పాస్‌పోర్ట్‌ కొత్త రూల్స్‌.. ఇంక పది రోజుల్లో అమల్లోకి!

Published on Wed, 02/04/2026 - 20:56

భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త పాస్‌పోర్ట్ నిబంధనలను ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియను మరింత సరళంగా మార్చడం, భద్రతను బలోపేతం చేయడం, అలాగే దేశవ్యాప్తంగా సేవలను వేగవంతం చేయడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యం. ఫిబ్రవరి 15 తర్వాత ఈ నిబంధనలు పూర్తిగా అమల్లోకి రానున్నాయి.

దీంతో పాస్‌పోర్ట్ పొందడం లేదా పునరుద్ధరించుకోవడం మరింత సమర్థవంతంగా మారనుంది. చివరి నిమిషంలో దరఖాస్తు తిరస్కరణలు లేదా ఆలస్యాలు ఎదురుకాకుండా ఉండేందుకు, దరఖాస్తుదారులు ముందుగానే కొత్త నియమాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సరళీకృత పత్రాలు, వేగవంతమైన ధ్రువీకరణ
కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. పాస్‌పోర్ట్ దరఖాస్తుకు అవసరమైన పత్రాల జాబితాను క్రమబద్ధీకరించారు. పేపర్‌వర్క్‌ను తగ్గించేందుకు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేశారు. ఆధార్ వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, తక్కువ సర్టిఫికెట్లతోనే దరఖాస్తు పూర్తి చేసే అవకాశం కలుగుతుంది. దీంతో పాస్‌పోర్ట్ కార్యాలయాలకు తరచుగా వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.

అయితే అసంపూర్ణం లేదా తప్పుగా అప్‌లోడ్ చేసిన పత్రాలతో చేసే దరఖాస్తులు మాత్రం పూర్తిగా తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆన్‌లైన్‌లో పత్రాలు అప్‌లోడ్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరం.

పోలీస్ వెరిఫికేషన్‌లో కీలక మార్పులు
పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో ఎక్కువ సమయం తీసుకునే పోలీస్ ధ్రువీకరణను కూడా సవరించారు. ఇకపై ఇది ప్రధానంగా డిజిటల్ మార్గాల్లోనే జరగనుంది. సమన్వయ వ్యవస్థల ద్వారా అనేక సందర్భాల్లో వారాల పాటు పట్టే ధ్రువీకరణను కొన్ని రోజుల్లోనే పూర్తిచేయవచ్చు. కొన్ని సందర్భాల్లో పాస్‌పోర్ట్ ముందుగా జారీ చేసి, తరువాత వెరిఫికేషన్ చేసే విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. దీంతో మొత్తం ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.

మరింత సులభమైన ఆన్‌లైన్ సేవలు
ప్రభుత్వ పాస్‌పోర్ట్ పోర్టల్‌ను యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేశారు. దరఖాస్తుదారులు మధ్యవర్తులు లేకుండానే ఫారమ్‌లు పూరించడం, పత్రాలు అప్లోడ్ చేయడం, అపాయింట్‌మెంట్ స్లాట్‌లను బుక్ చేయడం చేయవచ్చు. రియల్ టైమ్ నోటిఫికేషన్లతో దరఖాస్తు స్థితిని సులభంగా ట్రాక్ చేసే అవకాశం కలుగుతుంది.

మైనర్లకు సంబంధించి తల్లిదండ్రుల సమ్మతి, డిజిటల్ జనన ధ్రువీకరణ పత్రాలు లేదా పాఠశాల ఐడీలను సులభంగా అంగీకరించేలా నిబంధనల్లో స్పష్టత తీసుకొచ్చారు. దీని వల్ల పిల్లల పాస్‌పోర్ట్ జారీకి పట్టే సమయం గణనీయంగా తగ్గనుంది.

గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువగా సేవలు
దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీని ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా పాస్‌పోర్ట్ సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి.

Videos

KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

బ్రేకప్ గురించి నోరు విప్పిన మృణాల్ ఠాకూర్..!

నీయవ్వ తగ్గేదేలే..! పుష్ప & ధురంధర్ డైరెక్టర్ మూవీ..!

శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన అమ్మాయి.. అర్ధరాత్రి గజగజ వణికిన డెలివరీ బాయ్

ఒక మాజీ మంత్రిని పోలీసులతో కొట్టిస్తారా? సినిమా మాములుగా ఉండదు

పోలీసుల సమక్షంలోనే అంబటి హత్యకు కుట్ర

కాపు కులంలో అంబటి అన్న ఒక టైగర్ పోలీసులకు మాస్ వార్నింగ్

మేం కూడా మీలాగే ప్లెక్సీలు పెడితే ఒప్పుకొంటావా చంద్రబాబు?

గూండాలను వేసుకొచ్చి దాడి చేయిస్తావా? గల్లా మాధవిపై జగన్ ఫైర్

అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి?

Photos

+5

నేను తప్పు చేసినా సహించావ్‌.. సంఘవి ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

+5

శరత్ కుమార్-రాధిక పెళ్లిరోజు.. కూతురి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)

+5

అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)

+5

ఫుడ్ అంటే ఎంత ఇష్టమో.. ఆషికా క్రేవింగ్స్ (ఫొటోలు)

+5

పశ్చిమ గోదావరిలో ఎంతో ఫేమస్ ఈ ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్.. సగం బాలీవుడ్ ఇక్కడే ఉందిగా (ఫొటోలు)

+5

జ్యోతిర్లింగాల యాత్ర మొదలుపెట్టిన హీరోయిన్ (ఫొటోలు)