Breaking News

ఈ బ్యాంకుల్లో ఎల్‌ఐసీ పాలసీలు

Published on Tue, 07/01/2025 - 11:24

ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఏయూ ఎస్‌ఎఫ్‌బీ) తెలిపింది. దీని ప్రకారం ఎల్‌ఐసీ టర్మ్‌ పాలసీలు, ఎండోమెంట్‌ ప్లాన్లు, హోల్‌ లైఫ్‌ పాలసీలు మొదలైన వాటిని తమ శాఖల్లో విక్రయించనున్నట్లు పేర్కొంది.

21 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో తమకు 2,456 పైగా బ్యాంకింగ్‌ టచ్‌పాయింట్లు ఉన్నట్లు బ్యాంక్‌ ఈడీ ఉత్తమ్‌ టిబ్రెవాల్‌ తెలిపారు. ఈ ఒప్పందంతో ఓవైపు బ్యాంకింగ్, బీమా, దీర్ఘకాలిక ఆర్థిక ప్లానింగ్‌ సొల్యూషన్స్‌ అన్నింటినీ ఒకే  దగ్గర అందించే సంస్థగా తమ బ్యాంక్‌ స్థానం పటిష్టమవుతుందని మరోవైపు గ్రామీణ, సెమీ–అర్బన్‌ ప్రాంతాల్లో ఎల్‌ఐసీ పాలసీల విస్తృతి మరింతగా పెరుగుతుందని వివరించారు. 

బ్యాంకింగ్, భద్రత, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను ఒకే ప్లాట్ఫామ్ కింద సమీకృతం చేస్తూ, పూర్తి-స్పెక్ట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా  మారడానికి ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ సాగిస్తున్న ప్రయాణంలో ఈ సహకారం ఒక మైలురాయిని సూచిస్తుంది. ఎల్ఐసీకి కూడా ఈ భాగస్వామ్యం విశ్వసనీయమైన,  కస్టమర్-సెంట్రిక్ బ్యాంకింగ్ భాగస్వామి ద్వారా విస్తృత పరిధిని అందిస్తుంది.

సంజయ్ అగర్వాల్ 1996లో స్థాపించిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుగా పనిచేస్తుంది. 2025 మార్చి 31 నాటికి బ్యాంక్ 1.13 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలు అందించింది. బ్యాలెన్స్ షీట్ పరిమాణం రూ .1.57 లక్షల కోట్లు. 'ఎఎ /స్టేబుల్‌' క్రెడిట్ రేటింగ్‌ ఈ బ్యాంకుకు ఉంది.

Videos

పాకిస్తాన్ తో యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు? కాంగ్రెస్ సూటి ప్రశ్నకు బీజేపీ రిప్లై ఏంటి?

ఈడీ విచారణపై అల్లు అరవింద్ క్లారిటీ

ఈ ఘటన చూసి నా కళ్ళలో నీళ్లు వచ్చాయి.. ఎంపీ తనుజారాణి ఎమోషనల్

వైఎస్ జగన్ ను కలవొద్దని మామిడి రైతులను కూటమి నేతలు బెదిరిస్తున్నారు

మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: రాంచందర్రావు

ఈనెల 9న చిత్తూరు జిల్లాలో YS జగన్ పర్యటన: పెద్దిరెడ్డి

20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి ఠాక్రే వారసులు

గంటాపై ఫిర్యాదు చేసిన భీమిలి నియోజకవర్గ నేతలు

వల్లభనేని వంశితో అభిమానుల ఫోటోలు

ఏపీలో నరకాసుర పాలన: పేర్ని నాని

Photos

+5

ఆద్యంతం ఉత్కంఠను రేపే మిస్టరీ పర్యాటక ప్రదేశాలివే..! (ఫోటోలు)

+5

విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్‌ డ్రిల్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌లో చుక్కలు (ఫొటోలు)

+5

ఆషాడమాసం.. విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ (ఫోటోలు)

+5

ఆరునెలల జ్ఞాపకాలు పంచుకున్న ప్రభాస్‌ సోదరి (ఫోటోలు)

+5

'అఖండ' కోసం తెలుగులో ఎంట్రీ ఇచ్చేసిన నటి హర్షాలీ మల్హోత్రా (ఫోటోలు)

+5

గర్భాలయంలో ఏడడుగుల విగ్రహం.. ఏపీలో ఈ పురాతన ఆలయం గురించి విన్నారా? (చిత్రాలు)

+5

నలుగురు టాప్‌ హీరోయిన్లతో ధనుష్‌ పార్టీ.. ఎందుకో తెలుసా (ఫోటోలు)