Breaking News

స్మార్ట్‌ఫోన్‌ల్లో ‘ఆధార్’ ప్రీ-ఇన్‌స్టాలేషన్‌పై అప్‌డేట్‌

Published on Sat, 04/18/2026 - 12:15

స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ప్రయోజనాలు, టెక్ కంపెనీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో విక్రయించే యాపిల్, శామ్‌సంగ్‌ వంటి ప్రముఖ కంపెనీల ఫోన్లలో ఆధార్ యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్ (ప్రీ-ఇన్‌స్టాలేషన్‌) చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టింది. గత కొద్ది కాలంగా ఈ అంశంపై పరిశ్రమ వర్గాల్లో జరుగుతున్న చర్చకు ఈ నిర్ణయంతో తెరపడినట్లయింది.

పరిశ్రమ వర్గాల వ్యతిరేకతే కారణమా?

రాయిటర్స్ నివేదిక ప్రకారం, స్మార్ట్‌ఫోన్‌ల్లో ఆధార్ యాప్‌ను తప్పనిసరిగా చేర్చాలన్న ప్రతిపాదనపై యాపిల్, శామ్‌సంగ్‌ వంటి గ్లోబల్ టెక్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ(మైటీ) పరిశ్రమకు చెందిన వివిధ వాటాదారులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. ఈ చర్చల అనంతరం స్మార్ట్‌ఫోన్లలో ఆధార్ యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయడం సరైన నిర్ణయం కాదని కేంద్రం భావించినట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ధ్రువీకరించింది.

ఏమిటీ ‘ప్రీ-ఇన్‌స్టాలేషన్’ వివాదం?

సాధారణంగా ఫోన్ కొన్నప్పుడు అందులో ఉండే క్యాలెండర్, కాలిక్యులేటర్ లేదా గడియారం వంటి యాప్‌ల మాదిరిగానే ఆధార్ యాప్‌ను కూడా ఫోన్ తయారీ దశలోనే ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. 134 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) ఆధారిత సేవలను సులభతరం చేయడం దీని లక్ష్యం. ఈ ప్రక్రియ ద్వారా బ్యాంకింగ్, టెలికాం, ఇతర ప్రభుత్వ సేవలకు డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావించారు. అయితే, వినియోగదారుల గోప్యత, ఫోన్ సాఫ్ట్‌వేర్ పనితీరుపై ఇది ప్రభావం చూపుతుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి.

సంచార్ సాథీ అనుభవంతో వెనక్కి..

గతంలో సంచార్ సాథీ (మోసాలను నివేదించే యాప్)ను 90 రోజుల్లోగా అన్ని మొబైళ్లలో ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పుడు కూడా మొబైల్ కంపెనీల నుంచి ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. భద్రతా పరమైన అంశాలు, వినియోగదారుల ఎంపికకు ప్రాధాన్యత ఇవ్వాలన్న వాదన బలంగా వినిపించడంతో ప్రభుత్వం ఇప్పుడు ఆధార్ విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యం మంచిదే అయినప్పటికీ స్మార్ట్‌ఫోన్ తయారీదారుల గ్లోబల్ పాలసీలు, వినియోగదారుల డేటా సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆహ్వానించదగినది.

ఇదీ చదవండి: గోల్డ్‌ ధర.. గుండె దడ!

Videos

వంగవీటి అడుగు జాడల్లో దీక్ష.. అంబటి అన్నకు మేమున్నాం

డయాబెటిస్ ఉన్నా హాయిగా అన్నం తినొచ్చు! అన్నం ఇలా వండండి

లోక్ సభలో రచ్చ రచ్చ.. డీలిమిటేషన్ తో సౌత్ కి నిజంగా నష్టమేనా

ముంబై పతనం: రోహిత్ నుంచి బుమ్రా వరకు.పాండ్య బలుపే కారణమా..?

సింగర్ మంగ్లీ కేసులో రిమాండ్ కు మధు

హార్దిక్ ఇక చాలు..! కెప్టెన్సీ అతడికి అప్పగించేయ్

ఇటలీ ప్రధానికి ముద్దు పెట్టిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

భార్య ఓవర్ యాక్షన్ తో భర్తకు కష్టాలు.. ఎలా ఉండేవాడు.. ఎలా అయిపోయాడు..

ITR ఫైల్ చేయట్లేదా ? చేయండి లేకపోతే..!

లోకేష్ వేస్ట్.. క్లాస్ రూమ్ లో మందు.. మద్యానికి బానిసగా గురుకుల విద్యార్థులు

Photos

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)

+5

'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. ధనా ధన్‌ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో సరదాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర (ఫోటోలు)

+5

ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనితా బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)