Breaking News

ఏది నిజం?: విదేశీ విద్యా దీవెన అందిందెవరికి?

Published on Sat, 06/25/2022 - 07:27

టీడీపీ నేతల సిఫారసులతో... కనీసం ఒక్కశాతం కూడా పారదర్శకత లేకుండా నడిచిన ‘విదేశీ విద్యా దీవెన’ ఆగిపోయిందంటూ ‘ఈనాడు’ గుండెలు బాదేసుకుంటోంది. దాన్ని చంద్రబాబే బకాయిలు పెట్టేసి నిలిపేశాడన్న వాస్తవాన్ని మాత్రం ఆ పత్రిక ప్రస్తావించడమే లేదు. పైపెచ్చు ఆ పథకం అమల్లో వెలుగుచూసిన అవకతవకలు... సోషల్‌ ఆడిట్లో బయటపడ్డ నకిలీ లబ్ధిదారులు... ఇవేవీ ‘ఈనాడు’ అధిపతి రామోజీరావుకు పట్టవు. ఇప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కాబట్టి... ఇచ్చిన మాట తప్పకుండా ముందుకెళుతున్నందుకు నానాటికీ ప్రజాదరణ పెరుగుతోంది కాబట్టి... ఏదో ఒకరకంగా బురద జల్లడమే ఆయన పని. దాన్లో భాగమే ఈ కథనాలు. ‘ఈనాడు’ రాతల్లో నిజమెంతో ఒకసారి చూద్దాం...

విదేశాల్లో చదువుకునే పేద విద్యార్థులకు ప్రభుత్వ పరంగా సహకారమందించడానికి ఉద్దేశించిందే ‘విదేశీ విద్యాదీవెన’ పథకం. చంద్రబాబు దీన్ని ఎంత ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నా... వాస్తవంగా అమలు చేసింది మాత్రం తక్కువ మందికే. పైపెచ్చు పారదర్శకతకు తావే లేకుండా... తమ పార్టీ నాయకుల సిఫారసులుంటే చాలన్న రీతిలో వ్యవహరించారు. ఇన్ని చేసి కూడా... ఒకటి రెండేళ్లు అమలు చేశాక 2017–18 నుంచి పూర్తిస్థాయిలో చెల్లింపులు నిలిపేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, మైనారిటీలకు బాబు సర్కారు పూర్తి స్థాయిలో బకాయిలు పెట్టేసింది. ఫలితంగా విదేశీ విద్య కోసం 3,326 మందికి ఈ పథకాన్ని వర్తింపజేసి కూడా... వారికి చెల్లించాల్సిన రూ.318.80 కోట్లు బకాయిలు పెట్టేసింది. ఆ బకాయిలు చెల్లించకుండానే... రెండేళ్ల తరవాత 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది. 

2019లో అధికారం చేపట్టిన సీఎం జగన్‌.. విదేశీ విద్యా కానుక పథకం అమలు తీరును సమీక్షించారు. దీనిపై సోషల్‌ ఆడిట్‌కు ఆదేశించారు. ఈ ఆడిట్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రపంచంలో ఎక్కడో ఉన్నాయో లేవో తెలియని యూనివర్సిటీల నుంచి కూడా.. ఐ–20 ఫారం తెచ్చి సబ్మిట్‌ చేస్తే చాలు. వారు చదువుతున్నారా? లేదా? అసలు ఆ యూనివర్సిటీ ఎలాంటిది? ఇవేవీ చూడకుండానే టీడీపీ నేతల ఒత్తిళ్లతో చాలామందిని అర్హులుగా చేశారు. నిజమైన పేద విద్యార్థులు అర్హులైనా కూడా దీనికి నోచుకోలేదు. ఈ పథకం అమల్లో పారదర్శకత లేశమాత్రమైనా లేదని, అత్యంత లోపభూయిష్టంగా ఉందని ఆడిట్‌లో గుర్తించారు. దీంతో ఈ పథకం లబ్దిదారులు, దరఖాస్తు చేసుకున్న వారి వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్‌ అధికారులు ఈ పథకం అమలులో అక్రమాలు జరిగాయని గుర్తించారు.

పేద విద్యార్థులకు అందాల్సిన పథకం... టీడీపీ నేతల సిఫారసులతో సంపన్న వర్గాలకిచ్చి దుర్వినియోగం చేశారని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి... ఆ తరవాతే తగిన నిర్ణయం తీసుకోవాలని సీఎం భావించారు. అయితే ఇప్పటికే ఈ పథకం ద్వారా విదేశీ విద్యకు వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే పెద్ద మనస్సుతో గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లిస్తున్నారు. ఇప్పటికే రూ.112.46 కోట్ల బకాయిలు చెల్లించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీల బకాయిలైతే పూర్తిగా చెల్లించేశారు. ‘ఈనాడు’ మాత్రం ఇవేవీ ఎరగనట్లు హద్దుల్లేని దుష్ప్రచారానికే ప్రాధాన్యమిచ్చింది. పథకంలో జరిగిన అక్రమాల ప్రస్తావన కూడా తేకుండా.. బాబు బకాయిల గురించి తెలియనట్లుగా... జగన్‌ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తోంది. 

ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో చదువుకునేలా...
గత ప్రభుత్వ హయాంలో ఊరూపేరూ లేని విశ్వవిద్యాలయంలో అడ్మిషన్‌ చూపించి అర్హులను ఎంపిక చేయడం... పేదలకు ఇవ్వకుండా నిధులు దుర్వినియోగం చేయటం వంటి పరిణామాలతో ప్రభుత్వం ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే సంకల్పంతో ఉంది. ప్రపంచంలోని టాప్‌–200 విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు సాధించిన విద్యార్థులకు ‘విదేశీ విద్యా కానుక’ అందించేలా పథకంలో మార్పులు చేస్తోంది. ఈ మేరకు కసరత్తు దాదాపుగా పూర్తిచేసిన అధికారులు... త్వరలో తగిన ఉత్తర్వులివ్వనున్నారు కూడా. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... విదేశీ విద్యలోనూ ‘నాణ్యత’కు పెద్దపీట వేసి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో చేరిన వారికే దీన్ని వర్తింపజేయాలని చూస్తోంది. తేడా తెలుసుకోండి రామోజీరావు గారూ!!.

Videos

అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?

నేను నిప్పు, తెరిచిన పుస్తకం అన్నావ్ గా.. మరీ ఈ సీక్రెట్ టూర్ లు ఏంటి?

ఫ్రెండ్స్ తో పందెం కట్టి.. పెన్ను మింగేశాడు

ఈ వయసులో నీకు బుద్ధి లేదా.. MLA బుచ్చయ్య చౌదరిపై రెచ్చిపోయిన చెల్లుబోయిన

స్విట్జర్లాండ్ లో పెను విషాదం.. 40 మంది మృతి ..100 మందికి గాయాలు

చంద్రబాబు మీద ఉన్న ప్రతి కేసు రీ ఓపెన్!

బుజ్జితల్లి టాలీవుడ్ కు వచ్చేస్తుందా..

ప్రేమపెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి

800 KG కేక్ కట్టింగ్.. జగన్ ఆశీస్సులతో మనదే విజయం

జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..

Photos

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

లంగా ఓణీలో 'ఈషా రెబ్బా'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)