Breaking News

వాట్సాప్‌లో KYC చేస్తున్నారా?.. తస్మాత్‌ జాగ్రత్త!

Published on Mon, 08/17/2026 - 11:35

బ్యాంక్ లోన్, క్రెడిట్ కార్డ్, ప్రాపర్టీ కొనుగోలు, హోటల్ బుకింగ్ లేదా ఇతర సేవల కోసం పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి పత్రాలను అడగడం సర్వసాధారణమైపోయింది. అయితే చాలాసార్లు వీటిని వాట్సాప్ ద్వారా పంపండి అని ఏజెంట్ అడిగితే.. ఏ మాత్రం ఆలోచించకుండా పంపిస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. ఎందుకో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

డాక్యుమెంట్స్ పంపిస్తే..
మనకు సంబంధించిన డాక్యుమెంట్‌లను ఏజెంటుకు లేదా ఇతర వ్యక్తులకు పంపిస్తే ఏం కాదులే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఆ డాక్యుమెంట్ అవతలి వ్యక్తి ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ల్యాప్‌టాప్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఆ తరువాత ఆ డాక్యుమెంట్స్ ఎక్కడికి వెళ్తాయో.. ఎన్ని కాపీలు తయారవుతాయో కూడా మనకు తెలియదు. వీటిని ఉపయోగించి కొంతమంది మోసాలకు పాల్పడవచ్చు.

కొన్నిసార్లు బ్యాంక్ లేదా కంపెనీలకు కేవైసీ అవసరం కావొచ్చు. అలాంటి.. సందర్భంలో ఆ కేవైసీని ఒక ఉద్యోగి తన వ్యక్తిగత వాట్సాప్ నెంబర్ ద్వారా సేకరిస్తాడు. ఇది కూడా ఒక సమస్యే అనే విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే.. ఆ ఉద్యోగి కంపెనీ మారవచ్చు. లేదా ఉద్యోగం వదిలేయవచ్చు. అలాంటప్పుడు మీ వ్యక్తిగత సమాచారం కంపెనీ అధికారిక వ్యవస్థలో కాకుండా, ఒక వ్యక్తి ఫోనులో ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో మీ పత్రాలను తప్పుడు పనులకు ఉపయోగించే అవకాశం ఉంటుంది.

డేటా దుర్వినియోగం అయితే?
పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో మన వ్యక్తిగత, ఆర్థిక వివరాలు ఉంటాయి. ఈ సమాచారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే అనుచిత కాల్స్, మెసేజస్, గుర్తింపు దుర్వినియోగం, ఆర్థిక మోసాలు వంటివి జరగవచ్చు. కాబట్టి వ్యక్తిగత సమాచారం తెలిపే పత్రాల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి.

DPDP చట్టం మనకు ఏం చెబుతోంది?
భారతదేశంలోని డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం (Digital Personal Data Protection Act) ప్రకారం.. వ్యక్తిగత డేటాను బాధ్యతగా సేకరించడం, ఉపయోగించడం, నిర్వహించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక సంస్థ మీ వ్యక్తిగత సమాచారం తీసుకుంటే దానికి ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉండాలి, ఆ డేటాను బాధ్యతగా నిర్వహించాలి.

భారతదేశంలో సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సమయంలో మీ వ్యక్తిగా సమాచారం పంపించే ముందు తప్పకుండా ఆలోచించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 వార్షిక నివేదిక ప్రకారం.. రూ. 36,014 కోట్ల విలువైన 23,953 బ్యాంకింగ్ మోసాల కేసులు నమోదయ్యాయి. దీన్నిబట్టి చూస్తే ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తోంది.

సురక్షితమైన మార్గం ఏమిటి?
బ్యాంక్స్, హోటల్స్ లేదా ఇతర కంపెనీలకు కొన్నిసార్లు ఐడెంటిటీ వెరిఫికేషన్ నిజంగానే అవసరం కావొచ్చు. అలాంటప్పుడు మీ డాక్యుమెంట్లను వాట్సాప్ నెంబరుకు పంపించకుండా.. అధికారిక వెబ్‌సైట్, సెక్యూర్ అప్లోడ్ పోర్టల్ లేదా డిజిటల్ వెరిఫికేషన్ సిస్టం ద్వారా షేర్ చేయడం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీ డేటాను ఎవరు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయం మీకు తెలిసి ఉండాలి.

Videos

Telangana SIR: 90 లక్షల మందికి నోటీసులు -CEO సుదర్శన్ రెడ్డి

పిఠాపురంలో TDPకి బిగ్ స్ట్రోక్..!

భారత్ ఎన్నికలపై ట్రంప్ ఫోకస్..! అమెరికాలో కొత్త రూల్స్ కు పిలుపు

రేవంత్ పై కోపమా అక్కా.. CM టూర్ లో మంత్రి మిస్సింగ్

ఫారిన్ మెడికల్ స్టూడెంట్స్ పై జూడాల సమ్మె ప్రభావం

ప్రియాంక కేసులో కీలక మలుపు నిందితులకు పోలీస్ కస్టడీ

BJPకి షాక్ ఇస్తూ.. విజయ్ ని మెచ్చుకున్న అన్నామలై..

అర్ధరాత్రి ఆపరేషన్..! పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు

దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..?

మహిళతో TDP నేత సంచలన ఆడియో లీక్

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)

+5

18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)

+5

న్యూయార్క్‌ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)

+5

కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్‌ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)

+5

చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)

+5

వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్‌ (ఫొటోలు)

+5

‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

బండ్ల గణేశ్‌ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)