Breaking News

జర్నలిస్టుపై కోహ్లి ఆగ్రహం

Published on Mon, 03/02/2020 - 11:28

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌పై సరైన ప్రణాళికలు అమలు చేయకపోవడం వల్లే ఓడిపోయామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంగీకరించాడు. సమిష్టిగా రాణించడంలో తమ జట్టు సభ్యులు విఫలమయ్యారని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. భారత్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్ట్‌ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లి.. ఓ జర్నలిస్టుపై  ఆగ్రహం వ్యక్తం చేశాడు. (అద్భుతాలు జరగలేదు.. మనం గెలవలేదు)

టెస్ట్‌ మ్యాచ్‌ రెండో రోజు మైదానంలో కోహ్లి ప్రవర్తించిన తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మైదానంలో అరుస్తున్న ప్రేక్షకుల వైపు తిరగుతూ.. నోరు మూసుకోవాలి అన్నట్లు కోహ్లి సైగ చేశాడు. అలాగే ఆవేశంగా ఏదో అంటున్నట్టు కనిపించాడు. ఇందుకు సబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు  నెటిజన్లు కోహ్లి క్రీడా స్పూర్తిని మరిచి ప్రవర్తించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్టు ఈ ఘటనపై కోహ్లి స్పందించాల్సిందిగా కోరారు. దీంతో అసహనానికి లోనైన కోహ్లి.. ఒక ఘటన గురించి పూర్తిగా తెలుసుకోకుండా ప్రశ్నలు ఎలా అడుగుతారని ఘాటుగా స్పందించాడు.

జర్నలిస్టు : విరాట్‌, మైదానంలో మీ ప్రవర్తనపై ఏం చెబుతారు?. కేన్‌ విలియమ్సన్‌ జౌట్‌ అయినప్పుడు మీరు ఎందుకు అలా ప్రవర్తించారు. టీమిండియా కెప్టెన్‌గా మైదానంలో ఇలాంటి సంప్రాదాయం నెలకొల్పడం సరైనది కాదని మీకు అనిపించలేదా?
కోహ్లి : మీరు ఏమనుకుంటున్నారు?
జర్నలిస్టు : నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను?
కోహ్లి : నేను మిమ్మల్ని సమాధానం అడుగుతున్నాను?
జర్నలిస్టు : మీరు మంచి సంప్రాదాయాన్ని నెలకొల్పాల్సి ఉంటుంది. 
కోహ్లి : మీరు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే సరైనా ప్రశ్నలు అడగాలి. సగం వివరాలతో సగం సగం ప్రశ్నలు అడగకండి. ఒకవేళ మీరు వివాదం సృష్టించాలనుకుంటే ఇది అందుకు సరైన వేదిక కాదు. నేను మ్యాచ్‌ రిఫరీతో మాట్లాడాను.. అతనికి మైదానంలో జరిగిన దానితో ఎలాంటి సమస్య లేదు. 

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)