Breaking News

మా నోటీసులపై చర్యలేవీ?

Published on Wed, 02/24/2016 - 00:30

పివిలేజ్ కమిటీ మీటింగ్‌లో ప్రశ్నించిన వైఎస్సార్‌సీసీ సభ్యులు
ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని కమిటీ పనిచేస్తున్నట్లుగా ఉంది

హైదరాబాద్: తాము అందించిన నోటీసులు ఇంత వరకూ కమిటీ ముందుకు రాకపోవటంపై వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రివిలేజ్ కమిటీ ముందుకు రాకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ పనితీరు చూస్తే ఏకపక్షంగా, ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోందని, ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని వారు కోరారు. ప్రివిలేజ్ కమిటీ సమావేశం మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన కమిటీ సమావే శంలో సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, బీసీ జనార్ధనరెడ్డి పాల్గొన్నారు. తమ హక్కులను హరిస్తున్నారని వైఎస్సార్‌సీసీ సభ్యులు గత ఏడాది మార్చిలో ఏడు నోటీసులను అందించారు. అందులో ఒక్కటి కూడా ఇప్పటి వరకూ కమిటీ ముందుకు రాలేదు. ఇదే అంశాన్ని పెద్దిరెడ్డి, జ్యోతుల సమావేశంలో ప్రస్తావించారు. ఒక్క నోటీసు కూడా కమిటీ ముందుకు రాకపోవటం తమకు అనుమానాలు కలిగిస్తోందని, ఎందువల్ల ఇలా జరుగుతుందో వెంటనే తెలుసుకోవాల్సిందిగా ఛైర్మన్‌ను కోరారు.

తాము గతంలో అందచేసిన ప్రివిలేజ్ నోటీసుల కాపీలను ఛైర్మన్‌కు ఇచ్చారు. కమిటీ ముందుకు అవి రాకపోవటానికి దారి తీసిన కారణాలను తెలుసుకోవాల్సిందిగా కోరారు. కమిటీ పార్టీరహితంగా పని చేయాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. దీనిపై ఛైర్మన్ స్పందిస్తూ తాను సభ్యులు అందచేసిన కాపీలను అసెంబ్లీ సచివాలయానికి పంపి సమాచారం తెప్పించుకుంటానని చెప్పారు. ఇదే సమావేశంలో గత డిసెంబర్ 22న శీతాకాల సమావేశాల జీరో అవర్‌లో జరిగిన చర్చ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ నివేదికను ప్రివిలేజ్ కమిటీలో చర్చకు చేపట్టాల్సిందిగా అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె. సత్యనారాయణ అప్పటికపుడు ఎజెండాలో పెట్టేందుకు ప్రయత్నించగా వైఎస్సార్‌సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు నివేదిక ప్రతులు ఇవ్వకుండా చర్చించమంటే సాధ్యం కాదని, తమకు తొలుల నివేదిక అందిస్తే అధ్యయనం చేసి ఆ త రువాత చర్చిస్తామని చెప్పటంతో చివరకు ఛైర్మన్, ఇన్‌ఛార్జి కార్యదర్శి సరేనన్నారు. ఇదిలా ఉంటే కమిటీ మీటింగ్‌లో ఏడు నోటీసులపై చర్చ జరిగింది. ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చిన సభ్యులు వచ్చే నెల నాలుగో తేదీన హాజరై తమ వాదనలు వినిపించాల్సిందిగా కోరారు.


 

Videos

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

రాసుకో చంద్రబాబు.. ఒకే ఒక్కడు వైఎస్ జగన్

మీర్ చౌక్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

ఏపీ పోలీసు వ్యవస్థ మొత్తం చంద్రబాబు గుప్పిట్లో బందీ అయిపోయింది

అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

Photos

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విన్ బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)

+5

చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)

+5

Miss World 2025 : రామోజీఫిల్మ్‌ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)

+5

#MissWorld2025 : పిల్లలమర్రిలో అందగత్తెల సందడి (ఫొటోలు)

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)