Breaking News

‘ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవటం కాదు’.. అనురాగ్‌ ఠాగూర్‌పై నిప్పులు చెరిగిన ఏపీ మంత్రి

Published on Sun, 08/21/2022 - 17:55

తాడేపల్లి: విజయవాడలో పర్యటించిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు మంత్రి జోగి రమేష్‌. సుజనా చౌదరి టీడీపీ ఆఫీసు నుంచి తెచ్చిన స్క్రిప్టుని బీజేపి నేత అనురాగ్ ఠాగూర్ చదివారని.. అసలు అనురాగ్‌కి ఏపీ గురించి, ఇక్కడి ప్రభుత్వం గురించి ఏం తెలుసు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ మూడేళ్లలో రెండు లక్షల మంది యువతకి రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 90 వేలమందికి ఔట్ సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పించామన్నారు. ఇవేమీ తెలుసుకోకుండా టీడీపీ ఇచ్చిన స్క్రిప్టు చదివితే సరిపోతుందా? అని ధ్వజమెత్తారు. మతతత్వ రాజకీయాలతో రాష్ట్రంలో ఎదగాలని ఆశ పడుతున్నారని ఆరోపించారు.  

‘యువతకు ఉద్యోగాలు లేవన్న అంశంపై చర్చకు వస్తారా? ఢిల్లీ నుంచి రావటం, ఎవరో ఇచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లటం కాదు. మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా 2 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇచ్చారా? దమ్ముంటే చర్చకు వచ్చి సమాధానం చెప్పాలి. కరోనా కష్ట కాలంలో కూడా వాలంటీర్లతో సంక్షేమం అందించాం. రాష్ట్రంలో దోపిడీ చేసింది ఎవరు? రాష్ట్రంలో మీరు పెంచి పోషించిన చంద్రబాబు దోచుకున్నారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబు. అసలు మీకు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత ఉందా? ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారు. పోలవరం పూర్తి చేస్తామని చెప్పి నిలువునా మోసం చేశారు. హామీ ఇచ్చిన యూనివర్సిటీలు, లోటు బడ్జెట్ నిధులు ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రంలో మతతత్వ చిచ్చు పెట్టాలని చూస్తున్నారా? మా రాష్ట్రాన్ని మోసం చేసిన మీకు ఏం చూసి ఓటెయ్యాలి? మీరు ఒక్క ఎమ్మెల్యే సీటు కాదుకదా.. వార్డు సభ్యునిగా కూడా గెలవలేరు.’ అని అనురాగ్‌ ఠాగూర్‌పై ధ్వజమెత్తారు మంత్రి జోగి రమేష్‌. 

పవన్ కళ్యాణ్‌కి కనీసం అన్ని సీట్లలో పోటీ చేస్తానని చెప్పే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్‌. వైఎస్‌ జగన్ సీఎం అయినందుకు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని.. అసలు పవన్‌కి కౌలు రైతులు, వ్యవసాయం అంటే ఏంటో తెలుసా? చెప్పాలన్నారు. 2014లో జనసేనని టీడీపీకి తాకట్టు పెట్టారని.. 2024లో కూడా అదే చేస్తారని విమర్శించారు. తన ప్యాకేజీ తీసుకుని పవన్ వెళ్ళిపోతారని.. కులాలను రెచ్చగొట్టే తెగులు చంద్రబాబు, పవన్‌దేనన్నారు. అందుకే గత ఎన్నికలలో వారికి ప్రజలు తగిన బుద్ది చెప్పారని గుర్తు చేశారు. 2024లో 175 సీట్లు  వైఎస్‌ఆర్‌సీపీ సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ని ఎదుర్కొనే దమ్ము వీరెవరికీ లేదని.. ఐదు కోట్ల జనం ఆయన వెంట ఉన్నారని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఏం తమాషాగా ఉందా.. పోలీసులకే వార్నింగ్‌ ఇచ్చిన నారా లోకేష్‌ బాబు..

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)