Breaking News

ఎల్‌ఐసీ నుంచి కొత్త ఫండ్‌..

Published on Mon, 01/27/2025 - 17:48

ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ (LIC Mutual Fund) ‘మల్టీ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్‌’ను (multi asset allocation fund) ప్రారంభించింది. ఈక్విటీ, డెట్, బంగారం సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడుల విలువను వృద్ధి చేసే విధంగా పథకం పనిచేస్తుంది. ఫిబ్రవరి 7 వరకు ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకం చందాలకు అందుబాటులో ఉంటుంది.

అంతేకాదు ఫిబ్రవరి 18 నుంచి అమ్మకాలు, కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఈ పథకంలో 65 శాతం పెట్టుబడులకు నిఫ్టీ 500 టీఆర్‌ఐ, 25 శాతం పెట్టుబడులకు నిఫ్టీ కాంపోజిట్‌ డెట్‌ ఇండెక్స్, 10 శాతం పెట్టుబడులకు బంగారం మర్కెట్‌ ధరలు ప్రామాణికంగా ఉంటాయి. ఒకే పథకం ద్వారా ఒకటికి మించిన సాధనాల్లో పెట్టుబడికి ఈ పథకం వీలు కల్పిస్తుంది.

యాక్సిస్‌ నిఫ్టీ500 మొమెంటం ఫండ్‌ 
యాక్సిస్‌ మ్యుచువల్‌ ఫండ్‌ తాజాగా నిఫ్టీ500 మొమెంటం 50 ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఫిబ్రవరి 7 వరకు అందుబాటులో ఉంటుంది. మరింతగా పెరిగే ధోరణులు కనపరుస్తున్న స్టాక్స్‌ను గుర్తించి, వాటిలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు అందించడం ఈ ఫండ్‌ లక్ష్యం. నిఫ్టీ500 ముమెంటం 50 ఇండెక్స్‌లోని స్టాక్స్‌లో, వివిధ మార్కెట్‌ క్యాప్‌లవ్యాప్తంగా ఇది ఇన్వెస్ట్‌ చేస్తుంది.

తక్కువ వ్యయాలతో విస్తృతంగా పెట్టుబడుల డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలను కోరుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువుగా ఉంటుందని యాక్సిస్‌ మ్యుచువల్‌ ఫండ్‌ ఎండీ బి. గోపకుమార్‌ తెలిపారు. ఈ ఇండెక్స్‌ పలు సందర్భాల్లో ప్రధాన సూచీలను కూడా మించి రాబడులు అందించినట్లు సంస్థ సీఐవో ఆశీష్‌ గుప్తా పేర్కొన్నారు. ఇందులో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు.  

బరోడా బీఎన్‌పీ పారిబా ఎనర్జీ ఆపర్చూనిటీస్‌ ఫండ్‌ 
వృద్ధికి అవకాశమున్న ఇంధన రంగ స్టాక్స్‌లో పెట్టుబడుల ప్రయోజనాలను అందించే బీఎన్‌పీ పారిబా ఎనర్జీ ఆపర్చూనిటీస్‌ ఫండ్‌ను ప్రవేశపెట్టింది బరోడా బీఎన్‌పీ పారిబా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఇండియా సంస్థ. ఈ స్కీము ఫిబ్రవరి 4 వరకు అందుబాటులో ఉంటుంది. ఏ దేశమైనా సంపన్న దేశంగా ఎదగడంలో ఇంధన వినియోగం కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ సీఈవో సురేశ్‌ సోని తెలిపారు.

భారత్‌ కూడా సంపన్న దేశంగా ఎదుగుతున్న క్రమంలో దేశీయంగా ఇంధనానికి కూడా డిమాండ్‌ పెరుగుతుందని, దానికి సంబంధించిన స్టాక్స్‌లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిఫ్టీ 500 సూచీలో దాదాపు మూడో వంతు స్టాక్స్‌ ఎనర్జీకి సంబంధించినవి ఉన్నాయని వివరించారు. ఇంధన అన్వేషణ, ఉత్పత్తి, రవాణా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల స్టాక్స్‌లో కనీసం 80 శాతం మొత్తాన్ని ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుందని సురేశ్‌ పేర్కొన్నారు. దీని పనితీరుకు నిఫ్టీ ఎనర్జీ టీఆర్‌ఐ ప్రామాణిక సూచీగా ఉంటుంది. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)