Breaking News

ఇన్ఫోసిస్‌కూ తప్పలేదు 

Published on Thu, 01/15/2026 - 00:48

ముంబై: సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం వార్షికంగా 2 శాతం క్షీణించి రూ. 6,654 కోట్లకు పరిమితమైంది. కొత్త కార్మిక చట్టాల అమలు నేపథ్యంలో రూ. 1,289 కోట్లమేర వన్‌టైమ్‌ కేటాయింపులు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 6,806 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 9 శాతం ఎగసి రూ. 45,479 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 41,764 కోట్ల టర్నోవ ర్‌ సాధించింది.  కాగా.. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్‌)తో పోలిస్తే నికర లాభం 9.6 శాతం క్షీణించగా.. ఆదాయం 2.2 శాతం పుంజుకుంది.  

ఏఐలో ముందంజ 
ఎంటర్‌ప్రైజ్‌ ఏఐలో ప్రత్యేకత కలిగిన విలువ ఆధారిత సరీ్వసులను టోపజ్‌ ప్లాట్‌ఫామ్‌  ద్వారా అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సలీల్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. తద్వారా మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్నట్లు తెలియజేశారు. కంపెనీకున్న నైపుణ్యం, కొత్త ఆవిష్కరణలు, పటిష్ట డెలివరీ సామర్థ్యాలు క్లయింట్లను ఆకట్టుకుంటున్నట్లు వివరించారు. దీంతో ఇన్ఫోసిస్‌ను తమ భాగస్వామిగా ఎంచుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 18,000 కోట్లు వెచ్చించి షేర్ల బైబ్యాక్‌తో పాటు వాటాదారులకు మధ్యంతర డివిడెండ్‌ను సైతం చెల్లించింది. గతంలో ప్రకటించిన విధంగా ఈ ఏడాది 20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనున్నట్లు సీఎఫ్‌వో జయేష్‌ ఎస్‌. పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే 18,000 మందికి ఉద్యోగాలిచ్చినట్లు తెలిపారు. 
 

ఇతర విశేషాలు 
→ తాజా సమీక్షా కాలంలో ఇన్ఫోసిస్‌ 4.8 బిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకుంది. వీటిలో 57 శాతం కొత్తగా సాధించిన ఆర్డర్లు కావడం గమనార్హం! 
→ యూకే నేషనల్‌ హెల్త్‌ సరీ్వస్‌తో 1.6 బిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్ట్‌ అందుకుంది. 
→ మార్చితో ముగిసే పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను 3–3.5 శాతానికి మెరుగుపరచింది. ఇంతక్రితం 2–3 శాతం ఆదాయ వృద్ధిని ప్రకటించిన సంగతి తెలిసిందే.   
→ 2025 డిసెంబర్‌ 31కల్లా 5,043 మంది ఉద్యోగులు జత కలిశారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,37,034కు చేరింది. 
→ కంపెనీ సీఈవో పరేఖ్‌కు రూ. 3 కోట్ల విలువైన స్టాక్‌ ప్రోత్సాహకాల(ఆర్‌ఎస్‌యూలు) కేటాయిం చేందుకు బోర్డు అనుమతించినట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. 
→ కొత్త కారి్మక చట్టాల ప్రభావంతో ఇప్పటికే ఐటీ దిగ్గజాలు టీసీఎస్‌ రూ. 2,128 కోట్లు, హెచ్‌సీ ఎల్‌ టెక్నాలజీస్‌ రూ. 719 కోట్లు చొప్పున  క్యూ3 లో కేటాయింపులు చేపట్టిన  విషయం విదితమే.  

ఇన్ఫోసిస్‌ షేరు బీఎస్‌ఈలో నామమాత్ర లాభంతో రూ. 1,599 వద్ద ముగిసింది.

Infosys (755691)third quarter (774541)consolidated (755785)net profit (75578

Videos

ఆ దేశాలపై ట్రంప్ .. ఉక్కుపాదం

Kasu Mahesh: చనిపోయే వ్యక్తిపై కూటమి కేసు ఎవరినీ వదిలిపెట్టం

విజయ్ కు షాక్.. జన నాయగన్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

'సంస్కార హీనుడు చంద్రబాబు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మంత్రి గారి బాగోతం.. గుడ్ మార్నింగ్ ధర్మవరంపై కేతిరెడ్డి

టీడీపీ గుండాల దాడిలో YSRCP కార్యకర్త సాల్మన్ మృతి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు

సంక్రాంతికి హెలికాప్టర్‌ రైడ్‌ ..!

గోవింద రెడ్డి ఆరోగ్యం విషమం

జపాన్ లో పుష్పరాజ్: Allu Arjun

Photos

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)