Breaking News

రూ.50,000 కోట్ల టార్గెట్ ఫిక్స్.. డిఫెన్స్ ఎగుమతుల్లో దూకుడు!

Published on Mon, 07/27/2026 - 09:59

భారత రక్షణ ఉత్పత్తి రంగం అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేస్తోంది. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.50,000 కోట్ల రక్షణ ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా చేరుకుంటుందని కేంద్ర రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. గత దశాబ్దంలో ఆత్మనిర్భర్ భారత్ పిలుపుతో విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకున్న భారత్ నేడు గ్లోబల్ సౌత్ దేశాలకు నమ్మకమైన భద్రతా భాగస్వామిగా రూపాంతరం చెందుతోందని చెప్పారు.

విశ్వవ్యాప్తంగా పెరిగిన డిమాండ్

గత ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.38,000 కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది ఏకంగా 61 శాతం వృద్ధి కావడం గమనార్హం. 2014 ప్రాంతంలో కేవలం రూ.600 కోట్లకు పరిమితమైన ఎగుమతులు నేడు ఈ స్థాయికి చేరడం భారత రక్షణ పారిశ్రామిక వ్యవస్థ సామర్థ్యానికి అద్దం పడుతోందని రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సంప్రదాయ యుద్ధ సామగ్రి, ఆర్టిలరీ షెల్స్, క్షిపణులు, డ్రోన్ సాంకేతికతలకు భారీ డిమాండ్ ఏర్పడింది. భారత ఆయుధ వ్యవస్థలు క్షేత్రస్థాయిలో నాణ్యతను నిరూపించుకోవడంతో అనేక దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని చెప్పారు.

లైన్ ఆఫ్ క్రెడిట్ రూపంలో ప్రోత్సాహం

ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని కొనుగోలుదారులను మరింత ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఆర్థిక పరిమితులు ఉన్న వర్ధమాన దేశాలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు (లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌) ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ కేబినెట్ నోట్ సిద్ధం చేసింది. ఇది అమల్లోకి వస్తే భారతీయ ఆయుధాల విక్రయాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

ప్రభుత్వ రంగం, యూరప్ భాగస్వామ్యాలు

గతంలో ప్రైవేట్ కంపెనీలకే పరిమితమైన ఎగుమతుల వృద్ధిలో ప్రస్తుతం హిందూస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్‌) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు, యూరప్ దేశాల్లో శ్రామిక శక్తి కొరత, వయోవృద్ధుల జనాభా పెరుగుతుండటంతో తక్కువ వ్యయంతో నాణ్యమైన తయారీ సామర్థ్యం ఉన్న భారత స్థానిక పరిశ్రమలతో భాగస్వామ్యానికి పాశ్చాత్య దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.

ఇదీ చదవండి: ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా?

Videos

డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?

రంగనాథ్‌పై TG హైకోర్టు కీలక ఆదేశాలు

సీనియర్స్ కే ఆ అర్హత దక్కాలి వాళ్ళ తర్వాతే నేను

విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఔట్ సోర్సింగ్ కార్మికుల కన్నెర్ర..

పెద్దిని పరామర్శించిన KCR

దేవినేని ఉమాను కలిస్తే తప్పేంటి..? నోరు తెరిస్తే తట్టుకోలేవు..

మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్

గుడ్ న్యూస్.. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు..

పవన్ కళ్యాణికి బిగ్ షాక్ జనసేనపై తిరగబడ్డ Gen-Z

భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర మరీ ఇంతనా? తాజా రేట్లు చూసి షాక్ అవుతారు!

Photos

+5

'మహేంద్రగిరి వారాహి' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గర్ల్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (ఫొటోలు)

+5

మీనాక్షి చౌదరి అమెరికా ట్రిప్.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)

+5

ఏపీ : విశాఖపట్నం దగ్గరలో అద్భుతమైన జలపాతం... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు మనవి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. (ఫొటోలు)

+5

డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి 'ఛేంజ్‌ మేకర్‌' పురస్కారం అందజేసిన చిరంజీవి (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తి : ధర్మరాజులస్వామి ఆలయంలో శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం (ఫొటోలు)

+5

'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌కు తెలంగాణ బోనాలు (ఫోటోలు)

+5

నేచర్ ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ నటి అనసూయ (ఫోటోలు)