Breaking News

మళ్లీ మొబైల్‌ చార్జీల మోత

Published on Sun, 01/11/2026 - 04:43

న్యూఢిల్లీ: టెలికం చార్జీల మోతకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్‌ నాటికి టారిఫ్‌లను టెల్కోలు సుమారు 15 శాతం పెంచే అవకాశం ఉంది. దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి రెట్టింపు కానుంది. ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్‌ ఒక నివేదికలో ఈ విషయాలు పేర్కొంది. 2026 ప్రథమార్ధంలో జియో ప్రతిపాదిత ఐపీవోతో టెలికం పరిశ్రమ వేల్యుయేషన్‌ పెరుగుతుందని రిపోర్టును రూపొందించిన ఈక్విటీ అనలిస్ట్‌ అక్షత్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 

గతంలో ధోరణులకు తగ్గట్లుగా దాదాపు రెండేళ్ల తర్వాత దేశీయంగా జూన్‌లో మొబైల్‌ టారిఫ్‌లు 15 శాతం మేర పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి 16 శాతానికి చేరొచ్చని తెలిపారు. డేటా, పోస్ట్‌పెయిడ్‌ వినియోగం పెరుగుతుండటంతో మొబైల్‌ ఏఆర్‌పీయూ (యూజరుపై సగటున వచ్చే ఆదాయం) పెరుగుతోందని నివేదిక తెలిపింది.  

నివేదికలో మరిన్ని విశేషాలు.. 
→ ఇన్వెస్టర్లకు రెండంకెల స్థాయిలో రాబడిని ఇచ్చేందుకు, భారతి ఎయిర్‌టెల్‌కి దాదాపు సరిసమానమైన వేల్యుయేషన్‌ని పొందేందుకు జియో సుమారు 10–20 శాతం మేర మొబైల్‌ టారిఫ్‌లు పెంచవచ్చు. 

→ ఏజీఆర్‌ బాకీలపై ప్రభుత్వం 5 ఏళ్ల మారటోరియం ఇవ్వడం వల్ల 2026–30 ఆర్థిక సంవత్సరాల మధ్య ప్రభుత్వానికి వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సిన మొత్తం.. 35–85 శాతం మేర తగ్గుతుంది. అయినప్పటికీ చెల్లింపులు జరిపేందుకు 2027–2030 ఆర్థిక సంవత్సరాల మధ్య మొబైల్‌ సరీ్వసుల రేట్లు 45 శాతం మేర పెంచాల్సి ఉంటుంది.  

→ పెట్టుబడి వ్యయాలు తగ్గడం వల్ల టెల్కోల మార్జిన్లు పెరగవచ్చు. 5జీ నెట్‌వర్క్‌ విస్తరణ దాదాపు పూర్తయ్యింది. 2025 ఆర్థిక సంవత్సరం నుంచే పెట్టుబడి వ్యయాలు నెమ్మదిగా తగ్గడం మొదలైంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే తీరు కొనసాగే అవకాశం ఉంది.   

Videos

పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది

ఎవరూ అధైర్య పడకండి.. మన వెనుక జగనన్న ఉన్నాడు

సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు

ABN కాదు TDP ఛానల్ అని పెట్టుకోండి.. రాధాకృష్ణ, వెంకట్ కృష్ణను అరెస్ట్ చెయ్యాలి

మా రోజమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే.. జనసేన నేతలకు YSRCP నేతలు వార్నింగ్

24 గంటలే టైమ్ ఇస్తున్నా.. మీ భరతం పడతా బిడ్డా

తప్పిపోయిన పాపను చేరదీసిన మంత్రి సీతక్క

బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?

థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)