Breaking News

మూడు కోట్లు ఇవ్వాల్సిందే!

Published on Thu, 12/04/2014 - 03:05

 నటి కాజల్ కాల్‌షీట్స్ అడగాలంటే దర్శక, నిర్మాతలకు చాలా ధైర్యం కావాలంట. లేకుంటే ఆమె డిమాండ్ చేసే పారితోషికానికి గుండెలు గుభేల్ మనడం ఖాయం అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఈ అమ్మడి ఆశకు అంతులేకుండా పోతోందట. టాలీవుడ్, బాలీవుడ్‌లో అవకాశాలు సన్నగిల్లడానికి కారణం కూడా ఇదే నంటున్నారు. సరిగ్గా ఏడాది క్రితం కోలీవుడ్‌లో జిల్లా చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఆ తరువాత ఇక్కడ అవకాశాలు దరి చేరలేదు. అలాంటిది తాజాగా బాలాజి మోహన్ దర్శకత్వంలో ధనుష్‌తో జోడి కట్టే అవకాశం వచ్చింది. ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే ఈ అమ్మడికి మరో అవకాశం తలుపు తట్టింది.
 
 అదే విశాల్‌తో రొమాన్స్ చేసే అవకాశం. ప్రస్తుతం విశాల్ ఆంబళ చిత్రంలో నటిస్తున్నారు. హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. సంక్రాంతికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. విశాల్ తదుపరి సుశీంద్రన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. పాండియనాడు వంటి విజయవంతమైన చిత్రం తరువాత వీరి కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో మొదట లక్ష్మీమీనన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరిగింది.
 
 ఇప్పుడామె స్థానంలో కాజల్ వచ్చి చేశారు. అయితే నటుడు విశాల్‌కు తమిళంతోపాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండడంతో ఈ చిత్రాన్ని ద్విభాషల్లో నిర్మించాలని చిత్ర నిర్మాణ సంస్థ వేందన్ మూవీస్ నిర్ణయించుకుంది. దీంతో ఇది ద్విభాషా చిత్రం కాబట్టి తన పారితోషికాన్ని తమిళ వెర్షన్‌కు కోటిన్నర, తెలుగు వెర్షన్‌కు మరో కోటిన్నర మొత్తం మూడు కోట్లు ఇవ్వాలంటూ కాజల్ అగర్వాల్ డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో బెంబేలెత్తిన చిత్ర నిర్మాణ సంస్థ అధినేత అంత ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేశారట. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానున్నట్లు దర్శకుడు సుశీంద్రన్ వెల్లడించారు.  
 

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)