Breaking News

రాజకీయ నేతలకు భిన్నంగా విద్యకు సీఎం జగన్‌ ప్రాధాన్యం

Published on Wed, 09/22/2021 - 02:36

సాక్షి, అమరావతి: విద్యారంగంలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ‘సయంట్‌’వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. మంగళవారం విజయవాడలో మొదలైన ‘వాణిజ్య ఉత్సవ్‌’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాధారణంగా రాజకీయ నాయకులు విద్యారంగాన్ని పట్టించుకోరని, సీఎం జగన్‌ దీనికి భిన్నంగా కీలక సంస్కరణలు చేపట్టారని ప్రశంసించారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా తొలిదశలో 15,000కిపైగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించడం, అమ్మ ఒడి, విద్యా కానుక లాంటి కార్యక్రమాల అమలు, 26 స్కిల్‌ కాలేజీలు, 2 స్కిల్‌ వర్సిటీల ఏర్పాటు లాంటి చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. 

పరిశోధనలకు నిధులివ్వాలి..
ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ప్రతి ఎనిమిది ఉద్యోగాలకు ఒకరు మాత్రమే అందుబాటులో ఉన్నారని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని స్కిల్‌ కాలేజీలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని మోహన్‌రెడ్డి కోరారు. ప్రభుత్వం విద్యారంగంలో తెస్తున్న సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు దీర్ఘకాలంలో మేలు జరుగుతుందని చెప్పారు. కేవలం చదువుపైనే కాకుండా ఉపాధి కల్పన దిశగా నవతరం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఇంజనీరింగ్‌ కాలేజీలో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు పరిశోధన రంగానికి భారీగా నిధులు కేటాయించాలన్నారు. కొత్త పారిశ్రామికవేత్తలు రావడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 


వసతుల కల్పనలో రాష్ట్రం ముందంజ
రాష్ట్రంలో 19 భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులున్నాయని, సుదీర్ఘ తీర ప్రాంతం వల్ల పలు దేశాలకు వేగంగా ఎగుమతులు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి వ్యయాన్ని తగ్గించడంతో పాటు నష్ట భయాన్ని నివారించేలా సీఎం జగన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. 600 మందికిపైగా పాల్గొంటున్న ఈ ఎక్స్‌పోర్ట్‌ కాన్‌క్లేవ్‌ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం ముందంజలో ఉందని, కోవిడ్‌ ఇబ్బందులున్నా ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని చెప్పారు.   

Videos

భారతీయులకు ట్రంప్ మరో షాక్..

Big Question: ఏపీలో పిచ్చి కుక్కలా రెడ్ బుక్.. హడలిపోతున్న పారిశ్రామికవేత్తలు

Magazine Story: నాడైనా, నేడైనా నేనే లిక్కర్ బాద్ షా..!

మళ్ళీ ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 2025

కలర్ ఫుల్ బ్యూటీస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నరాలు తెగే హైప్ ఇచ్చిన హృతిక్ రోషన్

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య ఎమోషనల్..

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

రేపట్నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం

Liquor Case: రాజకీయ కక్ష అని తేలితే...? సుప్రీం సీరియస్

Photos

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' హీరో క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

Subham Success Meet : శుభం సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)

+5

'వచ్చినవాడు గౌతమ్‌' సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

సుందరీమణుల మనస్సు దోచిన 'పోచంపల్లి చీరలు'..ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)

+5

సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలో సీఎం రేవంత్‌ పర్యటన (ఫొటోలు)

+5

Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్‌ వరల్డ్‌ బ్యూటీస్‌ సందడి (ఫొటోలు)

+5

బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)