Breaking News

ఆర్థిక వృద్ధికి అన్ని చర్యలు..

Published on Fri, 08/13/2021 - 02:14

న్యూఢిల్లీ: ఎకానమీ వృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. పేదరికాన్ని తగ్గించగలిగే వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందని, అయితే ఇందుకు ద్రవ్యోల్బణాన్ని పణంగా పెట్టలేమని ఆమె చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి రిజర్వ్‌ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని పరిశ్రమల సమాఖ్య సీఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి వివరించారు. ‘ఎకానమీలో సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం, ఆర్‌బీఐ కలిసి పనిచేస్తున్నాయి. వృద్ధి సాధనకు రెండూ ప్రాధాన్యమిస్తాయి. అదే సమయంలో ధరల కూడా కట్టడి చేసేందుకు కట్టుబడి ఉన్నాయి. గడిచిన ఏడేళ్లలో అప్పుడప్పుడు తప్ప ద్రవ్యోల్బణం నిర్దేశిత స్థాయి ఆరు శాతాన్ని దాటకపోవడం ఇందుకు నిదర్శనం’ అని చెప్పారు. సంపన్న దేశాల తరహాలో వడ్డీ రేట్లను పెంచే పరిస్థితి భారత్‌లో ఇంకా రాలేదని, ఆర్‌బీఐ అభిప్రాయం కూడా ఇదేనన్నారు.

ఎకానమీ పుంజుకుంటున్న సంకేతాలు..
రాష్ట్రాల్లో కోవిడ్‌–19 కట్టడికి సంబంధించిన ఆంక్షలను తొలగించే కొద్దీ క్రమంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందనడానికి రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 37 శాతం పెరిగాయని వివరించారు. జులై నాటికి విదేశీ మారక నిల్వలు 620 బిలియన్‌ డాలర్లకు చేరాయని పేర్కొన్నారు. మహమ్మారిపరమైన కష్టసమయంలోనూ సంస్కరణలకు కట్టుబడి ఉన్నామని తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఆమె తెలిపారు.  ఇన్వెస్ట్‌ చేయడానికి పరిశ్రమ ముందుకు రావాలని మంత్రి సూచించారు. 2021–22 బడ్జెట్‌లో నిర్దేశించిన ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

చైనాను కాపీ కొడితే తయారీలో ఎదగలేము: నీతి ఆయోగ్‌ సీఈవో కాంత్‌
యావత్‌ ప్రపంచానికి ఫ్యాక్టరీగా భారత్‌ ఎదగాలంటే తయారీ విషయంలో చైనాను కాపీ కొడితే ప్రయోజనం లేదని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ దిగ్గజంగా ఎదగాలంటే.. వృద్ధికి ఆస్కారమున్న కొంగొత్త రంగాలను గుర్తించి, అవకాశాలు అందిపుచ్చుకోవాలని సీఐఐ సదస్సులో కార్పొరేట్లకు ఆయన సూచించారు.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)