Breaking News

స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్‌, ఉప్పుతో స్వాగతం..!

Published on Wed, 06/17/2026 - 13:50

జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా యూరప్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ సోమవారం(జూన్‌ 15, 2026) స్లోవేకియాలో దేశ రాజధాని బ్రటిస్లావాలో ఆ దేశ ప్రధాని రాబర్ట్‌ ఫీకోతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అదీగాక 1993లో ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి స్లోవేకియాను సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. విమానం దిగగానే మోదీకి స్లోవేకియా విదేశీ యూరోపియన్‌ వ్యవహారాల మంత్రి జురాజ్‌ బ్లానార్‌ సాంప్రదాయ స్లోవేకియా ఆహార పద్ధతిలో స్వాగతం పలికారు. అసలేంటి స్వాగతం? దాని అర్థం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

స్లోవేకియా స్లావిక్‌ సంస్కృతి ప్రకారం.. గౌరవనీయ అతిథికి తాజాగా కాల్చిన రొట్టెముక్క, ఒకచిన్న పళ్లెంలో ఉప్పుతో స్వాగతం పలుకుతారు. అక్కడ రొట్టే శ్రేయస్సుని, జీవనోపాధిని, భూమి ఆశీర్వాదాలను సూచిస్తుందట. ఇక ఉప్పు శాశ్వత స్నేహం, రక్షణకు చిహ్నంగా పేర్కొంటారు. 

ఈ స్వాగత కార్యక్రమంలో రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శన కూడా ఉంటుంది. దీంతోపాటు జావా ప్రాంతానికి చెందిన 'కోపానిసియారిక్' అనే బాలల జానపద బృందం జానపద నృత్యంతో మెదీకి ఘన స్వాగతం పలికారు. స్లోవేకియాలానే ఆహారంతో పలికే కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ఖర్జూరం, అరబిక్ కాఫీ
మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలలో, అతిథులకు సాంప్రదాయకంగా ఖర్జూరాలు, అరబిక్ కాఫీ (గహ్వా)తో స్వాగతం పలుకుతారు. చరిత్రకారుల ప్రకారం, ఖర్జూరాలు ఉదారతకు, సమృద్ధికి చిహ్నంగా ఉండగా, తేలికపాటి మసాలాలతో కూడిన కాఫీని ఆతిథ్యానికి, గౌరవానికి చిహ్నంగా పేర్కొంటారు.

పోయితో అలోహా స్వాగతం
చరిత్రకారుల ప్రకారం, సాంప్రదాయ హవాయి సంస్కృతిలో, సందర్శకులకు స్వాగతం పలకడంలో ఆహారం తరచుగా ఒక పాత్ర పోషిస్తుంది. అక్కడ తిథ్యంతో ముడిపడి ఉన్న ఒక ప్రసిద్ధ ఆహారం పోయి. ఇది టారో దుంపతో తయారు చేసే వంటకం. 

సామూహిక సమావేశాలలో పోయిని పంచుకోవడం స్నేహం, ఐక్యతకు ప్రతీకగా చెబుతుంటారు. అంతేకాకుండా సందర్శకులకు ఆహారం అందించడం అనేది ఒక కుటుంబం ఉదారతను, అతిథుల పట్ల వారి నిబద్ధతను ప్రదర్శిస్తుందని విశ్వసిస్తారు.

టీతో స్వాగతం..
నిపుణుల ప్రకారం, మంగోలియా  టిబెటన్ పీఠభూమిలో, అతిథులకు తరచుగా వెన్న టీ లేదా పాల టీతో స్వాగతం పలుకుతారు. అతిథి వచ్చిన వెంటనే ఒక గిన్నెడు టీని అందించడం, దానిని స్వీకరించడం గౌరవానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ ఆచారం శతాబ్దాల సంచార సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. అక్కడ మనుగడకు ఆతిథ్యం చాలా కీలకం అని ప్రజలు బలంగా విశ్వసిస్తారు.

కలాచ్ రొట్టెతో స్వాగతం
ఉక్రెయిన్, రష్యాలో, అతిథులకు సాంప్రదాయకంగా కలాచ్ అనే ఒక ఉత్సవ రొట్టెతో స్వాగతం పలుకుతారని, తరచుగా దానితో పాటు ఉప్పు కూడా ఉంటుందని చెబుతారు. ఈ సంప్రదాయం స్లోవేకియా రొట్టె-ఉప్పు ఆచారాన్ని పోలి ఉంటుంది; ఈ ఆచారం శ్రేయస్సు, స్నేహం, అలాగే సందర్శకుడు ఎప్పటికీ ఆకలితో ఉండకూడదనే భావనకు ప్రతీక. 

అలాగే వివాహాలు, రాష్ట్ర పర్యటనలు, సాంస్కృతిక వేడుకలు వంటి ముఖ్యమైన సందర్భాలలో, ఈ రొట్టెను ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రంపై ఉంచి, అతిథులకు ఒక ముక్కను విరిచి ఉప్పులో ముంచుకోమని ఆహ్వానిస్తారు. ఈ ఆచారం నేటికీ అనేక తూర్పు యూరోపియన్ సమాజాలలో ఆప్యాయత ,గౌరవానికి శక్తివంతమైన చిహ్నంగా నిలిచి ఉంండటం విశేషం. 

(చదవండి: 4,500 ఏళ్ల నాటి మొహంజోదారో నాట్యకారిణి..! ఇప్పటికీ అంత క్రేజ్‌ ఎందుకంటే..)

#

Tags : 1

Videos

5000 మంది చొరబాటుదారులకు చుక్కలు.. సరిహద్దుల్లో భారత ఆర్మీ విశ్వరూపం!

నైజర్‌లో ఉగ్రదాడి.. 13 మంది మృతి

వైఎస్ జగన్ రాకతో CI నాగరాజుపై కేసు నమోదు

సాయి కృష్ణ ఇంటికి ACP.. జగన్ దెబ్బకు దిగొచ్చిన పోలీసులు

తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

మహేశ్.. వారణాసి.. ఇలా అయిందేంటి?

సాయికృష్ణ కేసు వెనుక.. జనం తిరగబడితే తట్టుకోలేరు.. చివరికి జరిగేది ఇదే..

అనుమానపు మొగుడు.. చిత్రహింసలు పెట్టి చంపేశాడు

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై మర్డర్ కేసు..!

అరేయ్ ప్రభాకర్.. నీకు నిజంగా దమ్ముంటే ఇప్పుడు రా ఈడ్పుగంటి శ్రీనివాసబాబు వార్నింగ్

Photos

+5

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నటి నోరా ఫ‌తేహి సంద‌డి (ఫొటోలు)

+5

రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)

+5

మొనాకో వేకేషన్‌లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు

+5

డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)

+5

కడప గడపలో క్రికెట్ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)

+5

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

+5

హాలీడే ట్రిప్‌లో సినీ ప్రేమజంట (ఫొటోలు)

+5

హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

పూరీ జగన్నాథ్ కూతురి లేటెస్ట్ లుక్ (ఫొటోలు)