టీమిండియా కెప్టెన్‌కు మరో అరుదైన గౌరవం.. | Sakshi
Sakshi News home page

Virat Kohli: టీమిండియా కెప్టెన్‌కు మరో అరుదైన గౌరవం..

Published Tue, Oct 19 2021 7:57 PM

Virat Kohli Wax Statue Unveiled At Dubai Madame Tussauds Museum - Sakshi

Virat Kohli Wax Statue At Dubai Madame Tussauds Museum: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మరో అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హాలీవుడ్ యాక్షన్ కింగ్ జాకీ చాన్, ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్, నటుడు టామ్ క్రూజ్ వంటి ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి.


టీ20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు అక్టోబరు 14న దుబాయ్‌లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంను ప్రారంభించారు. టీమిండియా కెప్టెన్ కోహ్లికి ఇది రెండో మైనపు విగ్రహం. గతంలో 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో అతని మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఈనెల 24న దాయాది పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. 
చదవండి: ఓ పక్క మన వాళ్లను చంపుతుంటే, పాక్‌తో టీ20 అవసరమా..? ప్రధానిని నిలదీసిన ఓవైసీ
 

Advertisement
Advertisement