Breaking News

సహజ వాయువు కోటా 95 శాతానికి పెంపు

Published on Thu, 04/09/2026 - 09:04

దేశీయ వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలిచే ఎరువుల పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇంధన భద్రతను సమీక్షించిన కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఎరువుల తయారీ యూనిట్లకు సరఫరా చేసే సహజ వాయువు కోటాను 95 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన కేటాయింపులు గురువారం (ఏప్రిల్ 9, 2026) నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ ఇటీవల జరిగిన ఇతర మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. గడిచిన ఆరు నెలల సగటు వినియోగం ఆధారంగా ఈ కేటాయింపులు జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.

పెరిగిన కేటాయింపులు

గత వారం (ఏప్రిల్ 6) ఎరువుల రంగానికి గ్యాస్ సరఫరాను 90 శాతానికి పెంచిన ప్రభుత్వం, తాజాగా అందుబాటులో ఉన్న నిల్వలు, షెడ్యూల్ ప్రకారం వస్తున్న ఎల్‌ఎన్‌జీ కార్గోలను దృష్టిలో ఉంచుకుని మరో 5 శాతం పెంచి మొత్తం కోటాను 95 శాతానికి చేర్చింది. దేశ సగటు గ్యాస్ వినియోగం రోజుకు సుమారు 196 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు(ఎంఎస్‌సీఎం). ఎరువుల రంగ అవసరం రోజుకు సుమారు 52 ఎంఎస్‌సీఎండీగా ఉంది. ఒక ఎంఎస్‌సీఎం గ్యాస్‌తో సుమారు 1,600 టన్నుల యూరియాను ఉత్పత్తి చేయవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఎరువుల రంగం 9,753 ఎంఎస్‌సీఎంల గ్యాస్‌ను వినియోగించింది. ఇది దేశ మొత్తం వినియోగంలో 28 శాతానికి సమానం.

ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

Videos

ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం

నీ తల్లిని తిట్టినా.. నీకు సిగ్గులేకపోవొచ్చు.... బాబు ఇంట్లో ఆడవాళ్లే నీకు... పేర్ని కిట్టు సంచలన కామెంట్స్

సంతకం ఫోర్జరీ, CMRFలో 8 లక్షలు కొట్టేసిన TDP నేత

వామ్మో ఏందయ్యా ఇది... Swiggy, Zomatoలో ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తింటున్నారా?

మిల్లర్ పై అనుమానాలు..! IPL లో ఫిక్సింగ్ కలకలం..?

కేసీఆర్ పాలనే బెస్ట్...సీఎం రేవంత్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

కాకాణిపై మరో అక్రమ కేసు

నయిమ్ ఖాసిమ్ ను చంపేశాం ఇజ్రాయెల్ కీలక ప్రకటన

నీది ఒక బతుకేనా... ABN రాధాకృష్ణకు కాకాణి మాస్ వార్నింగ్

Photos

+5

Allu Arjun Birthday Celebrations : సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)

+5

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ‘కామాఖ్య యోని పీఠం’ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడలో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్‌షిప్” (ఫొటోలు)

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)

+5

అందమైన అల్లుడిని తెచ్చా..: రష్మిక మందన్నా (ఫోటోలు)