Breaking News

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో టాప్‌ బ్రాండ్‌ ఇదే..

Published on Tue, 05/06/2025 - 10:59

దేశీయంగా మార్చి త్రైమాసికంలో టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఐఫోన్‌ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 25 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ 8 శాతం మార్కెట్‌ వాటా దక్కించుకుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ పెరుగుతుండటం, రిటైల్‌ స్టోర్స్‌ను కంపెనీ విస్తరించడం, ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు ఇందుకు గణనీయంగా దోహదపడ్డాయి. దీంతో సూపర్‌ప్రీమియం సెగ్మెంట్‌లో (రూ. 50,000–రూ. 1 లక్ష వరకు ధర ఉండే ఫోన్లు) యాపిల్‌ వాటా 28 శాతానికి, ఉబర్‌–ప్రీమియం విభాగంలో (రూ. 1 లక్ష పైగా రేటు ఉండే ఫోన్లు) 15 శాతానికి చేరింది. జనవరి–మార్చ్‌ త్రైమాసికంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల సరఫరాపై సైబర్‌మీడియా రీసెర్చ్‌ (సీఎంఆర్‌) ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

దేశీయంగా మొత్తం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో 21 శాతం వాటాతో చైనా సంస్థ వివో అగ్రస్థానంలో నిలవగా, 19 శాతం షేర్‌తో కొరియన్‌ దిగ్గజం శాంసంగ్‌ రెండో స్థానంలో ఉంది. షావోమీ వాటా ఏకంగా 37 శాతం పడిపోయింది. 13 శాతం మార్కెట్‌ షేర్‌తో మూడో ర్యాంక్‌లో నిలిచింది. ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 8 శాతం పెరగ్గా, మార్కెట్‌ వాటా 12 శాతంగా నమోదైంది.  

ఇదీ చదవండి: ఈ ఏడాదిలో ఆర్‌బీఐ మరోసారి తీపికబురు

మరిన్ని ముఖ్యాంశాలు..

  • మార్చి త్రైమాసికంలో భారత్‌లో సరఫరా అయిన మొత్తం ఫోన్లలో 5జీ స్మార్ట్‌ఫోన్ల వాటా 86 శాతంగా నమోదైంది. వార్షికంగా 14 శాతం పెరిగింది. రూ. 8,000 నుంచి రూ. 13,000 వరకు ఖరీదు చేసే 5జీ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు 100 శాతం పెరిగాయి.

  • ఫీచర్‌ ఫోన్‌ సెగ్మెంట్లో చైనాకు చెందిన ఐటెల్‌ మార్కెట్‌ వాటా వార్షికంగా చూస్తే 6 శాతం తగ్గినప్పటికీ, మొత్తం మీద 41 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది.  

  • స్మార్ట్‌ఫోన్‌ చిప్‌సెట్‌ మార్కెట్లో మీడియాటెక్‌ 46 శాతం వాటాతో టాప్‌లో నిల్చింది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్లో (రూ. 25,000 పైగా రేటు ఉన్నవి) 35 శాతం వాటాతో క్వాల్‌కామ్‌ అగ్రస్థానం దక్కించుకుంది.
     

Videos

Mahanadu: డ్వాక్రా సంఘాలకు బెదిరింపులు

ప్రభుత్వ స్కూళ్లలొ చదువులు అటకెక్కాయి: YS జగన్

మేడిగడ్డ బ్యారేజీపై NDSA ఇచ్చిన నివేదిక అంతా బూటకం: కేటీఆర్

సినిమాలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి: YS జగన్

అల్లు అరవింద్ లీజు థియేటర్లన్నింటిలోనూ తనిఖీలు

కడపలోనే మహానాడు పెడతావా..! వడ్డీతో సహా చెల్లిస్తా...

పల్నాడు జిల్లాలో టీడీపీ హత్య రాజకీయాలు: Perni Nani

Ys Jagan: దమ్ముంటే ఆ ఒక్కటి చేసి చూపించు..!

New COVID: చైనాలో కొత్త వేరియంట్

Photos

+5

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)

+5

మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)

+5

పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు)

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)