Breaking News

డియర్‌ స్టాఫ్‌.. ఆరోగ్యం జాగ్రత్త!

Published on Tue, 07/01/2025 - 19:21

ఇన్ఫోసిస్‌ తమ ఉద్యోగులకు ‘ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ ఈమెయిళ్లు పంపుతోంది. పని గంటలకు మించి వర్క్‌ చేయకూడదని చెబుతూ వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌పై దృష్టి సారించాలని పేర్కొంటోంది. రిమోట్‌గా పని చేస్తోన్న కంపెనీ ఉద్యోగులు తప్పకుండా రెగ్యులర్ షెడ్యూల్స్‌మేరకే వర్క్‌ చేయాలని కోరుతోంది. ఈమేరకు ఉద్యోగులకు అంతర్గత ఈమెయిళ్లు పంపుతోంది. కంపెనీకి చెందిన టూల్స్‌లో తమ ఉద్యోగులు గడిపే సమయాన్ని సైతం ట్రాక్ చేస్తూ రిమైండర్‌ పంపుతుంది.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ హెచ్ఆర్ బృందం వారానికి ఐదు రోజులు, రోజుకు సగటున 9.15 పని గంటలు మించిన ఉద్యోగులకు హెల్త్ రిమైండర్ ఈమెయిల్స్ పంపుతోంది. ఈ ఈమెయిల్స్ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడాన్ని హైలైట్ చేస్తున్నాయి. రిమోట్‌గా పనిచేసేటప్పుడు నిర్ణీత పని గంటలను అధిగమించకుండా చూసుకోవాలని తెలిపింది. ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, ఆరోగ్యకరమైన వర్క్‌-లైఫ్‌ సమతుల్యతను నిర్వహించాలని ఈమెయిల్స్‌లో స్పష్టమైన రిమైండర్‌ ఉన్నట్లు కొందరు ఉద్యోగులు తెలిపారు.

వృత్తిపరంగా చాలా అవసరం..

వ్యక్తిగత శ్రేయస్సుకు మాత్రమే కాకుండా దీర్ఘకాలిక వృత్తిపరమైన ప్రభావానికి కూడా ఇది చాలా అవసరమని కంపెనీ పేర్కొంది. ఉద్యోగులు క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలని, పనిఒత్తిడి ఉంటే వెంటనే తెలియజేయాలని, ఉద్యోగులు తమను తాము రిఫ్రెష్‌ కావడానికి వీలు కల్పించుకోవాలని తెలిపింది.

ఇదీ చదవండి: ‘సూపర్‌ యాప్‌’లో అన్ని రైల్వే సేవలు

గతంలో వారానికి 70 గంటలపాటు పని చేయాలని చెప్పిన ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కంపెనీలో ఇలా వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌కు సంబంధించిన ఈమెయిళ్లు పంపడం ఉద్యోగుల్లో ఊరటనిస్తుంది. హైబ్రిడ్ వర్క్ మోడల్‌తోపాటు ఉద్యోగుల ఆరోగ్యంపట్ల కంపెనీ తీరును ఇవి హైలైట్‌ చేస్తున్నాయి.

Videos

పాకిస్తాన్ తో యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు? కాంగ్రెస్ సూటి ప్రశ్నకు బీజేపీ రిప్లై ఏంటి?

ఈడీ విచారణపై అల్లు అరవింద్ క్లారిటీ

ఈ ఘటన చూసి నా కళ్ళలో నీళ్లు వచ్చాయి.. ఎంపీ తనుజారాణి ఎమోషనల్

వైఎస్ జగన్ ను కలవొద్దని మామిడి రైతులను కూటమి నేతలు బెదిరిస్తున్నారు

మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: రాంచందర్రావు

ఈనెల 9న చిత్తూరు జిల్లాలో YS జగన్ పర్యటన: పెద్దిరెడ్డి

20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి ఠాక్రే వారసులు

గంటాపై ఫిర్యాదు చేసిన భీమిలి నియోజకవర్గ నేతలు

వల్లభనేని వంశితో అభిమానుల ఫోటోలు

ఏపీలో నరకాసుర పాలన: పేర్ని నాని

Photos

+5

ఆద్యంతం ఉత్కంఠను రేపే మిస్టరీ పర్యాటక ప్రదేశాలివే..! (ఫోటోలు)

+5

విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్‌ డ్రిల్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌లో చుక్కలు (ఫొటోలు)

+5

ఆషాడమాసం.. విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ (ఫోటోలు)

+5

ఆరునెలల జ్ఞాపకాలు పంచుకున్న ప్రభాస్‌ సోదరి (ఫోటోలు)

+5

'అఖండ' కోసం తెలుగులో ఎంట్రీ ఇచ్చేసిన నటి హర్షాలీ మల్హోత్రా (ఫోటోలు)

+5

గర్భాలయంలో ఏడడుగుల విగ్రహం.. ఏపీలో ఈ పురాతన ఆలయం గురించి విన్నారా? (చిత్రాలు)

+5

నలుగురు టాప్‌ హీరోయిన్లతో ధనుష్‌ పార్టీ.. ఎందుకో తెలుసా (ఫోటోలు)