Breaking News

ఎగువ మధ్యాదాయ దేశంగా భారత్‌

Published on Wed, 01/21/2026 - 07:37

భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే నాలుగేళ్లలో (2030 నాటికి) ఎగువ మధ్యాదాయ దేశంగా మారుతుందని, చైనా, ఇండోనేషియా సరసన చేరుతుందని ఎస్‌బీఐ పరిశోధన విభాగం అంచనా వేసింది. అలాగే, 2028 కంటే ముందుగానే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది.

స్థూల తలసరి ఆదాయం ఆధారంగా ఆర్థిక వ్యవస్థలను తక్కువ ఆదాయం, దిగువ మధ్యాదాయం, ఎగువ మధ్యాదాయం, అధిక ఆదాయంగా ప్రపంచ బ్యాంక్‌ వర్గీకరిస్తుంటుంది. 1990లో 219 దేశాలను ప్రపంచ బ్యాంక్‌ వర్గీకరించగా, ఇందులో 51 దేశాలు తక్కువ ఆదాయం, 56 దేశాలు దిగువ మధ్యస్థ ఆదాయం, 29 దేశాలను ఎగువ మధ్యాదాయం, 39 దేశాలను ఉన్నతాదాయ విభాగంలో చేర్చింది. 2024 డేటా ప్రకారం.. తక్కువ ఆదాయం విభాగంలో కేవలం 26 దేశాలే మిగిలాయి. 50 దేశాలు దిగువ మధ్యాదాయం, 54 దేశాలు ఎగువ మధ్యాదాయం, 87 దేశాలు అధిక ఆదాయం కిందకు వచ్చాయి. 60 సంవత్సరాల తర్వాత భారత్‌ 2007లో తక్కువ ఆదాయం నుంచి దిగువ మధ్యాదాయ దేశంగా మారినట్టు.. తలసరి స్థూల ఆదాయం 1962లో 90 డాలర్లుగా ఉంటే, 2007లో 910 డాలర్లకు చేరినట్టు ఎస్‌బీఐ నివేదిక తెలిపింది.  

రెండేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లకు..  

భారత్‌ స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్ల తర్వాత ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకుందని, తదుపరి 7 ఏళ్లకు (2014లో) 2 ట్రిలియన్‌ డాలర్లకు, 2021 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్లకు, 2025లో 4 ట్రిలియన్‌ డాలర్లకు చేరినట్టు ఎస్‌బీఐ నివేదిక వివరించింది. వచ్చే రెండేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. తొలి వెయ్యి డాలర్ల తలసరి ఆదాయానికి భారత్‌ 2009లో చేరుకుందని, తదుపరి పదేళ్లలో 2019 నాటికి ఇది 2,000 డాలర్లు పెరిగిందని, అనంతరం ఏడేళ్లకు 3,000 డాలర్లకు విస్తరించినట్టు తెలిపింది.

‘వచ్చే నాలుగేళ్లలో 2030 నాటికి 4,000 డాలర్లకు తలసరి ఆదాయం వృద్ధి చెందుతుంది. తద్వారా ఎగువ మధ్యాదాయ దేశంగా చైనా, ఇండోనేషియా సరసన చేరుతుంది. ప్రస్తుతం ఉన్నతాదాయ దేశానికి ఉన్న పరిమితి 13,936 డాలర్ల స్థాయిని భారత్‌ 2047 నాటికి చేరుకోవాలంటే.. ఇక్కడి నుంచి ఏటా 7.5 శాతం చొప్పున వృద్ధిని సాధించాల్సి ఉంటుంది. గత 23 ఏళ్ల కాలంలో (2001–2024) భారత్‌ తలసరి స్థూల ఆదాయం ఏటా 8.3 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. కనుక ఇకపై 7.5 శాతం వృద్ధి సాధ్యమే’అని ఈ నివేదిక వెల్లడించింది. ఒకవేళ 2047 నాటికి ఉన్నతాదాయ దేశానికి పరిమితి 18,000 డాలర్లకు మారుతుందని భావించేట్టు అయితే.. భారత్‌ ఇక్కడి నుంచి ఏటా 8.9 శాతం చొప్పున వచ్చే 23 ఏళ్ల పాటు వృద్ధిని సాధించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకు గాను భారత్‌ సంస్కరణల పథాన్ని కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఇదీ చదవండి: సహజ వజ్రాలకే ‘డైమండ్’ గుర్తింపు

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)