Breaking News

ట్యాబ్లెట్‌ పీసీల్లో శాంసంగ్‌ టాప్‌..

Published on Sun, 03/29/2026 - 07:37

ముంబై: భారత ట్యాబ్లెట్‌ పీసీ మార్కెట్‌ 2025లో వార్షిక ప్రాతిపదికన 2% వృద్ధి సాధించింది. ముఖ్యంగా శాంసంగ్‌ 31% మార్కెట్‌ వాటాతో తొలి స్థానంలో నిలవగా.. యాపిల్‌ 20% వాటాతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. లెనోవో (15%) మూడో స్థానంలో నిలిచిందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.

‘‘ప్రముఖ బ్రాండ్లు చేపట్టిన వ్యూహాత్మక ఉత్పత్తి నవీకరణల కారణంగా భారత ట్యాబ్లెట్‌ మార్కెట్‌లో ప్రీమియం వైపు స్పష్టమైన మార్పు కనిపించింది. రూ.30,000–రూ.40,000 ధర విభాగం అత్యంత వేగంగా పెరుగుతున్న సెగ్మెంట్‌గా మారింది. ఈ విభాగంలో షిప్‌మెంట్‌లు దాదాపు 7 రెట్లు పెరిగాయి. ఇది అత్యాధునిక పనితీరు గల డివైస్‌లపై కస్టమర్లకు పెరుగుతున్న ఆసక్తి సూచిస్తుంది.’’ అని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ప్రధాన అనలిస్ట్‌ అన్షికా జైన్‌ తెలిపారు.  

కొనసాగిన శాంసంగ్‌ హవా: భారత్‌ ట్యాబ్లెట్‌ పీసీ మార్కెట్‌లో గతేడాది కూడా శాంసంగ్‌ అగ్రస్థానంలోనే కొనసాగింది. ట్యాబ్లెట్ల సరఫరాలు వార్షిక ప్రాతిపదికన 15% వృద్ధితో మార్కెట్‌ వాటా 2024లో 27% నుంచి 2025లో 31 శాతానికి పెరిగింది. గెలాక్సీ ట్యాబ్‌ ఏ9 సిరీస్‌కు మంచి డిమాండ్‌ నెలకొనడం, తరువాత ఏ11 సిరీస్‌ ప్రవేశంతో వృద్ధి కొనసాగింది. రూ.15,000–రూ.30,000 విభాగంలో శాంసంగ్‌ తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. అలాగే గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌ సిరీస్‌ ద్వారా ప్రీమియం విభాగంలో కూడా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.  

యాపిల్‌ వాటా స్వల్ప తగ్గుదల: మార్కెట్‌ వాటా స్వల్పంగా రెండు శాతం క్షీణించినప్పటికీ యాపిల్‌ మొత్తం మీద 20 శాతం వాటాతో శాంసంగ్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. రూ.30,000– రూ.40,000 ధర విభాగంలో ఐప్యాడ్‌ (2025) 128జీబీ మోడల్‌కు మంచి డిమాండ్‌ ఉండటం గమనార్హం. ఐప్యాడ్‌ ప్రో సిరీస్‌లో ఓఎల్‌ఈడీ టెక్నాలజీ వినియోగం పెరగడంతో ప్రీమియం సెగ్మెంట్‌లో కంపెనీ స్థానం బలపడింది.   లెనోవో 24% సప్లై వృద్ధితో 15 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకోగా, షియోమీ 74% షిప్‌మెంట్‌ పెరు గుదలతో 11% మార్కెట్‌ వాటాను సాధించింది. మరోవైపు, ఏసర్‌ సప్లైలు 50% క్షీణించడంతో మార్కెట్‌ వాటా 2024లోని 21% నుంచి 2025లో 10 శాతానికి దిగివచి్చంది.  

ఎగుమతులు–తయారీ రంగాల్లో పురోగతి: 2025లో ట్యాబ్లెట్‌ ఎగుమతులు ఒక మిలియన్‌ యూనిట్లను దాటాయి. శాంసంగ్, లెనోవో ఆధ్వర్యంలో అమెరికా, యూరప్‌ మార్కెట్లకు సరఫరాలు పెరిగాయి. దేశీయ ఉత్పత్తి మొత్తం షిప్‌మెంట్‌లో 50 శాతానికి చేరడం లోకలైజేషన్‌ వేగాన్ని సూచిస్తోంది. దీంతో భారత్‌ గ్లోబల్‌ ట్యాబ్లెట్‌ తయారీ కేంద్రంగా ఎదుగుతోంది.

2026లో వృద్ధి అంచనాలు: బలమైన డిమాండ్‌ ఆధారంగా 2026లో మార్కెట్‌ మరింత వృద్ధి చెందనుందని అంచనా. మెమరీ ధరలు ఖర్చులు, లాభాలపై ప్రభావం చూపినా..., అధిక కాని్ఫగరేషన్‌లు, ప్రొడక్టివిటీ డివైజ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ వృద్ధికి దోహదం చేస్తాయి. లోకలైజేషన్, సరఫరా డైవర్సిఫికేషన్‌తో ఎగుమతులు కీలకంగా మారనున్నాయి. ఏఐ ఆధారిత టాబ్లెట్లు, డివైస్‌లోనే పనిచేసే ఏఐ ఫీచర్లు కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరుస్తూ, మార్కెట్‌ విస్తరణకు తదుపరి దశకు పునాది వేస్తాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అభిప్రాయపడింది.

#

Tags : 1

Videos

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!

బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!

వైరల్ అవుతోన్న రామ్ చరణ్ హోమం

తడబడుతున్న చంద్రబాబు.. థిస్ ఇస్ వెరీ బ్యాడ్

భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?

సుబ్బారెడ్డి VS అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో కేబుల్ వార్

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)