Breaking News

ఏఐ ఆటోమేషన్‌కే ప్రాధాన్యత: నివేదికలో కీలక అంశాలు

Published on Wed, 05/28/2025 - 08:38

న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వ్యయాలు, సైబర్‌ ముప్పులను అధిగమించేందుకు కంపెనీల్లోని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు ప్రస్తుతం కృత్రిమ మేథ (ఏఐ) వైపు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయంగా మూడో వంతు సైబర్‌సెక్యూరిటీ లీడర్లు ఏఐ ఆధారిత ఆటోమేషన్‌కే ప్రాధాన్యతనిస్తామంటున్నారు. ఐటీ దిగ్గజం విప్రో రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

నివేదిక ప్రకారం.. సైబర్‌ సెక్యూరిటీని పెంచుకునేందుకు, బడ్జెట్లను అదుపులో ఉంచుకునేందుకు ఏఐ ఆటోమేషన్‌పై పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యతనిస్తామని చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్లలో (సీఐఎస్‌వో) 30 శాతం మంది తెలిపారు. సాధనాలను క్రమబద్దీకరించుకోవడం (26 శాతం మంది), సెక్యూరిటీ.. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియను మెరుగుపర్చుకోవడం (23 శాతం), నిర్వహణ విధానాలను సరళతరం చేసుకోవడం (20 శాతం) ద్వారా కూడా ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

‘సైబర్‌ ముప్పులు చాలా వేగంగా అధునాతన రూపు సంతరించుకుంటున్నాయి. ఆ స్థాయిలో సైబర్‌సెక్యూరిటీ బడ్జెట్లను పెంచుకోవడం కష్టతరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తక్కువ వ్యయాలతో రక్షణ వ్యవస్థాలను పటిష్టం చేసుకునేందుకు కంపెనీలకి ఏఐ ఉపయోగపడుతుంది. అందుకే సీఐఎస్‌వోలు దీనిపై దృష్టి పెడుతున్నారు‘ అని విప్రో ఎస్‌వీపీ టోనీ బఫోమెంట్‌ తెలిపారు.

నివేదిక ప్రకారం కేవలం ఖర్చులను నియంత్రించుకోవడానికే కాకుండా ముప్పులను గుర్తించే సామర్థ్యాలను పెంచుకునేందుకు, సత్వరం స్పందించేందుకు ఏఐని ఉపయోగిస్తున్నట్లు 31 శాతం మంది వివరించారు. అధునాతన ఏఐ ఆధారిత సెక్యూరిటీ సొల్యూషన్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం, నిరంతరాయంగా ఏఐ పరిణామాలను పర్యవేక్షిస్తుండటం, సైబర్‌సెక్యూరిటీ సిబ్బందిలో కొత్త ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడంలాంటి అంశాలు రిస్కులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పుడు కీలకంగా మారాయని నివేదిక పేర్కొంది.

#

Tags : 1

Videos

పవన్ ధ్యాసంతా తన సినిమాలు.. సినిమా టిక్కెట్లు.. రిటర్న్ గిఫ్ట్ లపైనే

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ విస్మరిస్తోంది

మళ్లీ సింగం గెటప్ తో సూర్య..

మహానాడులో ఎన్టీఆర్ ఆత్మ ప్లేట్ మారుస్తుందని బాలయ్యకు ముందే తెలుసా?

రవితేజ తో అదిదా సర్ ప్రైజ్ అంటున్న కేతికా శర్మ..

కూటమిపై కన్నెర్ర

సింధు నీళ్ల కోసం కాళ్ళ బేరానికి పాకిస్తాన్

ఏపీలో పేదల రేషన్ కష్టాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన

దేశద్రోహుల లిస్టులో సన్నీ యాదవ్ ..?

Photos

+5

ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం దండేలి..! చూడచక్కని ప్రదేశాలివే..

+5

జనంపై బాబు పగ.. ఏపీలో ‘రేషన్‌’ కష్టాలు (ఫొటోస్)

+5

దక్షిణాదిన ఈ జలపాతాలు చూశారా?

+5

పెళ్లి వేడుకలా హీరోయిన్ శ్రీలీల బర్త్‌ డే (ఫొటోలు)

+5

మిస్‌ వరల్డ్ 2025 గ్రాండ్‌ ఫినాలేలో టాలీవుడ్‌ స్టార్స్‌ సందడి (ఫొటోలు)

+5

మిస్ వరల్డ్-2025 ఫైనల్స్ సందడి.. ర్యాంప్ వాక్‌తో మెరిసిన అందగత్తెలు (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ లుక్‌లో ముద్దుగుమ్మలా‌ వర్ష (ఫొటోలు)

+5

నాగచైతన్య కౌగిలిలో శోభిత.. పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్.. ఫ్యామిలీతో నివేదా సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

విశాఖ, విజయవాడలో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)