22న పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన | Sakshi
Sakshi News home page

22న పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

Published Sat, Apr 20 2024 1:45 AM

పూజలు నిర్వహిస్తున్న ఒగ్గుపూజారులు  - Sakshi

చిగురుమామిడి: మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో 22న పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు జక్కుల బాబు తెలిపారు. చిగురుమామిడిలో శుక్రవారం మాట్లాడారు. 20 నుంచి ప్రత్యేక కార్యక్రమాలుంటాయన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం అన్నదానం, అదే రోజు సాయంత్రం పోచమ్మతల్లి బోనాలు, తర్వాత రోజు ఉదయం పెద్దమ్మ తల్లి బోనాలు, 24న జాతర నిర్వహిస్తామన్నారు. ఐదు గుంటల స్థలంలో దాదాపు రూ. నలభై లక్షలతో ఆలయాన్ని అన్ని హంగులతో నిర్మించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్‌ జక్కుల రవీందర్‌, కార్యదర్శి మల్లేశం, స్వామి, సమ్మయ్య, వెంకటయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement