కొమురవెల్లిలో భక్తుల సందడి | Sakshi
Sakshi News home page

కొమురవెల్లిలో భక్తుల సందడి

Published Mon, Feb 14 2022 6:08 AM

Medak: Huge Devotees Rush In Komuravelli Mallanna Temple - Sakshi

కొమురవెల్లి(సిద్దిపేట): కోరిన కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లన్నను భక్తులు దర్శించుకొని తరించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ఆదివారం భారీగా తరలివచ్చారు. మల్లన్న నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లే భక్తులు స్వామి వారిని దర్శించుకొని మేడారం వెళ్తుండడంతో రద్దీ పెరిగింది. మల్లన్న దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

ఒక్కపొద్దులతో పాటు మట్టికుండలో పసుపు బియ్యంతో నైవేద్యం సమర్పించి గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు మల్లన్న గుట్టపైన కొలువైన రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement