Breaking News

‘మానవుల మాదిరిగా వాస్తవాలు తెలుసుకోదు’

Published on Wed, 07/02/2025 - 13:01

చాట్‌జీపీటీ యూజర్లు పాపులర్ ఏఐ చాట్‌బాట్‌ను గుడ్డిగా నమ్మకూడదని ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌ కోరారు. ఓపెన్ఏఐ అధికారిక పాడ్‌కాస్ట్‌ మొదటి ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడారు. చాట్‌జీపీటీ ఒక టెక్నాలజీ అని.. ఆశ్చర్యకరంగా దాన్ని చాలామంది వినియోగదారులు అమితంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. చాట్‌జీపీటీలో నిర్దిష్ట పరిమితులున్నాయని తెలిపారు. అందుకే దీనిపై ప్రజలకు చాలా నమ్మకం ఉందన్నారు. కానీ ఏఐ చాట్‌బాట్‌ను వినియోగదారులు గుడ్డిగా నమ్మకూడదని పేర్కొన్నారు.

‘చాట్‌జీపీటీని వినియోగదారులు సహేతుకమైన సందేహాలు అడగాలి. అడ్డదిడ్డ ప్రశ్నలడిగితే సమాధానాలు భిన్నంగా ఉండవచ్చు. చాట్‌జీపీటీపై ప్రజలకు చాలా నమ్మకం ఉంది. ఏఐ కొన్నిసార్లు భ్రాంతులు(Hallucination) కలిగిస్తుంది. ఏఐ చాట్‌బాట్‌ నమ్మదగిన, కల్పిత సమాచారాన్ని సృష్టించగలదు. ఎల్‌ఎల్‌ఎంలోని డేటా నమూనాల ఆధారంగా ఏఐ టెక్ట్స్‌ను అంచనా వేస్తుంది. ఇది మానవుల మాదిరిగా వాస్తవాలను తెలుసుకోదు. ఏఐ టూల్స్‌పై ఆధారపడటం ఎక్కువవుతోంది. పిల్లల పెంపకం కోసం సలహా అడగడం దగ్గర నుంచి ఇన్నోవేషన్‌ పరిశోధన వరకు ప్రతిదానికీ చాట్‌జీపీటీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ యూజర్లు కీలకమైన సమాచారాన్ని స్వతంత్రంగా ధ్రువీకరించుకోవాలి’ అని ఆల్ట్‌మన్‌ నొక్కి చెప్పారు.

ఇదీ చదవండి: మస్క్‌ కంపెనీలో ఉద్యోగం కావాలా?

సరి చూసుకోవాల్సిందే..

కీలక విషయాలకు సంబంధించిన ఏఐ సమాచారాన్ని ధ్రువీకరించుకునేందుకు టెక్‌ నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. వారి వివరాల ప్రకారం.. ఏఐ సమాచారాన్ని విశ్వసనీయ వార్తా సంస్థలు, ప్రభుత్వ పోర్టల్స్ లేదా అకడమిక్ సైట్లలో(ఉదా., .gov, .edu, లేదా పీర్-రివ్యూడ్ జర్నల్స్) సరిచూసుకోవాలి. ఏఐ సమాచారం ఇతర విశ్వసనీయ సైట్‌ల్లో ఒకేలా ఉంటే కొంతవరకు ఏకాభిప్రాయానికి రావొచ్చు. ఏఐ చాలాసార్లు పాత డేటాను క్రీడికరిస్తుంది. లేటెస్ట్‌ వివరాలను సరిచేసుఏకోవాలి. ఏఐ వివరాలు వినియోగదారుల క్రిటికల్ థింకింగ్‌కు పొంతనలేకుండా అనిపిస్తే వెంటనే అధికారికంగా ధ్రువీకరించుకోవాలి.

Videos

పాకిస్తాన్ తో యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు? కాంగ్రెస్ సూటి ప్రశ్నకు బీజేపీ రిప్లై ఏంటి?

ఈడీ విచారణపై అల్లు అరవింద్ క్లారిటీ

ఈ ఘటన చూసి నా కళ్ళలో నీళ్లు వచ్చాయి.. ఎంపీ తనుజారాణి ఎమోషనల్

వైఎస్ జగన్ ను కలవొద్దని మామిడి రైతులను కూటమి నేతలు బెదిరిస్తున్నారు

మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: రాంచందర్రావు

ఈనెల 9న చిత్తూరు జిల్లాలో YS జగన్ పర్యటన: పెద్దిరెడ్డి

20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి ఠాక్రే వారసులు

గంటాపై ఫిర్యాదు చేసిన భీమిలి నియోజకవర్గ నేతలు

వల్లభనేని వంశితో అభిమానుల ఫోటోలు

ఏపీలో నరకాసుర పాలన: పేర్ని నాని

Photos

+5

ఆద్యంతం ఉత్కంఠను రేపే మిస్టరీ పర్యాటక ప్రదేశాలివే..! (ఫోటోలు)

+5

విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్‌ డ్రిల్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌లో చుక్కలు (ఫొటోలు)

+5

ఆషాడమాసం.. విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ (ఫోటోలు)

+5

ఆరునెలల జ్ఞాపకాలు పంచుకున్న ప్రభాస్‌ సోదరి (ఫోటోలు)

+5

'అఖండ' కోసం తెలుగులో ఎంట్రీ ఇచ్చేసిన నటి హర్షాలీ మల్హోత్రా (ఫోటోలు)

+5

గర్భాలయంలో ఏడడుగుల విగ్రహం.. ఏపీలో ఈ పురాతన ఆలయం గురించి విన్నారా? (చిత్రాలు)

+5

నలుగురు టాప్‌ హీరోయిన్లతో ధనుష్‌ పార్టీ.. ఎందుకో తెలుసా (ఫోటోలు)