Breaking News

సబ్బు నుంచి బిస్కెట్‌ వరకు.. అన్నింటిపై ధరల మోత

Published on Wed, 05/13/2026 - 08:33

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల నేపథ్యంలో వినియోగదారులపై ధరల భారం పడుతోంది. ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థలు కొన్ని ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను కొంత మేర పెంచడంతోపాటు.. ప్యాక్‌ల బరువును (పరిమాణం/గ్రాములు) సైతం తగ్గించాయి. ఇప్పుడు మరో విడత, తమ ఉత్పత్తుల ధరలను పెంచడానికి అవి సిద్ధమవుతున్నాయి. దీంతో సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్, పానీయాల ధరలు మరింత పెరగనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధంతో ముడి చమురు, గ్యాస్‌ సరఫరాకు ఆటంకాలు ఏర్పడడం తెలిసిందే. దీంతో వీడి ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి ఫలితంగా రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్‌ వ్యయాలు పెరిగిపోయాయి. దీంతో కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడుతోంది. 

ముఖ్యంగా ప్లాస్టిక్, ఇతర ప్యాకేజింగ్‌ వస్తువుల ధరలు 20 నుంచి 40 శాతం వరకు పెరగడం కంపెనీలకు భారంగా మారింది. వీటి తయారీలోకి వినియోగించే ముడిసరుకులకు ముడిచమురు ఆధారం కావడం గమనార్హం. మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూపాయి విలువ క్షీణతతో ముడి సరుకుల వ్యయాలు పెరిగాయి. దీంతో కంపెనీలు లాభాల మార్జిన్లపై ఒత్తిడి పెరిగింది. తమ లాభాల మార్జిన్లను కాపాడుకోవడానికి అవి రేట్ల పెంపుతోపాటు, ప్యాక్‌ సైజులను తగ్గించేస్తున్నాయి. మొత్తానికి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంటి బడ్జెట్‌ మరింత భారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

  • ధరల పెంపు.. 
    ఇప్పటికే డాబర్, హెచ్‌యూఎల్, బ్రిటానియా తదితర సంస్థలు 3 నుంచి 5 శాతం వరకు ధరలను పెంచేశాయి. మరింత పెంచే అవకాశం కూడా ఉందని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తమ ఫలితాల వెల్లడి అనంతరం అనలిస్ట్‌ల కాల్‌లో పేర్కొన్నాయి. అలాగే, ప్రాచుర్యం పొందిన చిన్న ప్యాకెట్ల (రూ.5, 10, 15 రూపాయల ప్యాకెట్లు) ధరను మార్చకుండా, వాటి పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి. తద్వారా తమ విక్రయాలు ప్రభావితం కాకుండా, మార్జిన్లను కాపాడుకునేందుకు ఎఫ్‌ఎంసీజీ సంస్థలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. 

  •  డాబర్‌ ఇండియా ఇప్పటికే ఉత్పత్తుల ధరలను 4 శాతం వరకు పెంచింది. తమపై 10 శాతం మేర ద్రవ్యోల్బణం (ముడి సరుకుల వ్యయాల పెరుగుదల) ప్రభావం ఉన్నట్టు సంస్థ సీఈవో మోహిత్‌ మల్హోత్రా తెలిపారు. వ్యయ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని, అమ్మకాల్లో డబుల్‌ డిజిట్‌ వృద్ధి (ధరల పెంపు, అమ్మకాల పెంపు రూపంలో) నమోదు చేస్తామని చెప్పారు.  

  • ప్యాకేజింగ్, ఇంధన ఖర్చులు 20 శాతం వరకు పెరిగినందున ధరల పెంపుతోపాటు, పరిమాణం తగ్గింపు తప్పనిసరని అని బ్రిటానియా పేర్కొంది. ప్యాకేజింగ్‌లోకి వాడే లామినేట్స్‌ ధరల మంట సంస్థపై పడుతోంది. దీనికితోడు ఎల్‌పీజీ, పీఎన్‌జీపై ఆధారపడి ఉండడంతో మార్జిన్లపై ఒత్తిడిని ఎదుర్కొంటోంది.  

  • తమ ముడి పదార్థాల ధరలు 40–50% పెరిగాయని, ఈ భారాన్ని క్రమంగా వినియోగదారులపై వేయక తప్పదని పిడిలైట్‌ స్పష్టం చేసింది. ప్రముఖ బ్రాండ్‌ ఫెవికాల్‌ ధరలను 12–15% మేర పెంచింది. ఈ సంస్థ ఉత్పత్తులకు ముడిచమురు డెరివేటివ్స్‌ కీలకం కాగా, వాటి ధరలు సగటున 40–50% వరకు పెరిగాయి.  

  • వరుణ్‌ బెవరేజెస్‌ వినియోగదారులకు ఇచ్చే రాయితీలను తగ్గిస్తూ వ్యయాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. 

  • తమకు కొబ్బరి ధరలు దిగిరావడం కలిసొచి్చందని.. ఇతర ముడి సరుకుల ధరల ఒత్తిళ్లను ఉత్పత్తుల ధరలను క్రమంగా పెంచడం, వ్యయ నియంత్రణ చర్యలతో అధిగమిస్తామని మారికో ఎండీ, సీఈవో సౌగత గుప్తా ప్రకటించారు.  

  • ప్యాకేజింగ్, ఎల్‌పీజీ ధరలు పెరిగిపోవడంతో మార్జిన్లపై ఒత్తిళ్లు ఉన్నట్టు టాటా కన్జ్యూమర్‌ ఎండీ, సీఈవో సునీల్‌ డిసౌజ తెలిపారు. వైవిధ్యమైన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నందున ఈ ఒత్తిళ్లను ప్రస్తుతానికి అధిగమించగలమని చెప్పారు.    

Videos

అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

పూర్తి ఆధారాలతో వస్తా.. సిట్ కు బండి భగీరథ్ లేఖ

మందులు, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు విముక్తి

కేసులు పెట్టే ముందు ఆలోచించు! నూరి ఫాతిమా సీరియస్

వామ్మో బంగారం కొనలేం.. 2 లక్షలకు పెరిగే చాన్స్

అమెరికా విద్యార్థులకు బిగ్ షాక్.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై నిఘా

కృష్ణాజిల్లాలో దారుణం.. వైన్ షాప్ నిర్వాహకుడిపై టీడీపీ నేత దాడి

బండి భగీరథ్ ఎక్కడ? పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్

పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్..

కూల్ డ్రింక్ VS ఫ్రూట్ జ్యూస్...ఏది విషం? ఏది అమృతం?

Photos

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్ (ఫొటోలు)

+5

మధ్యాహ్నం 2 గంటల లోపు పీఎస్ కు రావాలని భగీరథ కు నోటీసులు

+5

గంగరంగ వైభవం గంగమ్మ జాతర...పోటెత్తిన జనం (ఫొటోలు)

+5

హనుమాన్ జయంతి... భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర...'బైరాగి వేషంలో మొక్క చెల్లించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

నారా రోహిత్‌ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)