Breaking News

రూ.లక్షల కోట్ల ఆదా సరే.. మైలేజ్ కోతకు పరిష్కారమేది?

Published on Thu, 08/27/2026 - 09:02

భారతదేశం ఇంధన స్వాలంబన వైపు వేగంగా అడుగులు వేస్తోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) ప్రకారం, 2013-14లో 1.53% ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ 2025-26 నాటికి 20% (E20)కి చేరింది. దీనివల్ల రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడంతోపాటు రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి.

అయితే, హారాల్డ్ లాస్‌వెల్ (1956), చార్లెస్ లిండ్‌బ్లోమ్ (1959) సిద్ధాంతాలు(ప్రభుత్వం ఎలా నిర్ణయాలు తీసుకోవాలో చెప్పే సిద్ధాంతాలు) పేర్కొన్నట్లు.. విధాన రూపకల్పనలో కేవలం లక్ష్య సాధనే కాకుండా, అమలులో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా సర్దుబాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం.

ప్రధాన సవాళ్లు.. వినియోగదారుల భారం

పాత వాహనాల్లో ఈ20 అనుకూలతపై స్పష్టమైన అంచనా లేదని, వీటిలో మైలేజ్ 3–5% తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది. బంకుల్లో పాత ఇంధనం దొరక్కపోవడంతో వినియోగదారులు మైలేజ్ కోతను, విడిభాగాల అరుగుదల వ్యయాన్ని తప్పనిసరిగా భరించాల్సి వస్తోంది. ఇథనాల్ శాతాన్ని పెంచడానికే ప్రాధాన్యమివ్వడంతో వాహనదారుల ప్రయోజనాలు, వాహనాల సన్నద్ధత ప్రాధాన్యం కోల్పోయాయి.

అంతర్జాతీయ పాఠాలు

బ్రిటన్ E10ను ప్రవేశపెట్టినప్పుడు పాత వాహనాల కోసం E5ని ‘ప్రొటెక్షన్ గ్రేడ్’గా కొనసాగించి వాహన అనుకూలతను సరిచూసుకునే సదుపాయం కల్పించింది. వినియోగదారులు లేవనెత్తుతున్న మైలేజ్, వారంటీ సమస్యలను అపోహలుగా కొట్టిపారేయకుండా ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేవలం ఇంధనంలో ఇథనాల్‌ కలిపే శాతాన్నే కాకుండా నీటి వినియోగం, ఇతర ఉద్గారాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అనుభవాల ఆధారంగా విధానాన్ని సరళంగా సవరించుకోవడమే నిజమైన పరిపాలనా సామర్థ్యమని చెబుతున్నారు.

ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా..

#

Tags : 1

Videos

రాజీనామా చెయ్! నీకు రోజులు దగ్గర పడ్డాయి ధూళిపాళ్ల నరేంద్ర... బ్రాహ్మణుల ఉసురు ఊరికే పోదు

పందితో 30 నిమిషాల ఫైట్.. 14 ఏళ్ల కుర్రాడి దమ్ము చూస్తే షాక్!

ఇరుముడి హిట్‌తో రవితేజ దశ తిరిగిందా?

నేపాల్ వరదలకు అసలు కారణమేంటి? మరో ముప్పు ఎందుకు?

మరో జలవిలయం.. ప్రాణభయంతో జనం పరుగులు

నేపాల్ వరదల్లో.. ఏపీ, తెలంగాణ యాత్రికులు గల్లంతు

జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి హత్య.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు

అమ్మవారికి మంగళ సూత్రాలు సమర్పించిన అంబటి మురళి

"కొడుకా ఎక్కడున్నావురా నాన్నా”.. తండ్రి ఆరాటం కంటతడి పెట్టిస్తోంది!

కరెంట్ పోల్ ఎక్కిన తాగుబోతు.. గంటపాటు టెన్షన్

Photos

+5

ఓనం వేడుకలో కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తార మంజు వారియర్..(ఫోటోలు)

+5

ఫ్యామిలీతో అనుపమ ఓనం సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : చార్మినార్ వద్ద ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు (ఫొటోలు)

+5

రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)

+5

'టాక్సిక్' మూవీ ట్రెండింగ్ లో నయనతార (ఫొటోలు)

+5

హీరోయిన్ మానస వారణాసి ఓనం సెలబ్రేషన్స్.. (ఫొటోలు)

+5

నేపాల్‌లో వరద బీభత్సం... (ఫొటోలు)

+5

'రోమాంచకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దుబాయిలో తన డ్యాన్స్ స్టూడియోలో పూర్ణ ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)