100 శాతానికి పెంచుకున్నట్టు మహీంద్రా అండ్‌ మహీంద్రా సోమవారం ప్రకటించింది. ఇప్పటి వరకు మహీంద్రాకు ఈ కంపెనీలో 47.33 శాతం వాటా ఉంది. ఓమ్నివోర్‌ పూర్తి వాటాను మహీంద్రా చేజిక్కించుకుంది. తాజా వాటాలను ఎంతకు దక్కించుకున్నదీ కంపెనీ వెల్లడించలేదు.

వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల వ్యాపారంలో అయిదేళ్లలో 10 రెట్లు వృద్ధి చెందాలన్నది మహీంద్రా లక్ష్యం. వాటా కొనుగోలు సంస్థ వృద్ధికి దోహదం చేయడంతోపాటు పెరుగుతున్న ఉద్యాన పంటల రంగంలో విస్తరణకు ఆస్కారం ఉందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ విభాగం ప్రెసిడెంట్‌ హేమంత్‌ సిక్కా తెలిపారు.

(ఇదీ చదవండి: భార‌త్‌లో 2023 టయోట ఇన్నోవా క్రిస్టా లాంచ్ - ధర ఎంతో తెలుసా?)

పండ్ల తోటల్లో వాడే స్ప్రేయర్ల తయారీలో ఉన్న మిత్రా ఆగ్రో 2012లో ప్రారంభమయింది. ఇందులో 200 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2017 - 2018తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ మూడింతల ఆదాయాన్ని ఆర్జించింది. ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. నూతన ఉత్పత్తుల తయారీతోపాటు భారత్‌ సహా విదేశీ మార్కెట్లలో విస్తరణకు యోచిస్తోంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ