-
కాంగ్రెస్కు ఓటేసి గోసపడుతున్రు..
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రజలందరూ గోసపడుతున్నారని, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మల్యాలలో సోమవా రం రాత్రి రోడ్షో చేపట్టారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంగడి బజార్లో వినోద్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ బడి తేలే.. గుడి తేలేదని, ఐదేళ్లలో కనీసం ఐదు రూపాయలు తేలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం బండి సంజయ్ వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఆయనకు పునరావాసమా..? అని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గారడీ మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని, నాలుగు నెలల్లోనే రాష్ట్రప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలని, ఇందుకు వినోద్కుమార్ను గెలిపించుకోవాలని కోరారు. ఇవి చదవండి: నేను.. పక్కా లోకల్ -
‘మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ’
హుజూరాబాద్: మాదిగల రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ నమ్మించి ద్రోహం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ అన్నారు. సోమవారం రాత్రి హుజురా బాద్లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఆరితేరిందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడు,నాలుగు సీట్లు రావాల్సి ఉండగా ఒకటి కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. రెడ్డిలకు ఆరుసీట్లు, 50శాతం పైన ఉన్న బీసీలకు రెండు సీట్లు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ నియంతృత్వంతో మాదిగలు నష్టపోయారని, అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎవరూ ఓటు వేయద్దని సూచించారు. బీజేపీ తమ సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇచ్చిందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకే మద్దతు ఇచ్చామని అన్నారు. నాయకులు రుద్రారపు రామచంద్రం, మారెపల్లి శ్రీనివాస్, తునికి వసంత్, వెంకట్ స్వామి, డాక్టర్ తడికమళ్ల శేఖర్, బొరగల సారయ్య, రాజు పాల్గొన్నారు. ఏజీని కలిసిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్కరీంనగర్క్రైం: రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ బి.సుదర్శన్ రెడ్డిని కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రాజ్ కుమార్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేశారు. న్యాయవాదులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.2లక్షల ఇన్సూరెన్స్ను రూ.5లక్షలకు పెంచాలని, కొత్త సభ్యులకు హెల్త్కార్డులు ఇవ్వాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేల స్టైఫండ్ ఇవ్వాలని వినతిపత్రం అందించగా.. సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ కాంట్రాక్టర్ల సంఘం కన్వీనర్గా మహేందర్కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం కన్వీనర్గా దగ్గు మహేందర్ రాకేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహేందర్ కన్వీనర్గా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. కాంట్రాక్టర్లకు సంబంధించిన సమస్యలను అధికారుల సహకారంతో పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మహేందర్ తెలిపారు. తన నియామకానికి సహకరించిన సహచర కాంట్రాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మేయర్ యాదగిరి సునీల్రావును మహేందర్ రాకేశ్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు మర్యాదకపూర్వకంగా కలిశారు. మహేందర్కు మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. -
అశ్వవాహనంపై రామయ్య
ఇల్లందకుంట: అపరభద్రాద్రి ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరా మనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకుడు శేషం రామాచార్యులు, అర్చకుడు శేషం వంశీధరచార్యులు మంత్రోచ్ఛారణ మధ్య స్వామివార్లను ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో కందుల సుధాకర్, సురేందర్రెడ్డి, కడారి కుమారస్వామి, కొత్త శ్రీనివాస్, పెద్దికుమార్ పాల్గొన్నారు. -
ముగ్గురు ‘ఉపాధి’ కూలీలకు గాయాలు
సుల్తానాబాద్రూరల్/సుల్తానాబాద్(పెద్దపల్లి): ఉపాధిహామీ ద్వారా సుద్దాల పెద్దమ్మకుంటలో శుక్రవారం పూడికతీస్తున్న కూలీలపై బండరాయి దొర్లి, మట్టిపెళ్లలు పడ్డాయి. ఈఘటనలో ముగ్గురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. ఎంపీడీవో దివ్యదర్శన్రావు, స్థానికుల కథనం ప్రకారం.. పెద్దమ్మకుంట పూడికతీత పనుల్లో 163 మంది కూలీలు పనిచేస్తున్నారు. అందులో 20 మంది ఒక బృందంగా ఏర్పడి పూడిక తీస్తుండగా గట్టు కుంగి దానిపై ఉన్న బండరాయి కిందకు జారిపడింది. ఆ క్రమంలోనే మట్టిపెళ్లలు తగిలి అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలు ఆవునూరి తార, కల్వల లింగమ్మ, బుర్ర స్వరూపకు గాయాలయ్యాయి. తోటికూలీలు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచా రం అందుకున్న ఈజీఎస్ ఏపీడీ సత్యనారాయణ ఆస్పత్రికి వెళ్లి కూలీలను పరామర్శించారు. -
అప్పుల బాధతో గొర్రెల కాపరి ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అప్పుల బాధతో ఓ గొర్రెల కాపరి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రమాకాంత్, గ్రామస్తుల వివరాల ప్రకారం.. రాగట్లపల్లికి చెందిన నెత్తెట్ల చిన్న మల్లయ్య(48) ఇల్లు నిర్మించుకునేందుకు, భూమిని అభివృద్ధి చేయడం కోసం సుమారు రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. వ్యవసాయం, గొర్రెల పెంపకం ద్వారా ఆదాయం అంతంత మాత్రంగానే వస్తుండటంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య సత్తవ్వ, కుమారుడు అజయ్, కూతురు అమ్ములు ఉన్నారు. మల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ దాసరి సుజాత, గ్రామస్తులు కోరారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఎన్నికల వ్యయ వివరాలు పారదర్శకంగా ఉండాలి
● ఎన్నికల వ్యయ పరిశీలకుడు అశ్విని కుమార్ పాండేనేటి నుంచి ఇంటింటికీ కాంగ్రెస్కరీంనగర్: ఎన్నికల వ్యయ వివరాలు పారదర్శకంగా నమోదు చేయాలని ఎంసీఎంసీ కమిటీ సభ్యులకు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు అశ్వినికుమార్ పాండే సూచించారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లోని మీడియా సెంటర్, కంట్రోల్రూంను పరిశీలించారు. మీడియా సెంటర్ పనితీరుతో పాటు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చే ఎన్నికల ప్రకటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పెయిడ్ ఆర్టికల్స్ను పర్యవేక్షిస్తూ వ్యయ వివరాలు నమోదు చేయాలన్నారు. కంట్రోల్రూం పనితీరును అడిగి తెలు సుకున్నారు. సీ విజిల్ యాప్ ద్వారా వచ్చిన కేసులు, తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. సమాచార, పౌర సంబంధాలశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ కొండయ్య, ఏపీఆర్ఓ వీరాంజనేయులు, కంట్రోల్ రూమ్ నోడల్ ఆఫీసర్ ఎస్.నాగార్జున పాల్గొన్నారు. ● సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన పంచ న్యాయాల (పాంచ్న్యాయ్) గ్యారంటీ కార్డులను నగరంలోని ప్రతీ గడపకు తీసుకెళ్తామని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి తెలిపారు. శనివారం నుంచి ఇంటింటికి వెళ్లి పంచ న్యాయాలు అందజేస్తూ, బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. శుక్రవారం నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల తరహాలోనే కేంద్రంలో కాంగ్రెస్ పాంచ్న్యాయ్ను అమలు చేయనుందన్నారు. ఇటీవల తుక్కుగూడ సభలో రాహుల్గాంధీ ప్రకటించిన ఈ పంచన్యాయాల గ్యారంటీ కార్డులను ప్రతీ గడపకు చేరుస్తామన్నారు. కేంద్రం నుంచి రొటీన్గా వచ్చే నిధులు కాకుండా, సొంతంగా తీసుకొచ్చినవేమిటో, పనులేమిటో బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ ఎంపీగా, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా పూర్తిగా వి ఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ హ యాంలో నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడం వల్లే నగరం స్మార్ట్సిటీకి అర్హత సాధించిందన్నారు. వీటిని ప్రజలకు వివరిస్తామని, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తామన్నారు. పార్టీలో అంతర్గతంగా చిన్న చిన్న సమస్యలుంటే సర్దుకుపోతా మన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బిజీ షెడ్యూ ల్ వల్ల, సమాచారలోపంతో తాను కార్యక్రమానికి హాజరుకాలేకపోయానన్నారు. నాయకులు ఎండీ.తాజొద్దీన్, శ్రవణ్నాయక్, బొబ్బిలి విక్టర్, సమద్ నవాబ్, శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు. -
సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఫుడ్ పాయిజన్
● 20 మంది విద్యార్థులకు అస్వస్థత సుల్తానాబాద్: సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో శుక్రవారం ఉదయం టిఫిన్ చేసిన విద్యార్థులకు వాంతులు, విరేచనాలయ్యాయి. సిబ్బంది వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నలుగురు నలుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సైలెన్ ఎక్కించారు. మిగిలిన వారి ఆరోగ్యం సాయంత్రం వరకు కుదుటపడటంతో హాస్టల్కు తరలించినట్లు డాక్టర్ వెంకటేశ్ తెలిపారు. అల్పాహారంలో ఆయిల్ ఎక్కువ వాడటం వల్ల పిల్లలు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. హాస్టల్కు పంపించిన పిల్లలకు స్టాఫ్ నర్స్ ఆధ్వర్యంలో కొబ్బరి బోండాలు, గ్లూకోజ్ అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సత్యప్రసాద్ రాజు పేర్కొన్నారు. పిడుగు పడి ఒకరికి తీవ్ర గాయాలుమెట్పల్లిరూరల్: మండలంలోని ఆత్మకూర్లో పిడుగు పడి, ఒకరికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. వారి వివరాల ప్రకా రం.. ఆత్మకూర్కు చెందిన కోరుట్ల రమేశ్ ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తుండటంతోపాటు ఖాళీగా ఉన్న సమయంలో కూలీ పనులకు వెళ్తున్నాడు. శుక్రవారం సాయంత్రం గాలిదుమారం వచ్చి, ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో అతను గ్రామంలో చెట్టు కింద ఆగాడు. అదే సమయంలో పిడుగు పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన మెట్పల్లిలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ద్విచక్రవాహనాల దొంగ అరెస్టుసిరిసిల్ల క్రైం: సిరిసిల్ల పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన రెండు ద్విచక్రవాహనాలను ఎత్తుకెళ్లిన దొంగను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ రఘుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఈ నెల 10న సిరిసిల్ల పాత బస్టాండ్ ఏరియాలోని బార్ అండ్ రెస్టారెంట్ ఎదుట నిలిపిన, సినారె గ్రంథాలయం ఎదుట పార్కింగ్ చేసిన బైకులు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సిరిసిల్ల పట్టణం వెంకంపేటలో ఉండే చెందిన కోల రవిగౌడ్ను దొంగగా తేల్చారు. ఇతను కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పరీద్పేటకు చెందినవాడని, ఉపాధి నిమిత్తం సిరిసిల్లలో ఉంటున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఎత్తుకెళ్లిన వాహనాల్లో ఒకటి పొదల్లో దాచిపెట్టాడని, మరోదానిపై సిరిసిల్ల బైపాస్ రోడ్డుమీదుగా వెళ్తుంటే పట్టుకున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది విధుల బహిష్కరణ పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి వెంటనే వేతనాలను ఇప్పించాలంటూ సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి, కేవీపీఎస్ నాయకులు అశోక్, రవీందర్ డిమాండ్ చేశా రు. వీరి ఆధ్వర్యంలో శుక్రవారం సిబ్బంది విధులు బహిష్కరించారు. శానిటేషన్, పేషంట్కేర్, సెక్యూరిటీ తదితర విభాగాల్లో పని చేసే కార్మికులకు ఏడాదిగా వేతనాలు ఇవ్వ డం లేదన్నారు. వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సదరు కాంట్రాక్టర్తో మాట్లాడి కార్మికుల సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరారు. -
22న పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
చిగురుమామిడి: మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో 22న పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జక్కుల బాబు తెలిపారు. చిగురుమామిడిలో శుక్రవారం మాట్లాడారు. 20 నుంచి ప్రత్యేక కార్యక్రమాలుంటాయన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం అన్నదానం, అదే రోజు సాయంత్రం పోచమ్మతల్లి బోనాలు, తర్వాత రోజు ఉదయం పెద్దమ్మ తల్లి బోనాలు, 24న జాతర నిర్వహిస్తామన్నారు. ఐదు గుంటల స్థలంలో దాదాపు రూ. నలభై లక్షలతో ఆలయాన్ని అన్ని హంగులతో నిర్మించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ జక్కుల రవీందర్, కార్యదర్శి మల్లేశం, స్వామి, సమ్మయ్య, వెంకటయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది’
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని జిల్లా విద్యాశాఖ అధికారి సీహెచ్ జనార్దన్రావు అన్నారు. శుక్రవారం నగరంలోని సుభాష్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అల్లాడి లక్ష్మణమూర్తి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా లక్ష్మణమూర్తి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖాజా నజీరొద్దీన్, మండల విద్యాధికారి మధుసూదనాచారి, గోగులకొండ మోహన్, కటకం రమేశ్, గాజుల రవీందర్, మోతె చంద్రశేఖర్రెడ్డి, జాన్ సుధాకర్, రాజిరెడ్డి, మహేందర్ రెడ్డి, ప్రభాకర్రావు, ఖాజా మంజూర్ అలీ, అశోక్ రావు తదితరులు, పాల్గొన్నారు. -
సంజయ్ నయాపైసా తేలే
● వినోద్కుమార్ ప్రజల గొంగుకవుతాడు ● మేయర్ వై.సునీల్రావుకరీంనగర్: కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ నయాపైసా తేలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను ప్రజలు గెలిపిస్తే తమ సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకవుతాడని మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటో డివిజన్ తీగలగుట్టపల్లి విజేత గ్రీన్హోమ్స్ కాలనీవాసులతో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ సమావేశం అయ్యారు. మేయర్ సునీల్ రావు మా ట్లాడుతూ.. ఎన్నికలు వస్తేనే బండికి ప్రజలు గుర్తుకువస్తున్నారని అన్నారు. వినోద్ కుమార్ 2014 నుంచి 2019వరకు ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్కు వెయ్యికోట్లతో స్మార్ట్సిటీ తీసుకొచ్చారని అన్నా రు. వినోద్కుమార్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న సమయంలోనే తీగలగుట్టపల్లిని మున్సిపల్ కార్పొరేషన్లో కలిపి రైల్వే ఓవర్ బ్రిడ్జి తీసుకురా వడం జరిగిందన్నారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కార్పొరేటర్ కల్యాణి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సాగర్, మాజీ సర్పంచ్ కిష్టయ్య, శంకరయ్య, కరుణాకర్ గుప్త్తా, వాసుదేవరావు పాల్గొన్నారు. -
ఒలింపియాడ్లో ‘పారమిత’ ప్రతిభ
కొత్తపల్లి(కరీంనగర్): ఇటీవల నిర్వహించిన ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్(ఐటీవో)లో కొత్తపల్లి మండలంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. రాష్ట్రస్థాయిలో గణితంలో వెల్ది హర్షిణి(ఏడోతరగతి) 4వ ర్యాంకు, అర్హాన్ లతీఫ్ (ఎనిమిదో తరగతి) 4వ ర్యాంకు, సామాన్యశాస్త్ర విభాగంలో ఎన్.రుషిక(తొ మ్మిదో తరగతి) 7వ ర్యాంకు సాధించి, పతకాలు, బహుమతులు గెలుపొందారని హెచ్ఎం రితేశ్ మెహతా తెలిపారు. మరో ఐదుగురు విద్యార్థులు స్ఫూర్తి(గణితం), జి.సహస్ర, ఎస్.సిరి(సామాన్యశాస్త్రం), యశ్మిత్ పటేల్, రిధి పబ్బతి(ఆంగ్లం) మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పారమిత విద్యాసంస్థల చైర్మన్ ఇ.ప్రసాదరావు శుక్రవారం అభినందించారు. డైరెక్టర్లు రశ్మిత, ప్రసూన, అనూకర్రావు, రాకేశ్, వి.యు.ఎం.ప్రసాద్, వినోద్రావు, ప్రోగ్రాం హెడ్ గోపీకష్ణ, కో–ఆర్డినేటర్ రాము, గైడ్ టీచర్లు ప్రదీప్ కుమార్, చంద్రమౌళి శర్మ, హరీశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆరోగ్య క్రమశిక్షణతో అవయవాలు భద్రం
కరీంనగర్టౌన్: మనిషి ఆరోగ్య క్రమశిక్షణ పాటిస్తే అన్ని అవయవాలు భద్రంగా ఉండి, ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని మేయర్ వై.సునీల్రావు అన్నారు. వరల్డ్ లివర్ డే సందర్భంగా శుక్రవారం కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఆహారం మితంగా తీసుకుంటూ ప్రతీరోజు ఒక గంట వ్యాయామం చేయాలన్నారు. ముఖ్యంగా లివర్ పనితీరును బట్టే శరీరంలోని జీవ, జీర్ణక్రియలు సక్రమంగా జరుగుతాయని పేర్కొన్నారు. మెడికవర్ ఆస్పత్రి వైద్యులు ప్రజల ఆరోగ్యం కోసం తమ వంతు బాధ్యతగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ప్రణీత్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ దిలీప్రెడ్డి మాట్లాడుతూ.. మానవ శరీరంలో గుండె, మెదడు తర్వాత అతి ముఖ్యమైన అవయవం లివర్ అని తెలిపారు. అతిగా ఆల్కహాల్ సేవించడం వల్ల అది దెబ్బతింటుందని, ఆల్కహాల్ మానాలని సూచించారు. ఆస్పత్రి సిబ్బందికి జుంబా డ్యాన్స్పై శిక్షణతోపాటు ప్రదర్శన నిర్వహించారు. హాస్పిటల్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేచినేని వనజ, మేచినేని పవన్రావు, వైద్యులు వినయ్కుమార్, ఉపేందర్రెడ్డి, రవిమల్లారెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ కర్ణాకర్, ఆపరేషన్స్ మేనేజర్ సాయిచరణ్ పాల్గొన్నారు. మేయర్ వై.సునీల్రావు మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో వరల్డ్ లివర్ డే -
అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభ
కరీంనగర్రూరల్: కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు కరీంనగర్ మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభ నిర్వహించారు. జూబ్లీనగర్లో జరిగిన సభలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కె.నిర్మల, డాక్టర్ శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పిల్లలు, తల్లులు సరైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతీ శుక్రవారం సభ నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, ఎంపీడీవో సంజీవరావు, పంచాయతీ కార్యదర్శి కిరణ్రావు, అంగన్వాడీ టీచరు స్వరూపరాణి, ఏఎన్ఎం సుగుణ, ఆశావర్కర్ వసంత తదితరులు పాల్గొన్నారు. -
కంగ్రాట్స్.. సహన
● సివిల్స్ ర్యాంకర్కు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ‘మారం’ అభినందన కరీంనగర్ అర్బన్: సివిల్స్లో ర్యాంకు సాధించిన కొలనుపాక సహనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని టీఎన్జీవో భవనంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సివిల్స్లో కరీంనగర్ యువత సత్తా చాటుతోందని హర్షం వ్యక్తం చేశారు. సహన సివిల్స్లో ప్రతిభ చాటడం అభినందనీయమని కొనియాడారు. దారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సహన మంచి అధికారిగా సేవలందించి కరీంనగర్ పేరును చిరస్థాయిగా నిలపాలని ఆకాంక్షించారు. టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, నాగుల నరసింహస్వామి, అసోసియేట్ అధ్యక్షుడు రాగి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్రెడ్డి, మహిళా జేఏసీ చైర్పర్సన్ ఇరుమల్ల శారద, సబిత, సునీత, శైలజ, సుస్మిత, అర్బన్ అధ్యక్షుడు సర్దార్ హర్మిందర్ సింగ్, రూరల్ అధ్యక్షుడు మారుపాక రాజేశ్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంతరావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
బండి, గంగుల ఒక్కటే
● వినోద్ను ఓడించింది వాళ్లే ● ఇద్దరూ కలిసే నగరాన్ని దోచుకున్నారు ● తీగలవంతెనపై విచారణ జరుగుతోంది ● మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒక్కటేనని, ఇద్దరు కలిసి నగరాన్ని దోచుకున్నారని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం మంత్రి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉప్పు నిప్పులా ఉన్న గంగుల, బండి పాలు నీళ్లలా ఎందుకు కలిసిపోయారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి వినోద్కుమార్ను ఓడించారన్నారు. నగరంలో భూ కబ్జాలపై స్థానిక ఎంపీగా సంజయ్ ఎందుకు మాట్లాడడంలేదన్నారు. స్మార్ట్సిటీ, గ్రానైట్ అక్రమాలపై ప్రశ్నించాల్సిన ఎంపీ ఎందుకు మౌనంగా ఉన్నాడని, ఎంపీ విధానాలను నిలదీయాల్సిన ఎమ్మెల్యే ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఎన్నిలకు ముందు సంజయ్ ఆస్కార్అవార్డు స్థాయిలో నటిస్తారని, ఒకసారి భార్య తాళి అమ్ముకున్నానని, మరోసారి ఎంఐఎం దాడి చేసిందని, ఇంకోసారి మూర్చవచ్చి పడిపోతాడన్నారు. నగరాన్ని లండన్ చేస్తాం, అద్ధంలా మారుస్తామని కేసీఆర్ చెప్పారని ఏమైందన్నారు. తీగలవంతెన నిర్మాణ అక్రమాలపై విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వాళ్లు లోపలికి పోవుడేనన్నారు. తాము అధికారంలోకి రాగానే భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని చెప్పి చేసి చూపిస్తున్నామని, అదే కాంగ్రెస్ పాలన అని చెప్పారు. భూ కబ్జాల్లో ఎవరు జైలుకు వెళ్తున్నారో ప్రజలు చూస్తున్నారన్నారు. ఏ పార్టీ వాళ్లయినా భూ ఆక్రమణలకు పాల్పడితే వాపసు ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ముగిశాక నగరంలో పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, నాయకులు వెలిచాల రాజేందర్రావు, వైద్యుల అంజన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు హైకోర్టు న్యాయమూర్తి రాక
కరీంనగర్క్రైం: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి వేణుగోపాల్ శనివారం కరీంనగర్కు రానున్నారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11.30గంటలకు మైసమ్మగూడ కొంపల్లిలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల 13వ గ్రాడ్యుయేషన్డేలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు మంకమ్మతోటలోని ఆయన నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 5గంటలకు కరీంనగర్లోని వెంకట్ ఫౌండేషన్ (బాలగోకులం) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆదివారం మంకమ్మతోటలోని ఆయన నివాసంలో సివిల్ సర్వీసెస్–2023 ఫలితాలలో విజయం సాధించిన కరీంనగర్ జిల్లాకు చెందిన నందాల సాయికిరణ్, కొలనుపాక సహనకు అభినందనలు తెలిపి, వారితో అల్పాహార విందులో పాల్గొంటారు. ఉదయం 11గంటలకు చింతకుంట లోని ఓ ఫంక్షన్హాల్లో జరిగే ఒక వివాహానికి హాజరై అనంతరం హైదరాబాద్ వెళ్తారు. ధాన్యం కొనుగోళ్లపై నజర్ ● పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకంకరీంనగర్ అర్బన్: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేలా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక అధికారులను నియమించారు. మందకొడిగా కొనుగోళ్లు సాగుతుండటం.. మేఘాలు కమ్ముకోవడంతో అకాల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించడంతో చర్యలను ముమ్మరం చేశారు. జిల్లాలో 341 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా డీసీ ఎంఎస్, ప్యాక్స్, ఐకేపీ, హకా కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో 4.50లక్షల మె ట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటికి కొనుగోలు చేసింది అరకొరే. ఈ నేపథ్యంలో కలెక్టర్ ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. డీఆర్డీవో వి.శ్రీధర్కు గంగాధర, రామడుగు మండలాలు కేటాయించగా జిల్లా పౌరసరఫరాల అధికారి యం.గౌరీశంకర్కు హుజూరాబాద్, శంకరపట్నం, పౌరసరఫ రాల సంస్థ డీఎం ఎం.రజినీకాంత్కు తిమ్మాపూర్, మానకొండూరు, జిల్లా మార్కెటింగ్ అధి కారి యం.పద్మావతికి కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, చొప్పదండి, జిల్లా వ్యవసాయ అధి కారి బి.శ్రీనివాస్కు గన్నేరువరం, చిగురుమామిడి, ఎస్.రామానుజచార్యను సైదాపూర్, వీణవంక, డీసీయంఎస్ ఆర్.వెంకటేశ్వర్రావు ను ఇల్లందకుంట, జమ్మికుంట మండలాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు. క్వింటాల్ పత్తి రూ.7,350 జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.7,350 పలికింది. శుక్రవారం మార్కెట్కు 43 వాహనాల్లో 565 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకొచ్చారు. క్వింటాల్కు మోడల్ ధర రూ.7,250, కనిష్ట ధర రూ.6,800 పలికింది. గన్నీ సంచుల్లో ఏడుగురు రైతులు ఆరు క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. క్వింటాల్కు గరిష్ట ధర రూ.6,000, మోడల్ ధర రూ.5,500, కనిష్ట ధర రూ.5,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్కు శని, ఆదివారాలు సాధారణ సెలవులు ఉంటాయని సోమవారం యార్డులో యథావిధిగా క్రయవిక్రయాలు కొనసాగుతాయని కార్యదర్శి గుగులోతు రెడ్డినాయక్ పేర్కొన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్ అభ్యర్థికి నాలుగు ఉద్యోగాలుకరీంనగర్: జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో 2019 బ్యాచ్కు చెందిన గొర్రె కార్తీక్ యూ నియన్ బ్యాంకు కరీంనగర్లో ప్రొబెషనరీ ఆఫీసర్(పీవో)గా ఎంపికై , అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారని స్టడీ సర్కి ల్ డైరెక్టర్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఆయన ఐబీపీఎస్ ద్వారా యూనియన్ బ్యాంక్లో క్లర్క్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆఫీస్ అసిస్టెంట్, కరీంనగర్ డీసీసీబీలో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలూ సాధించాడన్నారు. కార్తీక్ను ఎస్సీ అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ నతా నియేల్, స్టడీ సర్కిల్ స్టాఫ్, అధ్యాపకులు అభినందించారు. కరీంనగర్ బ్రాంచి నుంచి ఇప్పటివరకు 9 బ్యాచ్లలో 900 మందికి ఉచిత శిక్షణ ఇవ్వగా 224 ఉద్యోగాలు సాధించారని డైరెక్టర్ పేర్కొన్నారు. -
దమ్ముంటే కాంగ్రెస్ను టచ్ చేయండి
సిరిసిల్లటౌన్/కరీంనగర్ కార్పొరేషన్: అధికారం నుంచి ప్రజలు తిరస్కరించినా కేసీఆర్, కేటీఆర్లకు అహం పోలేదని, తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటుండ్రని.. దమ్ముంటే కాంగ్రెస్ను టచ్ చేయండని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థులుగా నిలబెట్టిన వారే ఆ పార్టీ అవినీతి, నియంతృత్వంపై ఛీత్కరించుకుంటూ పార్టీని వీడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన అందించే కాంగ్రెస్పైనే ప్రజల ఆశీర్వాదం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలేవీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలు తెలువనోళ్లు రాజకీయం చేస్తే.. ఇట్లానే ఉంటుందని బీఆర్ఎస్, బీజేపీలను ఉద్దేశించి విమర్శించారు. ఆ పార్టీల నియంతృత్వంపై ప్రజలు విసిగిపోయారని, రాహుల్ నేతృత్వంలో అందించే ప్రజాపాలనకే రానున్న ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటై సిరిసిల్లకు కేటాయించిన మెగా టెక్స్టైల్ క్లస్టర్ను వరంగల్కు తరలించి ఇక్కడి కార్మికుల ఉసురు పోసుకున్నారని ధ్వజమెత్తారు. కరీంనగర్ నుంచి పార్టీ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని కోరారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, స్థానిక నాయకులు నాగుల సత్యనారాయణగౌడ్, సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. కూడబల్కొనే బీజేపీ, బీఆర్ఎస్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ కూడబల్కొని చెబుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్లో మాట్లాడారు. 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేసీఆర్ అసహనంతో, పిచ్చిపట్టి మాట్లాడుతున్నారన్నారు. రైతుల సమస్యలు, ప్రభుత్వం కూలిపోవడం, రేవంత్రెడ్డి బీజేపీతో కలవడం..ఏ అంశమైనా ఈ రెండు పార్టీలు ఒకే మాట మాట్లాడుతున్నాయని, కుమ్మక్కుకు ఇదే నిదర్శనమన్నారు. ఉత్తర భారత్లో బలంగా ఉన్నామనుకొన్న బీజేపీ కోటలకు బీటలువారుతున్నాయని, అందుకే దక్షిణ భారత్ మీద అమిత్షా దృష్టి పెట్టారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు పూర్తి చేసి ఇవ్వాల్సిన టోకెన్ బిల్లులు రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లున్నాయన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలను సంతృప్తి పరచడానికి వందల జీవోలు తెచ్చారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులే ఆ పార్టీని వీడుతున్నరు.. రాష్ట్ర విభజన హామీలేవీ బీజేపీ నెరవేర్చలేదు.. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. మంత్రి పొన్నం ప్రభాకర్ -
● మంత్రి పదవికి రాజీనామా చేసిరా.. ఎవరికి ప్రజాదరణ ఉందో తేల్చుకుందాం ● బండి సంజయ్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ లీడర్లు
కరీంనగర్టౌన్: గత కొద్ది రోజులుగా బీజేపీ, బండి సంజయ్పైన మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నాయకు లు తీవ్రంగా స్పందించారు. ఇకనైనా పిచ్చివాగుడు మానుకోవాలని హెచ్చరించారు. పొన్నంకు దమ్ముంటే నేరుగా పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ కుమార్ తరఫున పార్టీ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్ డి.శంకర్, కార్పొరేటర్ రమణారెడ్డి తదితరులు శుక్రవారం మధ్యాహ్నం కరీంనగర్ కల్టెకరేట్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే విషయాన్ని పొన్నం మరిచిపోయారని అన్నారు. చివరకు న్యాయస్థానాలపై కూడా ఆరోపణలు చేస్తూ లిక్కర్స్కాం నిందితుడు శరత్ చంద్రారెడ్డి బీజేపీకి రూ.500 కోట్ల ఎలక్ట్రోబాండ్స్ ఇయ్యగానే... కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిందని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఇచ్చింది గౌరవ సుప్రీంకోర్టు అని, బెయిల్కు, బాండ్స్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. వెంటనే సుప్రీంకోర్టు పొన్నం వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేయాలని కోరారు. ఏ సర్వే చూసినా బండి సంజయ్ బంపర్ మెజారిటీతో గెలవబోతున్నరని తేలడంతో పొన్నంకు ఫ్రస్టేషన్ ఎక్కువైందని, అందుకే కరీంనగర్ నుంచి అభ్యర్థి ఎవరో కూడా తేల్చలేకపోతున్నరని విమర్శించారు. ఘోరంగా కాంగ్రెస్ ఓడిపోతే మంత్రి పదవికే ఎసరొస్తుందనే భయం పొన్నంకు పట్టుకుందన్నారు. మంత్రిని అని మరిచిపోయి పొన్నం అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ సభ్యసమాజం అసహ్యించుకునేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ ఇకనైనా బండి సంజయ్పై అవాకులు చవాకులు మానుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు. -
పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు
● ఓటింగ్శాతం పెరిగేలా ప్రత్యేక చర్యలు ● పార్లమెంటు నియోజకవర్గంలో 2,194 పోలింగ్ కేంద్రాలు ● ఎన్నికల విధులకు 5,500 మంది సిబ్బంది ● ‘సువిధ’కు వచ్చిన దరఖాస్తులు 168 ● తనిఖీల్లో రూ.7కోట్లు స్వాధీనం ● నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతిసాక్షిప్రతినిధి,కరీంనగర్: ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎ న్నికలు జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో 17,92,000 మంది ఓటర్లు ఉన్నారని, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదు జిల్లాల పరిధిలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఉందని వెల్ల డించారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లు 50వేలు అధికంగా ఉండడం విశేషమని అన్నారు. 46,000 మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యారని, 13,200మంది 85ఏళ్ల పైబడిన వృద్ధులు ఉన్నారని తెలిపారు. 41,500 మంది దివ్యాంగులు ఉన్నారని, వీరి కోసం ప్రత్యేకంగా వీల్చైర్లు అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించారు. 8,552 ఈవీఎంలు.. 5,500 సిబ్బంది ఎన్నికల్లో 8552 ఈవీఎంలు ఉపయోగిస్తున్నామని చెప్పారు. 2,194 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 5500 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని వెల్లడించారు. 85ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటినుంచే ఓటు వేసేలా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. 12వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. శుక్రవారం వరకు 3 నామినేషన్లు దాఖలు అయ్యాయని, ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్ల గడువు ముగుస్తుందని, 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 68 ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై చర్యలు తీసుకున్నామని అన్నారు. సువిధ పోర్టల్ ద్వారా సభలు, సమావేశాలు, ప్రచారానికి అనుమతుల కోసం 168 దరఖాస్తులు వచ్చాయని, దాదాపు 105 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. పోలీసు తనిఖీల్లో భాగంగా దాదాపు రూ.7కోట్ల వరకు నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో అర్హులందరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డీఆర్వో పవన్ కుమార్, సమాచార పౌరసంబంధాలశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ కొండయ్య, ఏపీఆర్ఓ వీరాంజనేయులు పాల్గొన్నారు. ఇంటింటికీ ఓటర్ స్లిప్పుల పంపిణీ కరీంనగర్/కరీంనగర్ అర్బన్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటికీ ఓ టరు స్లిప్పులు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఓటరు స్లిప్పులు పంపిణీ చేసే సమయంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు సిబ్బందితో వెంట ఉండి ఓటరు జాబితాను చెక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో బెల్ట్షాపులు మూసివేస్తామని అన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను రాజకీయ పార్టీల నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. పరిష్కరిస్తామని అన్నారు.ఖర్చులపై ఫిర్యాదు చేయొచ్చు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ ఫిర్యాదులు సూచనలు, సలహాల కోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిశీలకులను సంప్రదించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు అశ్విని కుమార్ పాండే మొబైల్ నంబర్ 9032659531కు ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.ఎన్నికల ప్రక్రి య పూర్తి అయ్యే వరకు పరిశీలకులు జిల్లాలోనే ఉండి ఎన్నికల వ్యయానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తారని తెలిపా రు. కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ పమేలా సత్పతిని ఎన్నికల వ్యయ పరిశీలకులు అశ్వినీ కుమార్ పాండే శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈవీఎంల తరలింపులో జాగ్రత్తలు తప్పనిసరి మొదటి ర్యాండమైజేషన్లో భాగంగా కేటాయించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఆయా నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్రూంలకు అప్రమత్తంగా తరలించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్లోని ఈవీఎం గోదాంను సందర్శించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలు, వీవీప్యాట్ల తరలింపు ప్రక్రియను పరిశీ లించారు. ఈవీఎంల తరలింపులో ఎక్కడా తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
తనిఖీల్లో భారీగా నగదు పట్టివేత
కరీంనగర్ క్రైం: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కరీంనగర్ నగరంలోని వివిధ ఠాణాల పరిధిలో శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. రూ.15.82 లక్షలు పట్టుకున్నట్లు తెలిపారు. బడింది. వారి వివరాల ప్రకారం.. కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని రాజీవ్ చౌక్లో కరీంనగర్ దుర్గమ్మగడ్డకు చెందిన జనగం సుమన్ కల్యాణ్ వద్ద రూ.7 లక్షలు, కరీంనగర్ టూ టౌన్ పరిధిలోని గీతాభవన్ చౌరస్తా వద్ద మానకొండూర్కు చెందిన నెల్లి భాస్కర్ వద్ద రూ.1,11,900, ఐబీ చౌరస్తా వద్ద కరీంనగర్లోని కోతిరాంపూర్కు చెందిన కోల ప్రదీప్కుమార్ వద్ద రూ.5,70,900, కరీంనగర్ త్రీ టౌన్ పరిధిలో కట్టారాంపూర్కు చెందిన గాండ్ల సురేశ్ వద్ద రూ.2 లక్షలు స్వాధీనం చేసుకొని, సీజ్ చేశారు. వేములవాడలో రూ.5.67 లక్షలు..వేములవాడ: పట్టణ పరిధిలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ టీం శుక్రవారం ఓ వ్యక్తి వద్ద రూ.5.67 లక్షలు పట్టుకుంది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్తున్నట్లు అతను తెలిపాడన్నారు. కానీ, సంబంధిత ఆధారాలు చూపించకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో అందజేశామన్నారు. ఏఈఈ వెంకటరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ భిక్షపతి, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, కానిస్టేబుల్ శ్రీనివాస్ తదితరులున్నారు. అంతర్ జిల్లా చెక్పోస్టు వద్ద రూ.93 వేలు..మెట్పల్లిరూరల్: బండలింగాపూర్ గండి హనుమాన్ ఆలయ సమీపంలోని అంతర్జిల్లా సరిహద్దు చెక్పోస్టు వద్ద ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారులో తరలిస్తున్న రూ.93 వేలను పట్టుకున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. సంబంధిత ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసి, జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించామన్నారు. రాయపట్నం చెక్పోస్టు వద్ద రూ.2 లక్షలు..ధర్మపురి: రాయపట్నం చెక్పోస్టు వద్ద రూ.2 లక్షలు పట్టుకున్నట్లు ధర్మపురి పోలీసులు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాయపట్నం వద్ద వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా నగదు తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. తదుపరి చర్యల నిమిత్తం డబ్బులను సంబంధిత అధికారులకు పంపించినట్లు తెలిపారు. సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎప్సెట్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
● స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బట్టు మల్లయ్యకరీంనగర్: నగరంలోని సప్తగిరికాలనీ కేజీబీ వీలో నిర్వహిస్తున్న ఎప్సెట్ ప్రత్యేక శిక్షణ తరగతులను స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బట్టు మల్లయ్య శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న ఎప్సెట్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సబ్జెక్టులకు సంబంధించిన అనుమానాలను శిక్షకులను అడిగి, నివృత్తి చేసుకుంటూ, కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించాలన్నారు. కేజీవీబీల్లో చదివేవారు చాలా పేదరికం నుంచి వస్తారని, వారికి ఇబ్బందులు కలగకుండా మన సొంత పిల్లల్లా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో డీఈవో జనార్దన్రావు, జిల్లా జెండర్ అండ్ ఈక్విటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ డెబోరా కృపారాణి, కేజీబీవీ ప్రత్యేక అధికారి పుష్పరాణి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం ట్రాక్టర్ను ఢీకొన్న లారీ సుల్తానాబాద్రూరల్: కాట్నపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై ధాన్యం లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ లారీ వెనుక నుంచి ఢీకొంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గర్రెపల్లిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లోడ్తో ట్రాక్టర్ సుల్తానాబాద్కు వస్తోంది. ఈక్రమంలో కరీంనగర్ నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తాపడగా డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, అందులో ధాన్యం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. దాదాపు గంటకుపైగానే వాహనాలు నిలిచి ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. వేంకటేశ్వరస్వామి ఫొటోలు ధ్వంసం● జగదేవుపేట ఆలయంలో దుండగుల దుశ్చర్యవెల్గటూర్(ధర్మపురి): మండలంలోని జగదేవుపేట శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దుండగులు ప్రవేశించి, స్వామివారి ఫొటోలు, పూజా సామగ్రి ధ్వంసం చేశారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి వెళ్లి, స్వామివారి ఫొటోలు, కలశం, ఆలయ ప్రాంగణంలోని తులసి గద్దెను పక్కనున్న కాలువలో, పంట పొలాల్లో పడేశారు. ఈ ఘటనపై ఆలయ కమిటీవారు, దీక్షాస్వాములు శుక్రవారం ఉదయం వెల్గటూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ఉమాసాగర్ ఆలయాన్ని సందర్శించి, వివరాలు సేకరించారు. గ్రామానికి చెందిన కొందరు అన్యమతస్తులే ఇలా చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ట్రాఫిక్.. క్లియర్!
కరీంనగర్క్రైం:నగరంలోని మార్కెట్ ఏరియాల్లో విపరీతమైన రద్దీ ఉంటోంది. వాహనాలు వెళ్లడం కష్టతరమవడంతో పాటు పార్కింగ్ ప్రదేశాలు లేక ప్రజలు ఇన్ని రోజులు నరకం చూశారు. నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలిపితే ఫైన్లు పడడం, పార్కింగ్కు ప్రత్యేక స్థలాలు లేకపోవడంతో నానా తిప్పలు పడేవారు. ముఖ్యంగా టవర్సర్కిల్, ప్రధాన కూరగాయాల మార్కెట్, ప్రకాశం గంజ్కు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో వాహనాలు నిలపడం కష్టంగా మారింది. ఈ తరుణంలో పోలీసులు పార్కింగ్కు ప్రత్యేక స్థలాలు కేటాయించి పార్కింగ్ కష్టాలకు పోలీసులు పరిష్కారం చూపడంతో వాహనదారులకు ఊరట కలిగింది. ● నగరంలో టవర్సర్కిల్, మార్కెట్ ప్రాంతంలో రద్దీ ● పెరుగుతున్న వాహనాలు ● కష్టాలకు బ్రేక్ వేసిన ట్రాఫిక్ పోలీసులు ● పార్కింగ్కు స్థలాలు కేటాయింపు రెండు ప్రదేశాల్లో పార్కింగ్ నగరంలో అతి ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతమంటేనే టవర్సర్కిల్, ప్రధాన కూరగాయల మార్కెట్, ప్రకాశం గంజ్లు. ఈ ప్రాంతాలు దుస్తులు, కూరగాయాలు, భవన నిర్మాణ సామగ్రి, ప్లాస్టిక్ దుకాణాలు, నూనె, ఇతరత్రా వ్యాపారాలకు నిలయం. ఎక్కువగా ఈ ప్రాంతాలకు నగరవ్యాప్తంగా ఉండే ప్రజలతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు, వ్యాపారులు వస్తుంటారు. దీంతో సుమారుగా రోజు ఉదయం నుంచి రాత్రి వరకు సుమారుగా 1 లక్ష మంది వరకు వచ్చిపోతుండగా 40 వేలకు పైగా వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. గతంలో పాత టెలిఫోన్ భవన్ వద్ద గల చౌరస్తా వద్ద రోడ్డు మీదనే కార్లు పార్కింగ్ చేయడం, బైకులు రోడ్డు మద్యలోనే పార్కింగ్ చేస్తుండడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగి వాహనాలు నిలిచిపోతుండేవి. కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదురుగా గల మున్సిపల్ స్థలంతో పాటు ఇంటిగ్రెటెడ్ మార్కెట్లలో రెండు ప్రదేశాల్లో ప్రత్యేకంగా వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేశారు. వాహనదారులు గతంలో ఎదుర్కొన్న ట్రాఫిక్ సమస్యలైన ట్రాఫిక్ సిగ్నల్, పార్కింగ్ ప్లేస్లు లేక పడిన రెండు సమస్యలకు పోలీసులు పరిష్కారం చూపారు. కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో శ్రీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వేదపండితులు సుధాకర్శర్మ, కమలాకర్, శ్రీనివాస్శర్మల ఆధ్వర్యంలో శ్రీ భూనీలా–చెన్నకేశవ స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బుర్ర తిరుపతిగౌడ్, కరీంనగర్ సింగిల్విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, మాజీ సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు కూర నరేశ్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, అనంతరెడ్డి, మాసగోని రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా పార్కింగ్ కోసం నగరంలో వాహనదారులు ఎదుర్కొంటున్న పార్కింగ్ సమస్యకు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం రెండు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశాం. గతంలోని మున్సిపల్ స్థలం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం ఏర్పాటు చేసిన స్థలాల్లో పార్కింగ్ చేపిస్తున్నాం. రోడ్ల మీద, రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. వాహనదారులు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేసిన స్థలంలోనే పార్కింగ్ చేయాలి. – ఎండీ. కరీం ఉల్లా ఖాన్, ట్రాఫిక్ సీఐ -
రైతులు నష్టపోకుండా చర్యలు
● జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి కరీంనగర్రూరల్/చొప్పదండి: ధాన్యం తూకంలో కోతలేకుండా రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రాల నిర్వాహకులపై ఉందని జిల్లా మార్కెటింగ్ అధికారి వి.పద్మావతి అన్నారు. శుక్రవారం కరీంనగర్ మండలం నగునూరు, చొప్పదండి మండలం కొలిమికుంట, గుమ్లాపూర్, భూపాలపట్నం, వెదురుగట్టలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రతీకేంద్రంలో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. ప్యాడీక్లీనర్ల ద్వారా ధాన్యాన్ని శుభ్రపరుచుకోవాలని కోరారు. తూకంలో కోత లేకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని, రైసుమిల్లర్లు ధాన్యం దింపుకోవడంలో ఇబ్బందులకు గురిచేసినట్లయితే సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం డీఎంవో చొప్పదండి మార్కెట్యార్డును సందర్శించారు. మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. ఏపీఎం నర్మదతోపాటు స్థానిక పీఏసీఎస్, ఐకేపీ అధికారులు ఉన్నారు. -
ఆరుగురు ఆర్టీసీ ఉద్యోగుల సరెండర్!
హుజూరాబాద్: స్థానిక ఆర్టీసీ డిపో పరిధిలో విధులు నిర్వహించే ఆరుగురు ఉద్యోగులను ఆర్ఎం కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో వారు శుక్రవారం ఆర్ఎం ఆఫీస్లో రిపోర్టు చేసినట్లు సమాచారం. ఇటీవల ఓ ఆర్టీసీ డ్రైవర్ వద్ద హుజూరాబాద్ డిపో మేనేజర్ సామల శ్రీకాంత్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం విధితమే. ఈ క్రమంలో డిపోలో విజిలెన్స్ అధికారులు రెండు రోజులపాటు విచారణ చేపట్టారు. ఇందులో డీఎం శ్రీకాంత్ అవినీతి అక్రమాలకు సహకరించినట్లు తేలిన డిపో పరిధిలోని ఆరుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. డీఎం శ్రీకాంత్ చిన్న చిన్న కారణాలు చూపుతూ, అనుమతి లేకుండా అత్యవసరంగా సెలవులు తీసుకున్న ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసి, డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వని పక్షంలో పలువురికి చార్జీ మెమోలు ఇచ్చినట్లు తేల్చారని సమాచారం. వాటిని విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి, కరీంనగర్ ఆర్ఎం కార్యాలయానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇన్చార్జి డీఎంగా వెంకటేశ్వర్లు.. హుజూరాబాద్ ఇన్చార్జి డీఎంగా హుస్నాబాద్ డీఎం వెంకటేశ్వర్లును నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆర్ఎం ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ డీఎంకు సహకరించడమే కారణం? -
47 పెండింగ్ చలాన్ల వాహనం పట్టివేత
జగిత్యాల క్రైం: జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద జగిత్యాల పట్టణ సీఐ వేణుగోపాల్, ఎస్సై మన్మదరావు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రాయికల్ మండలంలోని కిష్టంపేటకు చెందిన జనార్దన్ తన బైక్పై వస్తుండగా ఆపారు. ఆ వాహనంపై 47 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించి, సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో యజమాని జనార్దన్ మొత్తం రూ.12,805 చెల్లించి, సంబంధిత రసీదును పోలీసులకు అందజేయడంతో వాహనాన్ని అప్పగించారు. ● రూ.12,805 చెల్లించిన యజమాని
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కౌంటీల్లో ఆడనున్న సన్రైజర్స్ మాజీ బౌలర్
ఉచిత రేషన్తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీ
బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement