Breaking News

నేపాల్‌లో ఇక రూ.200, రూ.500 నోట్లు..

Published on Mon, 07/27/2026 - 11:29

భారత్–నేపాల్ మధ్య ప్రయాణాలు, సరిహద్దు వాణిజ్యానికి ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని నేపాల్ ప్రభుత్వం అమలు చేసింది. 2016లో భారత్‌లో నోట్ల రద్దు తర్వాత అమల్లోకి వచ్చిన కఠిన పరిమితులను సడలిస్తూ, 2016 నవంబర్ 9 తర్వాత జారీ చేసిన భారతీయ రూ.200, రూ.500 నోట్లను ఒక్కో వ్యక్తి గరిష్ఠంగా రూ.25,000 వరకు నేపాల్‌లోకి తీసుకెళ్లడానికి, అక్కడి నుంచి తీసుకురావడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నేపాల్ రాష్ట్ర బ్యాంక్ (Nepal Rastra Bank–NRB) తాజాగా మరోసారి స్పష్టీకరణ నోటీసు విడుదల చేసింది.

ఫిబ్రవరి 11న నేపాల్ గెజిట్‌లో ఈ నిబంధనలు ఇప్పటికే ప్రచురించినప్పటికీ, వాటి అమలుపై స్పష్టత కల్పించేందుకు ఎన్‌ఆర్‌బీ తాజా నోటీసు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. భారతీయులు, నేపాలీయులు ఇద్దరూ 2016 నవంబర్ 9 తర్వాత ముద్రించిన రూ.200, రూ.500 నోట్లను చట్టబద్ధంగా వినియోగించవచ్చు. అయితే 2016కు ముందు జారీ చేసిన పాత రూ.500, రూ.1,000 నోట్లు మాత్రం నేపాల్‌లో ఇప్పటికీ నిషేధితంగానే ఉంటాయి.

ఎన్‌ఆర్‌బీ అధికార ప్రతినిధి గురు ప్రసాద్ పౌడెల్ ప్రకారం.. నేపాలీ పౌరులు భారత కరెన్సీని భారత్ నుంచి మాత్రమే నేపాల్‌కు తీసుకురావాలి. అలాగే నేపాల్ నుంచి భారతదేశం మినహా మూడో దేశానికి భారత కరెన్సీని తీసుకెళ్లేందుకు అనుమతి ఉండదు. ఈ నిబంధనలు సరిహద్దు నగరాల ప్రజలు, వ్యాపారులు, పర్యాటకులకు వర్తిస్తాయి. 

విదేశీ కరెన్సీ విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల్లో మార్పు లేదు. నేపాలీ పౌరులు, విదేశీ సందర్శకులు 5,000 అమెరికన్ డాలర్లు లేదా దానికి సమానమైన విదేశీ కరెన్సీని కస్టమ్స్ డిక్లరేషన్ లేకుండా తీసుకురావచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా కస్టమ్స్‌కు ప్రకటించాల్సి ఉంటుంది.

2016లో భారత ప్రభుత్వం రూ.500, రూ.1,000 పాత నోట్లను రద్దు చేసిన అనంతరం, నేపాల్ భద్రతా, ఆర్థిక కారణాలతో రూ.100కు మించిన భారతీయ నోట్ల ప్రవేశాన్ని నిలిపివేసింది. దాంతో భారత పర్యాటకులు, సరిహద్దు వ్యాపారులు, నేపాల్‌లో పనిచేసే వేలాది మంది నేపాలీయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజా నిర్ణయంతో దాదాపు పదేళ్ల తర్వాత ఆ పరిమితులకు గణనీయమైన సడలింపు లభించినట్లైంది. భారత్–నేపాల్ మధ్య పర్యాటకం, చిన్న స్థాయి సరిహద్దు వాణిజ్యం, ప్రజల మధ్య ఆర్థిక లావాదేవీలు మరింత సులభతరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఇది చదివారా? ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్బీఐ తొలి అడుగు! 

Videos

డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?

రంగనాథ్‌పై TG హైకోర్టు కీలక ఆదేశాలు

సీనియర్స్ కే ఆ అర్హత దక్కాలి వాళ్ళ తర్వాతే నేను

విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఔట్ సోర్సింగ్ కార్మికుల కన్నెర్ర..

పెద్దిని పరామర్శించిన KCR

దేవినేని ఉమాను కలిస్తే తప్పేంటి..? నోరు తెరిస్తే తట్టుకోలేవు..

మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్

గుడ్ న్యూస్.. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు..

పవన్ కళ్యాణికి బిగ్ షాక్ జనసేనపై తిరగబడ్డ Gen-Z

భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర మరీ ఇంతనా? తాజా రేట్లు చూసి షాక్ అవుతారు!

Photos

+5

'మహేంద్రగిరి వారాహి' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గర్ల్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (ఫొటోలు)

+5

మీనాక్షి చౌదరి అమెరికా ట్రిప్.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)

+5

ఏపీ : విశాఖపట్నం దగ్గరలో అద్భుతమైన జలపాతం... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు మనవి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. (ఫొటోలు)

+5

డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి 'ఛేంజ్‌ మేకర్‌' పురస్కారం అందజేసిన చిరంజీవి (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తి : ధర్మరాజులస్వామి ఆలయంలో శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం (ఫొటోలు)

+5

'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌కు తెలంగాణ బోనాలు (ఫోటోలు)

+5

నేచర్ ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ నటి అనసూయ (ఫోటోలు)