మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
సావిత్రీబాయి ఫూలే జయంతి.. వైఎస్ జగన్ నివాళి
Published on Fri, 01/03/2025 - 10:14
సాక్షి, తాడేపల్లి: నేడు సావిత్రీబాయి ఫూలే జయంతి.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సావిత్రీబాయి ఫూలేకి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఆమె పోరాటాలను, సేవలను స్మరించుకున్నారు.
వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి.. బాలికా విద్య ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే. నేడు ఆమె పోరాటాలను, సేవలను స్మరించుకుంటూ.. సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి, బాలికా విద్య ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలేగారు. నేడు ఆమె పోరాటాలను, సేవలను స్మరించుకుంటూ సావిత్రిబాయిగారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/OIwCGpswxS
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 3, 2025
Tags : 1