Breaking News

AP: ఖతార్‌ నుంచి ఇద్దరు మహిళలకు విముక్తి

Published on Tue, 07/27/2021 - 10:23

సాక్షి, కడప: ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ(ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌) చొరవతో ఇద్దరు మహిళలు ఖతార్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ వివరాలను ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ డైరెక్టర్‌ బీహెచ్‌ ఇలియాస్‌ సోమవారం మీడియాకు తెలియజేశారు. వైఎస్సార్‌ జిల్లా కడపలోని అక్కాయపల్లెకు చెందిన కాకిరేని గంగాదేవి, తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలానికి చెందిన గంగాభవానీ గృహ కార్మికులుగా గతేడాది ఖతార్‌కు వెళ్లారు. అక్కడ స్పాన్సర్‌(సేఠ్‌) వీరిని వేధింపులకు గురిచేశాడు. దీంతో వారిద్దరూ.. తమను భారత్‌కు పంపించాలని అతన్ని వేడుకున్నారు.

అయినా కనికరించని అతను.. వీరిద్దరిపై దొంగతనం కేసు పెట్టి జైలుపాలు చేశాడు. ఈ విషయం ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ కో–ఆర్డినేటర్‌ మనీష్‌ దృష్టికి వచ్చింది. ఆయన వెంటనే ఖతార్‌ జ్యుడిషియల్‌ను సంప్రదించారు. గంగాదేవి, గంగాభవానీపై అన్యాయంగా దొంగతనం కేసు బనాయించారని, వారిని భారత్‌కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఖతార్‌ జ్యుడిషియల్‌ దీనిని విచారించి.. వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

భారత్‌కు పంపించాలని ఆదేశించింది. ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులు మనీష్, రజనీమూర్తి భారత రాయబార అధికారులతో మాట్లాడి తాత్కాలిక పాస్‌పోర్టు, టికెట్‌ ఇప్పించి వారిని ఈ నెల 25న స్వదేశానికి రప్పించారు. హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి వారు స్వస్థలాలకు వెళ్లేందుకు ఖాతార్‌ తెలుగు కళా సమితి జనరల్‌ సెక్రటరీ దుర్గాభవాని ఆర్థిక సాయం చేశారు. బాధిత మహిళలు గంగాదేవి, గంగాభవానీ మాట్లాడుతూ.. ఖతార్‌లో ఇబ్బందులు పడుతున్న తమను గుర్తించి.. ఆదుకున్న ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)