-
మల్లన్నా.. ఎందుకిలా?
కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఆధ్వర్యంలో దాసారం గుట్టపై హిల్ వ్యూ గెస్ట్హౌస్ల నిర్మాణాలు ఇంకా కొలిక్కి రావడంలేదు. రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్న తీరు అనుకొన్నదొక్కటి.. ఐయ్యిందొక్కటిలా మారింది. ప్రణాళికా లోపం కారణంగా చిన్న పనిగా మొదలైన రోడ్డు నిర్మాణం ఇప్పుడు బాహుబలి ప్రాజెక్టుగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. సాక్షి, సిద్దిపేట: భక్తుల సౌకర్యార్థం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం దాసారం గుట్ట పైన గెస్ట్హౌస్లను నిర్మించాలని నిర్ణయించింది. గుట్టమీద చదును చేస్తే రెండు ఎకరాల స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. హిల్వ్యూ గెస్ట్హౌస్లుగా కొమురవెల్లికి సరికొత్త సొబగులు అద్దుతామంటూ గొప్పలు చెప్పారు. అనుకున్నదే తడవుగా అనుమతులు జారీ చేశారు. నిధులు మంజూరు చేశారు. తీరా పనులు మొదలెట్టాక, పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. పనులు మొదలై ఐదేళ్లు దాటింది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చారాణా పనికి.. గెస్ట్హౌస్లను నిర్మించేందుకు ఎంపిక చేసిన దాసారం గుట్టపైకి రాకపోకలు సాగించేందుకు సుమారు 30 ఫీట్ల వెడల్పుతో 550 మీటర్ల రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉందంటూ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు గుర్తించారు. రెండు మూల మలుపులు ఉండే విధంగా డిజైన్ ఖరారు చేశారు. 2017లో ప్రారంభించారు. ఆరంభంలో ఈ రోడ్డు నిర్మాణం అంచనా వ్యయం కేవలం రూ.1.40 కోట్లు. కానీ ఆ నిధులతో పదిశా తం కూడా పనులు పూర్తి కాలేదు. దీంతో 2021లో అంచనాలు సవరించి రూ.3.5 కోట్లు కేటాయించా రు. అయినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పటి వరకు 4.9కోట్లు వెచ్చించినా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. పూర్తి స్థాయిలో రోడ్డు అందుబాటులోకి రావాలంటే మరో రూ.1.9 కోట్లు అవసరం అంచనాలు వేశారు. ఆ నిధులు ఇంకా మంజూరు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. లక్ష్యం నెరవేరేనా? ప్రస్తుత అంచనాల ప్రకారం గుట్టపైకి రోడ్డు కోసమే రూ.9కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదే రూ.9కోట్లు వెచ్చిస్తే కొమురవెల్లి దేవాలయానికి సమీపంలో తొమ్మిది ఎకరాలకు పైగా స్థలం లభించేదని స్థానికులు అంటున్నారు. పైగా గుట్టపై నిర్మించే గెస్ట్హౌస్లు సైతం వీవీఐపీల వరకే పరిమితం కానున్నాయి. కొమురవెల్లి దేవాలయానికి వాహనాల్లో వచ్చిన వారే గుట్ట పైకి ఎక్కే అవకాశం ఉంటుంది. సాధారణంగా బస్సుల ద్వారా వచ్చే భక్తులు గుట్ట మీద ఆశ్రయం పొందలేరు. అంచనా వ్యయాని కి మూడున్నర రెట్లు ఖర్చు చేసినా ఆశించిన ఫలితం దక్కుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కమీషన్ల కోసమేనా? గుట్టపైన అందుబాటులోకి వచ్చే స్థలం కేవలం రెండు ఎకరాలు. కామన్ యూజ్ ఏరియా, పార్క్ తదితర ఏర్పాట్లకు స్థలాన్ని కేటాయిస్తే కాటేజీల నిర్మాణానికి దక్కే స్థలం కష్టంగా ఎకరాన్ని మించి ఉండదు. హిల్వ్యూ గెస్ట్హౌస్ కావడంతో విశాలంగా నిర్మాణం చేయకపోతే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. కేవలం ఎకరం స్థలం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేవలం నిర్మాణ పనుల్లో కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టారనే విమర్శలు సైతం వినవస్తున్నాయి. నిధులు రాగానే పనులు గుట్టమీద దారి కోసం మొదట రూ.1.4కోట్ల నిధులు కేటాయించారు. గుట్టమీదికి మట్టితో రోడ్ ఫాం చేస్తే ఉండదు. కనుక వాల్స్ను నిర్మించి రోడ్ ఫాం చేస్తున్నాం. అందుకే వ్యయం పెరిగింది. మళ్లీ నిధులు కేటాయించగానే పనులు ప్రారంభిస్తాం. – శ్రీనివాస్ రెడ్డి, డీఈ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ -
మల్లన్నా.. ఏదీ రక్షణ?
కొయురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సీసీ కెమరాలకు సంబంధించిన సిస్టం(ఎన్వీఆర్) ధ్వంసమైంది. దీంతో దేవాలయంలోని 32 కెమెరాలు పని చేయడం లేదు. గుడి పరిసరాలలో పనిచేసే సీసీ కెమెరాల సిస్టం యూనిట్ను ఏఈవో గదిలో అమర్చారు. ప్రస్తుతం దీనిని పగులకొట్టడంతో సీసీ కెమెరాలు పని చేయక నిత్యం స్వామివారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు రక్షణ కరువైంది. ఎవరో కావాలనే ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లుందని టెక్నీషియన్ చెబుతున్నాడు. దీంతో ఆలయంలో సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారం క్రితం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గొడవ గురించి సీసీ ఫుటేజీ తీసుకుందామని మంగళవారం టెక్నీషియన్ను పిలిపించగా ఎన్వీఆర్ ధ్వంసమైన విషయం తెలిసింది. ఆలయ చైర్మన్ గీస భిక్షపతి వెంటనే విలేకరుల సమావేశం నిర్వహించి ఉద్యోగులే సీసీ కెమెరాల సిస్టం యూనిట్ను ధ్వంసం చేశారని ఆరోపించారు. కొద్దిరోజులుగా ఈయనకు, ఏఈఓ అంజయ్య మధ్య విభేదాలు తలెత్తడంతో ఆలయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. -
పసుపుమయం పట్నం వారం
కొమురవెల్లి (సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలోని తోటబావి ప్రాంగణంలో పట్నం వారాన్ని పురస్కరించుకొని సోమవారం అగ్నిగుండాలు, పెద్దపట్నం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి హైదరాబాద్కు చెందిన యాదవ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒగ్గు పూజారులు పంచవర్ణాల పిండితో పెద్దపట్నం వేశారు. అనంతరం పంచ పల్లవాలతో (మామిడి, జువ్వి, రాగి, మేడి, మర్రి) కట్టెలతో నిప్పు కణిక లు తయారు చేసి అగ్ని గుండాలను సిద్ధం చేశారు. తర్వాత ఉత్సవ విగ్రహాలతో ఆలయ పూజారులు పెద్దపట్నం, అగ్ని గుండాలు దాటారు. -
కన్నుల పండువగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం (ఫొటోలు)
-
కొమురవెల్లిలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): కోరిన కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లన్నను భక్తులు దర్శించుకొని తరించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ఆదివారం భారీగా తరలివచ్చారు. మల్లన్న నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లే భక్తులు స్వామి వారిని దర్శించుకొని మేడారం వెళ్తుండడంతో రద్దీ పెరిగింది. మల్లన్న దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఒక్కపొద్దులతో పాటు మట్టికుండలో పసుపు బియ్యంతో నైవేద్యం సమర్పించి గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు మల్లన్న గుట్టపైన కొలువైన రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
టీమిండియా కెప్టెన్కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
Advertisement