Breaking News

ప్లాస్మా దాతల‌కు క‌ర్ణాట‌క ప్రోత్సాహకం

Published on Thu, 07/16/2020 - 16:59

బెంగుళూరు :  దేశంలో క‌రోనా వేగంగా విజృంభిస్తోంది. వైర‌స్ నుంచి కోలుకున్న‌వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. వ్యాధి తీవ్ర‌మ‌యి ఆరోగ్యం క్షీణించిన వారిలో ప్ర‌యోగాత్మ‌కంగా అందిస్తోన్న ప్లాస్మా థెరపీకి ప్ర‌స్తుతం విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. అయితే దానికి తగ్గ‌ట్లు ప్లాస్మా దాతలు త‌గినంతగా ల‌భించ‌క‌పోవ‌డంతో కొంద‌రు ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న‌వారు  పెద్ద సంఖ్య‌లో ఉన్నా అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా ప్లాస్మా ల‌భించ‌డం లేదు. దీంతో దాత‌లు ముందుకు రావాలంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విన‌తులు వెల్లువెత్తుతున్నాయి. ప్లాస్మాదాత‌లు లేక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా క్ర‌మంగా అధిక‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో దాత‌ల‌ను ప్రోత్సహించేలా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. క‌రోనా నుంచి కోలుకున్న వ్య‌క్తులు ప్లాస్మాను దానం చేస్తే 5000 రూపాయ‌ల‌ను ప్రోత్సాహ‌కంగా అందిస్తామ‌ని తాజాగా నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఆరోగ్య‌శాఖ మంత్రి బి శ్రీరాములు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. (‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’)

దేశంలో అత్య‌ధిక ప్లాస్మా ప‌ద్ధ‌తిని ఉప‌యోగిస్తున్న రెండ‌వ రాష్ర్టం క‌ర్ణాట‌క అని మంత్రి అన్నారు. దాదాపు 80 శాతం క‌రోనా రోగులు ఈ ప‌ద్ధ‌తి ద్వారా త్వ‌ర‌గా కోలుకున్నార‌ని తెలిపారు. అయితే ప్రాణ‌దాత‌లుగా గొప్ప దాతృత్వాన్ని ప్ర‌ద‌ర్శించాల్సిన స‌మ‌యంలో దీన్ని కూడా డ‌బ్బుతో పోల్చ‌డంపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను మంత్రి కొట్టిపారేశారు. ఇది ఎవ‌రినీ అవ‌మానించ‌డం కాద‌ని కేవ‌లం దాత‌ల‌ను ప్రోత్స‌హించే ఉద్దేశం మాత్ర‌మేన‌ని అన్నారు. రాష్ర్ట రాజ‌ధాని బెంగుళూరులో క‌రోనా తీవ్ర‌రూపం దాలుస్తుంది. అన్‌లాక్ 1 ప్రారంభ ద‌శ‌లో 600 క‌న్నా త‌క్కువ ఉన్న క‌రోనా కేసుల తీవ్ర‌త ఇప్ప‌డు 22 వేలు దాటింది. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 47,000 దాటింది. గ‌త 24 గంట‌ల్లోనే అత్య‌ధికంగా 3176 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. (బాదేసే బిల్లు)


 

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)