Breaking News

పోరాటానికి సిద్ధం చేసే సైకో ఆంకాలజీ

Published on Tue, 02/03/2026 - 05:38

‘నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ ప్రివెన్షన్  అండ్‌ రీసెర్చ్‌’2024 అధ్యయనం ప్రకారం మన దేశంలో 25 లక్షల మంది క్యాన్సర్‌తో  పోరాడుతున్నారు. గత ముపై ్ప ఏళ్లలో క్యాన్సర్‌ బాధితుల సంఖ్య 24 శాతం పెరగడమే ఇంత భారీ సంఖ్యకు కారణం. అయితే క్యాన్సర్‌ నయం చేయడంలో వైద్యంతో పాటు మనసును దృఢం చేయడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు సైకో అంకాలజిస్ట్‌లు. క్యాన్సర్‌  పోరాటంలో బాధితునికి సైకో ఆంకాలజిస్ట్‌లు అందించే సహాయం ఏమిటి?

‘ఇటీవల మా అధ్యయనం ఏం చెబుతున్నదంటే క్యాన్సర్‌ ట్యూమర్‌తో పాటు మనసుకు కూడా వైద్యం చేయడం వల్ల క్లినికల్‌గా మంచి ఫలితాలు వస్తాయని. ఆంకాలజీ విభాగంలో సైకాలజీ ఇక ఎంత మాత్రం ఆప్షనల్‌ కాదు.  తప్పనిసరి అవసరం’ అన్నారు న్యూఢిల్లీలోని ఎంఓసి క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ వైద్యుడు డాక్టర్‌ నిఖిల్‌ హింతాని. ‘అందుకే దేశంలోని క్యాన్సర్‌ సెంటర్లలో సైకో ఆంకాలజిస్ట్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది’ అన్నారాయన.

క్యాన్సర్‌ బారిన పడటం ఎవరినైనా కుంగదీసే విషయమే. క్యాన్సర్‌ నిర్థారణ అయ్యాక ప్రతి పేషంట్‌కు తనవైన భావోద్వేగ సవాళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కొనడంతో పాటు వ్యాధిని ఎదుర్కొనాలి... ఈ రెంటి సమన్వయానికి కౌన్సిలింగ్‌ తప్పనిసరి అంటున్నారు క్యాన్సర్‌ నిపుణులు. అందుకే ఇప్పుడు క్యాన్సర్‌ మీద  పోరాటంలో సైకో 
ఆంకాలజిస్ట్‌ల ప్రాధాన్యం పెరిగింది.

→ ఎవరీ సైకో ఆంకాలజిస్టులు?
క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స అందించే నిపుణులను ‘ఆంకాలజిస్టు’ అంటారని తెలిసిందే. ఆ విభాగంలోనిదే ఈ ‘సైకో–ఆంకాలజీ’. సైకాలజీలో మాస్టర్స్‌ లేదా పిహెచ్‌డి చేసి, సైకో ఆంకాలజీని ప్రత్యేకంగా అధ్యయనం చేసిన వారు ‘సైకో ఆంకాలజిస్ట్‌లు’గా విధులకు సిద్ధమవుతారు. ఆంకాలజిస్ట్‌లతోటి, పేషంట్స్‌తోటి సమన్వయం చేసుకుంటూ పేషంట్‌ మనసుకు స్వాంతన ఇస్తూ వారిలో ధైర్యం నూరి పోయడం, క్యాన్సర్‌ను గెలవగలననే భరోసాను ఇవ్వడం వీరి ప్రధాన పని.

→ క్యాన్సర్‌ నయమైన వారికీ అండగా..
క్యాన్సర్‌ నయమైన తర్వాత కూడా క్యాన్సర్‌ విజేతలకు అనేక ఆందోళనలు ఉంటాయి. చికిత్స వల్ల వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వాటిని తట్టుకోలేక కొందరు కుంగి పోతుంటారు. అటువంటి వారికీ ‘సైకో–ఆంకాలజీ’ అండగా ఉంటుంది. తిరిగి మేలైన జీవితాన్ని ఎలా ప్రారంభించాలో, ఎలా సహజంగా జీవించాలో నేర్పుతుంది. మానసిక ప్రశాంతత, ఆరోగ్య సూత్రాలు, ఒత్తిడి లేని జీవనాన్ని పాటించేలా సూచనలు చేస్తారు సైకో–ఆంకాలజిస్టులు. క్యాన్సర్‌ నయం కాగానే అంతా మామూలై పోయిందని చాలామంది భావిస్తుంటారు. అక్కడి నుంచే అసలైన సవాళ్లు మొదలవుతాయని నిపుణులు అంటున్నారు. ఆ మార్పులకు అనుగుణంగా వారిని సంసిద్ధం చేయడం అత్యవసరమని, దానికి ‘సైకో– ఆంకాలజీ’ తోడ్పడు
తుందని అంటున్నారు.

→ దశాబ్ద కాలంగా ‘సైకో–ఆంకాలజీ’పై పెరుగుతున్న అవగాహన 
మనదేశంలో ఎక్కువగా రొమ్ము, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బాధితులు ఉన్నారు. ఇందులో పురుషులు, స్త్రీలు బాధితులుగా ఉంటారు. వీరిలో ఒక్కొక్కరి ఒక్కో నేపథ్యం. పేద, మధ్యతరగతి ప్రజలు క్యాన్సర్‌ బారిన పడితే ఇక ఆ కుటుంబంలో నెలకొనే ఆందోళన గురించి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో క్యాన్సర్‌కు గురైన వారు ధైర్యంగా ఉంటే మిగిలినవారూ ధైర్యాన్ని కూడగట్టుకుంటారు. అందుకు ‘సైకో–ఆంకాలజీ’ కీలక భూమిక  పోషిస్తుంది. గత పదేళ్లుగా దీనిపై అవగాహన పెరుగుతోంది. ‘క్యాన్సర్‌ని ఎదుర్కొవడం మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలునూ ఎదుర్కునేలా వారిని సిద్ధం చేయడమే మా బాధ్యత’ అంటున్నారు ‘సైకో– ఆంకాలజిస్టులు’.

మానసిక ధైర్యమే కొండంత అండ
సైకో ఆంకాలజీలో పేషంట్‌కు అవసరాన్ని బట్టి ‘కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ’, ‘స్ట్రెస్‌ రిడక్షన్‌ టెక్నిక్స్‌’, ‘యాక్సెప్టెన్స్‌ అండ్‌ కమిట్‌మెంట్‌ థెరపీ’, ‘స పోర్టివ్‌ ఎక్స్‌ప్రెసివ్‌ థెరపీ’, ‘సైకో థెరపీ’, ‘ఫ్యామిలీ అండ్‌ కపుల్స్‌ థెరపీ’, ‘ట్రామా ఇన్‌ఫార్మ్‌డ్‌ థెరపీ’... వంటి అనేక థెరపీలు సైకో ఆంకాలజిస్ట్‌లు అందిస్తారు. ఎన్ని మందులు ఉన్నా వైద్యులు ఇచ్చే భరోసా  వారిలో కొండంత బలాన్ని నింపుతుంది. క్యాన్సర్‌ మీద ఉన్న అనేక అ పోహల కారణంగా ఈ వ్యాధికి గురైన వారు తీవ్ర మానసిక వేదనతో పాటు చుట్టూ ఉన్న వారి జాలిచూపులు, చికిత్స సమయంలో నొప్పి, తమకేమవుతుందోనన్న ఆందోళన, డబ్బు కోసం కుటుంబ సభ్యులు పడే ఆరాటం.. వీటన్నింటితో సతమతం అవుతుంటారు.  సైకో–ఆంకాలజిస్టులు వారితో మాట్లాడి బతుకు మీద ఆశ కలిగించేందుకు ప్రయత్నిస్తారు.

Videos

పోలీసులు లేకుండా రండి ఎవడి బలం ఏంటో తెలుస్తుంది

జైల్లో అంబటిని కలిసిన ముద్రగడ

అంబటి అల్లుడు,కూతురుని పరామర్శించిన అనిల్ కుమార్ యాదవ్

ఎవర్ని వదిలిపెట్టం.. బైరెడ్డి వార్నింగ్

KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ కు పాతర

మీకు దమ్ముంటే.. బాధితురాలి సంచలన సెల్ఫీ వీడియో..

Brahmaji : నావల్లే పూరి సినిమా ప్లాప్ అయ్యింది

Thanuja : ప్లీజ్ అలా అనడం మానేయండి.. నరకం అనుభవిస్తున్నా..

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్ పోర్టులు

దేశం నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్ కు సుప్రీంకోర్టు వార్నింగ్

Photos

+5

హీరోయిన్ జెనీలియా పెళ్లి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు (ఫొటోలు)

+5

'హనీ' ఈవెంట్‌లో అందంగా దివి (ఫొటోలు)

+5

'కపుల్ ఫ్రెండ్లీ' ట్రైలర్‌ ఈవెంట్‌ లో మెరిసిన హీరోయిన్‌ మానస వారణాసి (ఫొటోలు)

+5

నిర్మల్‌ : ఘనంగా ముజ్గి మల్లన్న జాతర (ఫొటోలు)

+5

’వెరైటీ ఇండియా పార్టీ‘లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ధనుష్‌ 55వ సినిమా.. శ్రీలీల, సాయి పల్లవి క్రేజీ ఫోటోలు

+5

ఈషా రెబ్బా 'ఓం శాంతి' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)