Breaking News

ఈవీ ఛార్జింగ్ సదుపాయాల కల్పన కోసం మెజెంటా భారీ పెట్టుబడులు

Published on Wed, 11/24/2021 - 19:23

ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన కోసం పెట్టుబడులు పెట్టడానికి మెజెంటా ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంఒయు) చేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, మెజెంటా ఎండి, సీఈఓ మాక్సన్ లూయిస్ సమక్షంలో ఈ ఎంఒయుపై సంతకాలు చేశారు. కోయంబత్తూరులో జరిగిన తమిళనాడు ఇన్వెస్ట్ మెంట్ కాన్ క్లేవ్ 2021లో ఈ ఒప్పందం కింద మెజెంటా దాదాపు రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ-మొబిలిటీ ప్రపంచంలో ఈవీ టెక్నాలజీల డిజైన్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్, ఆర్కిటెక్చర్ ప్రమాణాలపై దృష్టి సారించే తయారీ యూనిట్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు.

తమిళనాడులో కొత్త తయారీ ప్లాంట్ వల్ల ఈ ప్రాంతంలోని స్థానిక సమాజాలకు ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని, రాష్ట్రంలో రాబోయే రెండేళ్లలో సుమారు 500 ఉద్యోగాలను సృష్టిస్తుందని మెజెంటా చెప్పారు. ఇంకా, రాబోయే ఐదేళ్లలో 1,600 మందికి పైగా ఉద్యోగులను చేర్చుకొనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో ఈవీ ఛార్జర్ తయారీ, అసెంబ్లీ, ఇన్ స్టలేషన్ వంటి కార్యకలాపాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. సోలార్ ఆధారిత ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ వే భారతదేశపు మొదటి ఈవీ ఛార్జింగ్ కారిడార్ రూపకల్పనలో సహాయం, మొబైల్ లోని అన్ని ఛార్జింగ్ స్టేషన్ల ఇంటిగ్రేటెడ్, ఆటోమేటెడ్ నెట్ వర్క్ ఛార్జ్ గ్రిడ్ యాప్ సేవలు అందించనున్నట్లు మెజెంటా చెప్పారు. 

(చదవండి: విద్యార్థినులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌!)

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)