Breaking News

సామాన్యుడికి భారమా? దేశాభివృద్ధికి మార్గమా?

Published on Wed, 05/13/2026 - 10:10

భారతీయులకి బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్. ఆపత్కాలంలో ఆదుకునే ఆర్థిక భరోసా. అయితే, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, దేశ ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పసిడి దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మార్కెట్‌లో పెను సంచలనం సృష్టిస్తోంది.

బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది (మే 13, 2026 నుంచి అమలు). ఇందులో 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, మరో 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ (ఏఐడీసీ) ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు (ఇరాన్-అమెరికా యుద్ధ వాతావరణం), పెరుగుతున్న ముడిచమురు ధరల నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.

మోదీ పిలుపు: ‘బంగారం కొనుగోళ్లు ఆపండి’

ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక కీలక విన్నపం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘బంగారం దిగుమతి కోసం మనం భారీగా విదేశీ కరెన్సీని వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న తరుణంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలను దేశ ప్రయోజనాల కోసం, ఇంధన భద్రత కోసం మళ్లించాల్సిన అవసరం ఉంది’ అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని పిలుపునిచ్చిన రెండు రోజులకే ప్రభుత్వం సుంకాన్ని పెంచడం గమనార్హం. ఇది కేవలం విజ్ఞప్తి మాత్రమే కాదని, కఠిన నిర్ణయాల ద్వారా దిగుమతులను నియంత్రించే వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మార్కెట్‌పై ప్రభావం

బంగారంపై సుంకం పెరగడం వల్ల తక్షణమే దేశీయ మార్కెట్‌లో ధరలు పెరిగే అవకాశం ఉంది.

ధరల పెరుగుదల: 9 శాతం అదనపు సుంకం భారం నేరుగా వినియోగదారుడిపై పడుతుంది. దీనివల్ల పెళ్లిళ్ల సీజన్‌లో ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తప్పదు.

డిమాండ్ తగ్గుదల: పెరిగిన ధరలు, ప్రధాని పిలుపు వెరసి స్వల్పకాలంలో బంగారం కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంది. ఇది దేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ)ను తగ్గించడానికి దోహదపడుతుంది.

స్మగ్లింగ్ ముప్పు: సుంకాలు భారీగా పెరిగినప్పుడు అనధికార మార్గాల్లో (స్మగ్లింగ్) బంగారం దేశంలోకి వచ్చే ప్రమాదం ఉందని జ్యువెలరీ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్టాక్ మార్కెట్: ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రముఖ జ్యువెలరీ కంపెనీల షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిర పరచడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా ఉన్నా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఇది అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముడిచమురు, ఎరువుల దిగుమతుల కోసం విదేశీ కరెన్సీని పొదుపు చేయాల్సిన అనివార్య పరిస్థితిలో భారత్ ఉంది. పసిడి వ్యామోహాన్ని తగ్గించుకుని, పెట్టుబడులను ఇతర ఉత్పాదక రంగాల వైపు మళ్లించడమే ఈ సంక్షోభానికి పరిష్కారంగా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!

Videos

అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

పూర్తి ఆధారాలతో వస్తా.. సిట్ కు బండి భగీరథ్ లేఖ

మందులు, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు విముక్తి

కేసులు పెట్టే ముందు ఆలోచించు! నూరి ఫాతిమా సీరియస్

వామ్మో బంగారం కొనలేం.. 2 లక్షలకు పెరిగే చాన్స్

అమెరికా విద్యార్థులకు బిగ్ షాక్.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై నిఘా

కృష్ణాజిల్లాలో దారుణం.. వైన్ షాప్ నిర్వాహకుడిపై టీడీపీ నేత దాడి

బండి భగీరథ్ ఎక్కడ? పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్

పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్..

కూల్ డ్రింక్ VS ఫ్రూట్ జ్యూస్...ఏది విషం? ఏది అమృతం?

Photos

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్ (ఫొటోలు)

+5

మధ్యాహ్నం 2 గంటల లోపు పీఎస్ కు రావాలని భగీరథ కు నోటీసులు

+5

గంగరంగ వైభవం గంగమ్మ జాతర...పోటెత్తిన జనం (ఫొటోలు)

+5

హనుమాన్ జయంతి... భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర...'బైరాగి వేషంలో మొక్క చెల్లించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

నారా రోహిత్‌ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)