Breaking News

మే నెలలో గడపగడపకు ఎమ్మెల్యే

Published on Thu, 04/07/2022 - 03:46

సాక్షి, అమరావతి: గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమం మే లో ప్రారంభమవుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈలోపు సచివాలయాల పరిధిలో సమస్యలను, ప్రభుత్వ పథకాలు ఎలా ప్రజలకు అందుతున్నాయనే విషయాలు తెలుసుకుని ఉంటే బాగుంటుందన్నారు. గడపగడపకు కార్యక్రమం పునాది వలంటీర్ల సత్కారసభలోనే పడాలన్నారు. ప్లీనరీ తర్వాత పార్టీ కార్యక్రమాలు బాగా పెరుగుతాయని చెప్పారు. సచివాలయాల పరిధిలో సూక్ష్మస్థాయి పరిశీలన ద్వారా పార్టీ శ్రేణుల పనితీరు, అసంతృప్తులు, గ్యాప్‌ ఎక్కడ ఉంది, వాటిని ఏ విధంగా సరిదిద్దుకుని ముందుకెళ్లాలనే అంశాలపై పూర్తి అవగాహన రావచ్చన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, నగర మేయర్లతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ అమలు చేస్తున్న పథకాల డెలివరీ మెకానిజం ఏ విధంగా జరుగుతోందో తెలుసుకునేందుకు వలంటీర్లకు పురస్కారాలు అందించి సత్కరించే కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, మునిసిపల్‌ చైర్మన్లతో సమన్వయం చేసుకుని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సచివాలయాల సంఖ్యను బట్టి ఈ కార్యక్రమాల షెడ్యూల్‌ రూపొందించుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులను కూడా సమాయత్తం చేసుకోవాలన్నారు. సీఎం జగన్‌ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా సిన్సియారిటీ, హానెస్టీ, ట్రాన్స్‌పరెన్సీ కోరుకుంటున్నారన్నారు.

ప్రజలకు అందే సేవల విషయంలో లోపాలుంటే సరిదిద్దుకోవచ్చన్నారు. వలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశాల ద్వారా లోపాలను గుర్తించి పరిష్కారాలు కనుగొనవచ్చని చెప్పారు. నియోజకవర్గాల్లో భవిష్యత్తు కార్యక్రమాలకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయన్నారు. ఇక నుంచి ప్రతి కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల పరిధిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నామినేటెడ్‌ పదవులు పొందినవారు, పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. అసంతృప్తులు ఉంటే వారిలో స్తబ్ధత తొలగించి అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలు తీసుకోవాలని చెప్పారు. వారికి ప్రేరణ కలిగించాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలదేనని పేర్కొన్నారు. బూత్‌ కమిటీలపై పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు 20 రోజుల్లో సమాచారం పంపాలని ఆయన కోరారు.  

Videos

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి పోరాడుతాం: బొత్స

Nizamabad: ముగ్గురు చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు శంకర్

తమ్మినేని సీతారాం హౌస్ అరెస్ట్... ఆముదాలవలసలో ఆందోళన

Sahasra Mother: హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర..!

బాబు సర్కార్ అప్పులు.. కాగ్ నివేదికపై వైఎస్ జగన్ రియాక్షన్

కూకట్‌పల్లి పీఎస్ వద్ద సహస్ర కుటుంబసభ్యుల ఆందోళన

ఏడు అంశాల అజెండాగా పీఏసీ సమావేశం

నాకు నటించాల్సిన అవసరం లేదు కూన రవికుమార్ బండారం బయటపెట్టిన సౌమ్య

కూటమి ప్రభుత్వంలో పెన్షనర్ల కూడు లాక్కుంటున్నారు

Sahastra Incident: క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకే బాలుడు వెళ్లాడు: సీపీ మహంతి

Photos

+5

కాబోయే మరదలితో రిబ్బన్‌ కట్‌ చేసిన సారా.. సచిన్‌ పుత్రికోత్సాహం (ఫొటోలు)

+5

పట్టుచీరలో చందమామలా.. అనసూయ కొత్త ఫొటోలు

+5

ఆఖరి శ్రావణ శుక్రవారం పూజ : నిండు గర్భిణి సోనియా ఆకుల (ఫొటోలు)

+5

తెలంగాణ : ప్రసిద్ద వెంకటేశ్వర ఆలయం రత్నాలయం.. తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)

+5

ప్రభాస్ ఫస్ట్‌ హీరోయిన్‌ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)