Breaking News

EPFOకు రూ.1,816 కోట్ల నష్టం.. అనిల్‌ అంబానీపై కేసు

Published on Sun, 08/02/2026 - 09:16

రిలయన్స్‌ ఏడీఏ గ్రూప్‌ అధినేత అనిల్‌ అంబానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎల్‌) మాజీ చైర్మన్‌ అనిల్‌ అంబానీ, సంస్థకు చెందిన ఇతర వ్యక్తులు, గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ)కు సుమారు రూ.1,816 కోట్ల నష్టం వాటిల్లేలా మోసపూరిత లావాదేవీలు, నిధుల మళ్లింపు జరిగాయని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కేసులో సుమారు రూ.1,007 కోట్ల మూలధనం, రూ.808.67 కోట్ల వడ్డీ మొత్తాలు సమస్యలో ఉన్నట్లు పేర్కొన్నారు.

రూ.2,500 కోట్లను పెట్టుబడి పెట్టిన ఈపీఎఫ్‌ఓ

ఫిర్యాదు ప్రకారం.. రిలయన్స్‌ క్యాపిటల్‌ 2013, 2014 సంవత్సరాల్లో సెక్యూర్డ్‌ నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సీడీలు) జారీ చేసింది. వీటిలో ఈపీఎఫ్‌ఓ తన నిధుల నుంచి మొత్తం రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడులను నాలుగు పోర్ట్‌ఫోలియో మేనేజర్ల ద్వారా నిర్వహించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఎన్‌సీడీల్లో కొన్నింటి మెచ్యూరిటీ 2023, 2024లో ఉండగా, రిలయన్స్‌ క్యాపిటల్‌ తన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైంది. ఫలితంగా ఈపీఎఫ్‌ఓకు భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి.

నిధుల మళ్లింపుపై ఆరోపణలు

రిలయన్స్‌ క్యాపిటల్‌ నుంచి నిధులు ఇతర లావాదేవీలకు మళ్లించేందుకు మోసపూరిత మార్గాలను ఉపయోగించారని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ లావాదేవీలే ఎన్‌సీడీలను తిరిగి చెల్లించడంలో సంస్థ డిఫాల్ట్‌కు దారితీశాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు సహా ఎవరెవరి పాత్ర ఉందో గుర్తించడం, నిధులను ఏ విధంగా ఉపయోగించారో తేల్చడం, పెట్టుబడి మొత్తాల తుది వినియోగాన్ని నిర్ధారించడం తమ దర్యాప్తులో ప్రధాన అంశాలని సీబీఐ వెల్లడించింది.

ఇదీ చదవండి: బంగారం, వెండి‌ ధరలు.. వారంలో ఎంత తగ్గాయంటే..

Videos

కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..

మూవీ చూసి బాబాయ్ ఏం చెప్పాడంటే..

విరుపాక్షిని హత్య చేసే కుట్ర..! లోకేష్ ని వదిలిపెట్టం..

ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పై బుట్టా రేణుక స్ట్రాంగ్ రియాక్షన్

పెమ్మసాని పై అంబటి అదిరిపోయే సాంగ్

బాబుకు షాక్.. TDPపై జనసేన ఘన విజయం

మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ఇరాన్ యుద్ధం పై ట్రంప్ కీలక నిర్ణయం..

విశాఖ యారాడ బీచ్ లో విషాదం..! అలల ఉధృతికి ఇద్దరు గల్లంతు

Photos

+5

Ujjaini Mahankali Bonalu : ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. దోస్తులతో మంచు లక్ష్మీ (ఫొటోలు)

+5

కాశీ పరమేశ్వరుడి సేవలో ధనశ్రీ వర్మ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 02- 09)

+5

శ్రీవారి సేవలో యాంకర్ లాస్య-మంజునాథ్ జంట(ఫోటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో దివ్య పిళ్లై స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

చీరలో సంయుక్త.. ఎంత అందంగా ఉందో(ఫోటోలు)

+5

బ్లాక్ శారీలో మెరిసిన కాయదు లోహర్.. ఫోటోలు

+5

లండన్ ట్రిప్‌లో వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

మిల మిల మెరిసిన 'చెన్నై లవ్ స్టోరీ' తార (ఫొటోలు)