బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
జిల్లా ఉద్యమం.. తీవ్రతరం
Published on Fri, 09/09/2016 - 23:48
గద్వాల న్యూటౌన్ : గద్వాల జిల్లా సాధనలో భాగంగా జేఏసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయనుంది. శుక్రవారం స్థానిక టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన సమావేశంలో శనివారం నుంచి ఈ నెల 20 వరకు చేపట్టనున్న ఉద్యోగుల పెన్, ఉపాధ్యాయల చాక్డౌన్పై చర్చించారు. ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ఆయా సంఘాల బాధ్యులకు సూచించారు. ఆదివారం జూరాల ప్రాజెక్టుపై మన జిల్లా– మన ప్రాజెక్టు పేరుతో చేపట్టనున్న నిరసన కార్యక్రమం కరపత్రాలను విడుదల చేశారు. 12న స్థానిక తేరుమైదానంలో నిర్వహించే బహిరంగ సభకు ప్రొఫెసర్ కోదండరాం హాజరవుతారని, 15వ తేదీన టీపీఎఫ్ సీనియర్ నాయకుల ఆమరణ నిరాహార దీక్ష, 18న అఖిలపక్షం ఆధ్వర్యంలో గద్వాలలో ర్యాలీ, మహాసభ, 19 నుంచి మూడు రోజుల పాటు సకల జనుల సంపూర్ణ బంద్ చేపట్టనున్నారు. అనంతరం జేఏసీ నాయకులు వెంకట్రాములు, వీరభద్రప్ప మాట్లాడుతూ గద్వాల జిల్లా ఏర్పడితేనే ఈప్రాంత రైతాంగానికి మేలు చేకూరుతుందని చెప్పారు. సమావేశంలో జేఏసీ నాయకులు వెంకటరాజారెడ్డి, కృష్ణారెడ్డి, బాలగోపాల్రెడ్డి, ఆనంద్, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#
Tags : 1