తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?
Breaking News
గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. రంగంలోకి ప్రభుత్వం
Published on Fri, 05/30/2025 - 21:46
దేశంలో బంగారు రుణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అత్యవసర నగదు అవసరాల కోసం లక్షలాది మందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి గోల్డ్ లోన్లే ఆధారం. అయితే, గోల్డ్లోన్ మంజూరుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ప్రతిపాదించిన నిబంధనల మార్పులు తీవ్రమైన చర్చకు దారితీశాయి. చిన్న మొత్తంలో రుణాలు తీసుకునే గ్రహీతలపై తీవ్ర ప్రభావం పడనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ రంగంలోకి దిగింది.
కఠిన నిబంధనలు
గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేసే లక్ష్యంతో ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. వీటిలో..
లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తిని 75 శాతానికి పరిమితం చేయడం అంటే రుణగ్రహీతలు తమ బంగారం మార్కెట్ విలువలో 75% వరకు మాత్రమే రుణంగా పొందవచ్చు.
బంగారు రుణాలకు నిజమైన, ధ్రువీకరించదగిన ఆస్తుల మద్దతు ఉందని నిర్ధారించడానికి కఠినమైన పూచీకత్తు అవసరం.
రుణ మంజూరులో మరింత పారదర్శకత కోసం బ్యాంకులు, రుణ సంస్థలపై పర్యవేక్షణ పెంచడం.
ప్రభుత్వ జోక్యం
అయితే, కొత్త నిబంధనలు చిన్న రుణగ్రహీతలను, ముఖ్యంగా వ్యవసాయ వర్గాలను దెబ్బతీస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ కొన్ని సూచనలు చేసింది.
కఠినమైన నిబంధనల నుంచి రూ.2 లక్షల లోపు రుణాలను మినహాయించడం ద్వారా చిన్న రుణగ్రహీతలకు సులభంగా రుణాలు అందుతాయి.
కొత్త నిబంధనలకు సజావుగా మారడానికి బ్యాంకులు, రుణ సంస్థలకు తగినంత సమయం ఇవ్వడానికి వాటి అమలును 2026 జనవరి 1 వరకు వాయిదా వేయాలని ఆర్బీఐకి ఆర్థిక శాఖ సూచించింది.
Tags : 1